చెడుగుడు ఆడుకొంటున్న కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీలు

Publish Date:Mar 31, 2013

Advertisement

 

ఇటీవల యుపీయే ప్రభుత్వానికి డీయంకే పార్టీ మద్దతు ఉపసహరించుకొన్ననాటి నుండి, యుపీయేకి బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాది పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో చెడుగుడు ఆడుకోవడం మొదలు పెట్టింది. అయితే ఆ ఆటను కాంగ్రెస్ పార్టీయే మొదలుపెట్టడం విశేషం.

 

ఆ పార్టీకి చెందిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రసాద్ వర్మ, సమాజ్ వాది పార్టీ తమకు మద్దతు ఇస్తున్నవిషయాన్నీ కూడా పట్టించుకోకుండా సమాజ్ వాది అధినేత ములాయం సింగుకు ఉగ్రవాదులతో సంబందాలు ఉన్నాయని, యుపీయేకు మద్దతు ఇచ్చేందుకు డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేయడంతో, బేణీ ప్రసాద్ వర్మ చేత వెంటనే క్షమాపణలు చెప్పించి ఆయనని పదవి నుండి వెంటనే తొలగించాలని లేకపోతే మద్దతు ఉపసంహరిస్తామంటూ సమాజ్ వాది పార్టీ బెదిరించేసరికి, ప్రధాని మన్మోహన్ సింగు, సోనియా గాంధీలిరువురూ కూడా ములాయం ముందు చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరక తప్పలేదు.

 

అయితే, తమను సీబీఐ చేత వేదిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ది చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్న సమాజ్ వాది అధినేత ములాయం మాత్రం బెట్టు సడలించలేదు. పైగా బీజేపీ నాయకుడు అద్వానీని పొగుడుతూ మాట్లాడి యుపీయే నుండి యన్డీయే వైపు జంపు చేస్తానని సూచన ప్రాయంగా తెలియజేసారు. దానితో అప్రమత్తమయిన కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యామ్నాయ పార్టీల కోసం వెదికినప్పుడు లలిత, మమత అనే ఇద్దరు వీరనారీ మణులు యుపీయే కు మద్దతు ఇచ్చేందుకు సిద్దమని సూచన ప్రాయంగా చెప్పడంతో ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సమాజ్ వాది పార్టీతో చెడుగుడు ఆటకు దైర్యంగా సై అంది.

 

మొట్ట మొదట ప్రధాని డా.మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా 2014వరకు ఎటువంటి డోకా లేదని అన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషిద్ అల్వీ మాట్లాడుతూ ములాయం సింగ్ ఎన్డీయే వైపు చూడటాన్ని తప్పు పట్టారు.

 

మద్దతు ఉపసంహరిస్తామని బెదిరిస్తే బయపడుతుందనను కొన్న కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా ఎదురు దాడి మొదలుపెట్టేసరికి ములాయం సింగుకు కూడా పరిస్థితులు మళ్ళీ మారాయని అర్ధం అయ్యింది. తమ మద్దతే కనుక కాంగ్రెస్ అవసరం లేకపోతే, ఇక సీబీఐతో ఏమి కొత్త తంటాలు వస్తాయోనని బయపడిన ములాయం సింగ్ “యుపీయే ప్రభుత్వం పడిపోవాలని మేము కూడా కోరుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీతో మా సంబందాలు మరీ అంత ఘోరంగా ఏమి లేవు. ఇప్పటికీ చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చునని మేము నమ్ముతున్నాము,” అని ఆయన అన్నారు.

 

అయితే ఆయన ఆ మాట అన్న తరువాత కూడా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. మళ్ళీ బేణీ ప్రసాద్ వర్మ మీడియా ముందుకు వచ్చి “వచ్చే ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాది పార్టీకి మహా అయితే నాలుగో, ఐదో పార్లమెంటు సీట్లు రావచ్చును. ఎందుకంటే, ములాయం సింగ్ రాష్ట్ర ముస్లిం ప్రజలందరినీ మోసం చేసాడు. ఇప్పుడు ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ కూడా అదే పని చేస్తున్నాడు. అందువల్ల వచ్చే ఎన్నికల తరువాత ఆ పార్టీకి రాష్ట్రంలో అంత్యక్రియలు తప్పవు” అని అన్నారు. అందుకు ఆ పార్టీ నేతలు కూడా ఘాటుగానే స్పందించినప్పటికీ, ఈ సారి మాత్రం సోనియా గాంధీ కానీ, ప్రధాని గానీ మంత్రి బేణీ ప్రసాద్ మాటలకు విచారం వ్యక్తం చేయలేదు, కనీసం ఖండించ లేదు కూడా.

 

కాంగ్రెస్ పద్దతి ఎలా ఉందంటే ఏరు దాటేవరకు ఏటి మల్లన్న, ఏరు దాటగానే బోడి మల్లన్న అంటున్నట్లుందని ఒక పక్క విమర్శిస్తూనే యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకే సమాజ్ వాది పార్టీ మళ్ళీ సిద్దపడటం చూస్తే బహుశః సీబీఐ భయం వలననే అయిఉండాలి. కానీ అదే సమయంలో నవంబర్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని ములాయం సింగ్ జోస్యం కూడా చెప్పడం మరో విశేషం.

By
en-us Political News

  
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం (మార్చి 19) ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ముప్పావుగంట పాటు జరిగిన ఈ భేటీ తరువాత చంద్రబాబు ఎక్స్ వేదిగా ఆంధ్ర ప్రదేశ్ పురోగతికి ఈ భేటీ అత్యంత కీలకం అంటూ పేర్కొన్నారు.
వైసీపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు పార్టీ నుంచి ఒత్తిడులు, ఉద్యమాలు ఆందోళనలు చేయాలని పిలుపులు, పురమాయింపులు జారీ అవుతున్నాయి! మరొకవైపు ఏదైనా ఆందోళన చేద్దాం అనుకుంటే ప్రజల నుంచి స్పందన కరువు! ఏం చేయాలనుకున్నా కూడా నలుగురు జనాన్ని పోగేయాలంటే వేలు, లక్షలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి.
 మాజీ  ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి ఎసిబి నోటీసులు   ఎపి  ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. వైకాపా  హయాంలో ఆయన జగన్ మీడియా, వైసీపీ అనుకూల మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు దోచి పెట్టారు.
వైసీపీ చేసేవన్నీ దొంగ రాజకీయాలే. ఒక్క విషయంలో కూడా చెప్పినది చెప్పినట్లు చేసిన దాఖలాలు కనిపించవు. విపక్షంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానికి బేషరతు మద్దతు అంటూ ప్రకటించి.. 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించింది. మూడు రాజధానులంటూ మూడుముక్కలాటతో దొంగ రాజకీయాలు నెరపింది.
మాజీ సీఎం కేసీఆర్‌కు తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు షాకిచ్చాయి. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీజేపీ నాయకులు బుధవారం (మార్చి 19) టులెట్‌ బోర్డు పెట్టారు. గజ్వేల్‌ ఎమ్మెల్యే అయిన మాజీ సీఎం కేసీఆర్‌ నియోజకవర్గానికి రాకపోవడంపై వాంటెడ్‌ ఎమ్మెల్యే అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచి 15 నెలలైనా కేసీఆర్‌ ఒక్కసారి కూడా గజ్వేల్‌ వైపు చూడలేదని బీజేపీ శ్రేణులు ఈ సందర్భంగా అన్నారు.
 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కేసులో టీవీ  యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తన న్యాయవాది తో కలిసి ఉదయం పది గంటల  పిఎస్  మంగళవారం సాయంత్రం విచారణకు రావాల్సిందగా పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ ఆమె హాజరు కాలేదు.
ఏపీలో గత వైసీపీ గత పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఐదేళ్ల జగన్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోయింది. పాలన అంటే దోచుకో, దాచుకో, వ్యతిరేకులపై దౌర్జన్యాలూ, దాడులు, అరెస్టులు, అక్రమ కేసులే అన్నట్లుగా జగన్ హయం సాగింది. జగన్ హయాంలో జనం నిత్యం భయంభయంగా బతికే పరిస్థితి ఉంది. ఏం మాట్లాడితే ఏ కేసు పెడతారో అన్న ఆందోళన అన్ని వర్గాలలో నెలకొంది.
ప్రముఖ యాంకర్, వైసీపీ అధికార ప్రతినిథి శ్యామలకు ఉచ్చు బిగుస్తున్నదా? అన్న ప్రశ్నకు ఔననే సమాధానం వస్తున్నది. నిబంధనలకు తిలోదకాలిచ్చి, చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
బడ్జెట్ గురించి చర్చ వచ్చినప్పుడు, బడ్జెట్ అంటే కేవలం అంకెల కుప్ప కాదు. బడ్జెట్ అంటే మన విలువలు, మన ఆశలు, ఆశయాల ప్రకటన. అలాగే, ఒక మంచి బడ్జెట్ నాణేనికి ఒక వైపు నుంచి మాత్రమే కాదు, రెండు వైపుల నుంచీ, (బొమ్మ బొరుసు) రెండూ చూపిస్తుంది అంటారు బడ్జెట్ విలువ తెలిసిన పెద్దలు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనే సంగతి ఆ పార్టీలోని నాయకులు అందరికీ అర్థం అవుతోంది. భవిష్యత్ లేని పార్టీలో ఉండడం కంటే.. రాజకీయాలు మానుకోవడమే బెటర్ అని కొందరు రాజీనామా చేస్తున్నారు. వెళ్లిపోయిన వారు పార్టీ మీద నిందలు వేయడం.. వెళ్లిపోయిన వారు ద్రోహులని పార్టీ నింద వేయడం చాలా మామూలు సంగతి. వైసీపీ నుంచి వెళ్లిపోయిన వారందరి గురించి జగన్ కూడా ఇలాగే మాట్లాడుతూ వచ్చారు.
సునీతా విలియమ్స్ 9 నెలల సుదీర్ఘ కాలం అంతరిక్షంలో చక్కుకుపోయి ఎట్టకేలకు భువికి చేరుకున్నారు. అయితే అంత కాలం అంతరిక్షంలో ఉన్న ఆమె ఇక్కడ భూమి మీద సాధారణ జీవితం గడపడం అంత సులభం కాదు. ఆమె కొంత కాలం ఐసోలేషన్ లో ఉండాల్సిందే.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (మార్చి 19) శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు 3 కోట్ల 97 లక్షల రూపాయలు.
కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది . వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పటికే టీడీపీ పాగా వేసింది. 2024 ఎన్నికలలో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏడింటిని కైవసం చేసుకున్న కూటమి జగన్‌కు షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.