పార్టీ పనులకే సజ్జల పరిమితం.. సలహాదారు పదవికి రాజీనామా?

Publish Date:Apr 19, 2024

Advertisement

జగన్ సర్కార్ లో ప్రభుత్వ అధికారుల పాత్ర కంటే సలహాదారుల ప్రాధాన్యతే ఎక్కువ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత మంది సలహాదారులున్నా.. వారందరిలోనూ సజ్జల పాత్ర, ప్రాధాన్యత ప్రత్యేకం. ఆయన కేవలం సలహాదారుగా మాత్రమే కాదు.. సకల శాఖల మంత్రి కూడా ఆయనే. అక్కడితో ఆగకుండా పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆయన కనుసన్నలలోనే నడుస్తాయి. అంతేనా సీఎం జగన్ విదేశీ పర్యటనలలో ఉన్న సమయంలో ఆయనే డిఫాక్టో సీఎం కూడా.  అంతే కాదు ప్రభుత్వం నుంచి లక్షల్లో వేతనం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికార ప్రతినిథిగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తరఫునే కాదు, పార్టీ తరఫున మాట్లాడాలన్నా మీడియా ఎదుట సజ్జలే సాక్షాత్కరిస్తారు.  సజ్జల గారి అతి కారణంగా వైసీపీలోనే పలుమార్లు అసంతృప్తి వ్యక్తమైన సంగతి తెలిసిందే.  

అటువంటి సజ్జల నోటికి తాళం వేసుకోమని ఎన్నికల సంఘం హుకుం జారీ చేసింది. కోర్టుల తీర్పులనే లెక్క చేయని వైసీపీ నేతలకు ఈసీ హుకుంలు ఒక లెక్కా అని తీసిపారేయలేం. కోడ్ అమలులో ఉంది కనుక ఈసీ వాక్కు ను తుచ తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఉంది.  వైసీపీ తరఫున రోజూ మీడియా ముందుకొచ్చే సజ్జల నోరుమూసుకోవలసిన పరిస్థితి వస్తే ఎలా?   ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందుతున్న 40 మంది ఏపీ సలహాదారులు కోడ్ పరిధిలోనికి వస్తారని ఈసీ పేర్కొంది. నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఇకపై అది కూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.  

ఈ ఆదేశాలు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎలా తీసుకున్నారో కానీ సజ్జల మాత్రం ఇజ్జత్ కీ సవాల్ అన్నట్లుగా భావిస్తున్నారు. తనను నియంత్రించడానికి ఈసీ ఎవరు అన్న భావన వ్యక్తం చేస్తున్నారు. అవసరం అయితే ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో పార్టీ కోసం పని చేయడానికైనా రెడీ అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల ప్రభ వెలుగుతోంది. సజ్జల నోటి వెంట ఒక మాట వచ్చిందంటే అది జగన్ నోటి వెంట వచ్చినట్లేనని పార్టీ వర్గాలు భావిస్తుంటాయి.  

అలాంటి ఆయన ఇక మీడియాకు కనిపించకూడదు అంటే పార్టీ వాయిస్ వినిపింొచడం ఎలా? అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  దీంతో సజ్జల ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా యేసేయడానికి రెడీ అయిపోయారని  పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  

అదీ కాక ఇప్పుడు ఎలాగూ ఎన్నికల కోడ్ ఉంది. జగన్ కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. దీంతో ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన కార్యకలాపాలు కానీ, వ్యవహారాలు కానీ ఏవీ ఉండవు. అటువంటప్పుడు హోదా కోసం, వేతనం కోసం ముఖ్య సలహాదారుగా కొనసాగడం కంటే  పార్టీ నేతగా ఉండి వ్యవహారాలు చక్కబెట్టడమే బెటర్ అని సజ్జల భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే  కీలక స్థానాలను అస్మదీయులు, అనుకూలురతో నింపేశారు.  ఇప్పుడు ఇక అధికారులకు దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలు వారికి అర్ధమైపోయాయి. సో పార్టీ నేతగా  ప్రచార కార్యక్రమాలు, మీడియాతో సమన్వయం వంటి పనులు చూడటమే బెటర్ అన్న అభిప్రాయంతో సజ్జల ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

By
en-us Political News

  
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
 ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల  అరెస్ట్ సంచలనమైంది. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.