Publish Date:May 24, 2023
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద వైసీపీ మూకలు, అవినాష్ అనుచరుల అరాచకత్వాన్ని ఘనత వహించిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమర్ధించారు. మీడియా రాతల వల్లే వారు రెచ్చిపోయారంటూ భాష్యం చెప్పారు.
అంతే కాదు మీడియా వార్తలు ఎలా రాయాలో జ్ణాన బోధ సైతం చేశారు. రెసిడెంట్ ఎడిటర్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆయనకు ఉన్న అనుభవంతో ఆయన మొత్తం ఏపీలో మీడియా వార్తలు ఏవి రాయాలి, ఎలా రాయాలి అన్న ఆదేశాలు జారీ చేశారా అని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇంతకీ మీడియాలో సీబీఐ రంగంలోకి దిగింది. ఇక అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకుపోవడమే తరువాయి అంటూ రాయకపోతే.. అసలిదంతా జరిగేది కాదు కదా? అని సజ్జల వారు సెలవిచ్చారు.
సీఎం క్యాంపు కార్యాలయంవద్ద మంగళవారం ( మే 22) మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా అంటే కార్యకర్తలు, అభిమానులు లేని పార్టీ అనుకుంటున్నారా? మీరు రాసే వార్తల్లో కుటుంబాన్ని పలుచన చేస్తున్నారు. తల్లి ఆరోగ్యం బాగోలేదంటే డ్రామా, నాట కాలంటారు.. వీటిని చూస్తే కడుపు మండకుండా ఉంటుందా? మీ మీదా ఇలాగే రాస్తే ఊరుకుంటారా? ఇలా అభిమానులకు ఆవేశం వచ్చేలా మీడియా వ్యవహరించింది కనుకే దాడి జరిగింది. లేకపోతే జరిగి ఉండేది కాదు అంటూ మాట్లాడారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని డ్రామాలాడుతూ అవి నాష్ తప్పించుకోవాలని చూస్తున్నారని రాస్తే ఎవరో ఒకరిద్దరు ఆవేశంతో ప్రతిస్పందించి దాడికి పాల్పడి ఉంటారు. వైసీపీ శ్రేణులన్నీ రియాక్ట్ అయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా నిజంగా మీడియాలో పని చేసే వారిపై దాడి దాడి జరగలేదు అంటూ కొత్త భాష్యం చెప్పారు.
మీడియా స్వచ్ఛను.. పరిధిని ప్రశ్నిస్తూ సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దాడిని సమర్థిస్తూ సజ్జల మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాజీ సీఎం చంద్రబాబు పై రాళ్ల దాడి చేసిన వారిని సమర్థిస్తూ..అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.. దాడి ..వైకాపా అభిమసులు, కార్యకర్తల భావప్రకటన అని సమర్థించారు.
డీజీపీ వ్యాఖ్యలు..తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే జరిగిందని అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి. రాళ్ల దాడులను అప్పటి డీజీపీ గౌతమ్ సావంగ్ భావప్రకటనాస్వేచ్ఛగా సమర్థిస్తే.. వ్యతిరేక వార్తులు చేస్తే దాడులు చేయరా అన్నట్లుగా ఇప్పుడు సజ్జల మాట్లాడుతున్నారు. తాము చెప్పినట్లుగా, తమకు అనుకూలంగా మాత్రమే మీడియా వార్తలు ఉండాలని, లేకపోతే దాడులు కొనసాగుతాయనీ సజ్జల అన్యాపదేశంగా మీడియాను హెచ్చరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-support-karnool-anarchy-25-155820.html
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.