సొంత పార్టీని టెన్షన్ పెడుతున్న సజ్జల కామెంట్స్

Publish Date:Jun 12, 2025

Advertisement

ఏపీలో వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు కాక  రేపుతున్నాయి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో కొమ్మినేని, కృష్ణంరాజు వివాదం నడుస్తున్న తరుణంలో  అమరావతి మహిళా రైతులపై సజ్జల కామెంట్స్ అగ్గికి అజ్యం పోసినట్లు అయింది. కొమ్మినేని అరెస్టు నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన సజ్జల.. కొమ్మినేని అరెస్టుకు ఖండిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైపీపీని పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టాయంటున్నారు. అమరావతి ప్రాంతంలో ఏ ముఖం పెట్టుకు తిరగాలని వైసీపీ నేతలే సజ్జలపై ఆగ్రహంతో ఉన్నారంట.

అమరావతి రైతులనును ఉద్దేశించి సంకర జాతి అంటూ జగన్ సలహాదారు, వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసి వ్యాఖ్యలు ఇప్పుటు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అటు కొమ్మినేని, కృష్ణంరాజు ఇష్యూ చల్లారకముందే సజ్జల రాజేసిన వివాదంతో ఆయనపై సొంత పార్టీ నేతలు సహా అందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సజ్జల తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

కొమ్మినేని, కృష్ణంరాజు వ్యాఖ్యలపై నిరసనలు తెలిపిన మహిళలను ఉద్దేశించి సజ్జల సంకర జాతి, పిశాచాలు, రాక్షసులు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సంకర జాతి వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన మహిళల ఆవేదనను తక్కువ చేసేలా ఉన్నాయన్న విమర్శలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 

ఇప్పటికే రాజధాని ప్రాంతంలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సజ్జల వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను మరింత ఇరకాటంలోకి నెట్టాయి. సజ్జలపై  రాజధాని రైతులు, మహిళలతో పాటు కూటమి పార్టీలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. సజ్జలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 

మహిళలను అలా అవమానించడం అనుచితమని, వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. సంకరజాతి పదప్రయోగం చేసిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. గత ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను తాను ప్రశ్నించినందుకు నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్‌లోని అన్ని గ్రామాల్లో తన ఫోటోలను చెప్పులతో కొట్టించారని.. ఇప్పుడిలా మాట్లాడుతున్న వైసీపీ నేతలను ఏం చేయాలని ప్రశ్నించారు.

ఇక టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సజ్జల వ్యాఖ్యలపై సీరియస్‌గా సోషల్ మీడియాలో స్పందించారు. అచ్చోసిన ఆంబోతులా సజ్జల వ్యాఖ్యలు చేస్తున్నారన్న శ్రీధర్ రెడ్డి... సజ్జల జగన్ గుమస్తా అని, రాష్ట్ర రాజకీయాలతో, ప్రజలతో సంబంధం లేని అటువంటి వ్యక్తికి రాజకీయ విమర్శలు చేసే హక్కు లేదని ట్వీట్ చేశారు. సజ్జలను రాష్ట్ర బహిష్కరణ చేస్తే రాష్ట్రానికి శ్రేయస్కరమన్నారు కోటంరెడ్డి. 

సజ్జల వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌ కూడా సీరియస్‌గానే ఉంది. సజ్జల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో..  వైసీపీపై విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వైసీపీ నేతలు.. సజ్జల వ్యాఖ్యలతో జనానికి ముఖం చూపించడానికి సంశయించే స్థితిలో పడ్డారంట. ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని భయపడుతున్నారంట. పార్టీ ఇప్పటికే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తరుణంలో వైసీపీలో నెంబర్ 2గా చెలామణీ అవుతున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి మరింత నష్టాన్ని చేస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ వివాదాన్ని రాజకీయంగా వినియోగించుకునే పనిలో పడటంతో వైసీపీపై  మరింత ఒత్తిడి పెంచుతోంది. సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను కూటమి  పార్టీలు ఎండగడుతున్నాయి. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ఇప్పటికే విమర్శలను మూటగట్టుకున్న పరిస్ధితి. తాజా పరిణమాలతో రాజధాని ప్రాంతానికి వైసీపీ పూర్తిగా దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వైసీపీ నాయకులపై ఇప్పటికే పలు కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత ఎపిసోడ్‌తో సజ్జల కూడా కేసుల్లో బుక్ అవుతున్నారు. మరి ఆయనపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి.

By
en-us Political News

  
ఇప్పుడు ఎటు చూసినా యుద్ధమే కనిపిస్తోంది .. దేశాల మధ్యనే కాదు, రాజకీయ పార్టీల మధ్యన కూడా యుద్ద వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే .. ప్రత్యర్ధి పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే, పార్టీల లోపల సాగుతున్న అంతర్గత కుమ్ములాటలలో కూడా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే.. ఉభయ దేశాలను అదిరించి, బెదిరించి దారికి తెచ్చింది నేనే.. కాల్పుల విరమణ చేయించింది నేనే... అంటూ పదే పదే ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక్క సారిగా యు టర్న్ తీసుకున్నారు.
కాంగ్రెస్ అధినేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన 55వ పుట్టిన రోజు గురువారం( జూన్ 19) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు, ఇండియా కూటమి నాయకులు, వందల వేల మంది రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం (జూన్ 18) జరిగిన ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత గాజర్ల రవి మృతదేహం కోసం ఆయన సోదరుడు, మాజీ నక్సల్ గాజర్ల అశోక్ రంపచోడవరం ఆస్పత్రికి చేరుకున్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగాలేక గంజాయి బ్యాచ్ ను,  ఉన్మాదులను, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లను కలుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్  అన్నారు.
ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టుల కీలక నేత నంబాల కేశవరావు సహా సీనియర్‌ నాయకులను వరుసగా కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు. మరో అగ్ర నాయకురాలు, ఏవోబీ కమిటీ సీనియర్‌ సభ్యురాలు రావి వెంకటగిరి చైతన్య అలియాస్‌ అరుణ, మరో నక్సల్‌ అంజూ కూడా ఈ ఘటనలో చనిపోయారు.
మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. బుధవారం (జూన్ 18) జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సత్తెన పల్లి పోలీసులు అంబటిపై కేసు నమోదైంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే వైసీపీ కంచుకోట అనేలా గత ఐదు సంవత్సరాలు పాలన సాగించారు. ఓవైపు పెద్దిరెడ్డి, ద్వారకానాథ రెడ్డి, మిథున్ రెడ్డి, మరో వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, ఇంకో వైపు కరుణాకర్ రెడ్డి ఇలా ఒక్కరేమిటి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే లు, వైసీపీ కీలక నాయకులు చేసిన హడావిడి అంతాఇంతా కాదు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి జూన్ 1 వరకూ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు బుధవారం (జూన్ 18) ఉత్తర్వులు జారీ చేసింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాజీ సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అయిన వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఈ కేసులో చెవిరెడ్డితో పాటుగా సన్నిహిత సహచరుడువెంకటేశ్ నాయుడికి కూడా కోర్టు రిమాండ్ విధించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు పూర్తియినా కూడా తిరుమలేశుని దర్శనానికి జనం రద్దీ ఇసుమంతైనా తగ్గలేదు. వారాంతం సమీపిస్తుండటంతో ఈ రద్దీ రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కడప నగరంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసి మునిసిపల్ కార్పొరేషన్ లో జెండా ఎగురవేసేందుకు తెలుగుదేశంపార్టీ శ్రేణులన్ని కష్టపడి పని చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి పిలుపు నిచ్చారు.
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని సీఎం పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.