అటవీ భూములనూ అప్పనంగా బొక్కేశారు.. వెలుగులోని సజ్జల కబ్జాల బాగోతం!?

Publish Date:Jan 2, 2025

Advertisement

వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌ అవినీతికి హ‌ద్దే లేదన్నట్లుగా సాగింది.  ఆ పార్టీ నేత‌లు అందినకాడికి ప్ర‌భుత్వ భూముల‌తోపాటు అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాలు చేసేశారు. మ‌రికొన్ని భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తన అనుకూల ట్ర‌స్టుల‌కు, కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టేసింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ మాత్రం త‌న హ‌యాంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగాపెట్టుకొని పాల‌న‌ను గాలి కొదిలేశారు. దీంతో వైసీపీ హ‌యాంలో రాష్ట్రం క‌నీస‌ అభివృద్ధికి నోచుకోక‌పోవ‌డంతో దేశంలోనే ఏపీ అట్ట‌డుగు స్థాయికి వెళ్లిపోయింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన త‌రువాత  2014లో తొలిసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని దేశానికే ఆద‌ర్శంగా తీర్చిదిద్దేందుకు త‌న‌ వంతు కృషి చేశారు. అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా ఏర్పాటు చేయ‌డంతోపాటు, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించాడు. అవినీతి, అక్ర‌మాల‌కు తావులేకుండా ఐదేళ్లు చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్లింది.  2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఒక్క చాన్స్ ప్లీజ్ అన్న జగన్ ను నమ్మి ఆయనకు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ముఖ్య‌మంత్రి చైర్‌లో కూర్చున్న మొద‌టి రోజు నుంచే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక్షేమాన్ని గాలికొదిలేసి.. రాష్ట్రాన్ని దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. 

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో స‌హా ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు, వైసీపీ ముఖ్య‌నేతలు ఐదేళ్ల కాలంలో ప్ర‌భుత్వ, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఐదేళ్లు మంత్రిగా కొన‌సాగిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుటుంబం పెద్ద ఎత్తున  భూముల‌కు క‌బ్జాచేసింది.  పెద్దిరెడ్డి తన సతీమణి, కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వంద‌ల ఎక‌రాల భూముల‌ను క‌బ్జా చేశారు. ఆయన తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులు వారి అనుచరులు, బినామీల పేర్లతో దోచుకున్న‌ భూములకు లెక్కేలేదు. విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి భూదందా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల భూక‌బ్జాల ప‌ర్వం మూడుపువ్వులు ఆరు కాయ‌లుగా సాగింది. దీనికితోడు రేష‌న్‌ బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించి కొంద‌రు  వైసీపీ నేత‌లు భారీ మొత్తంలో ప్ర‌భుత్వ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యాన్ని దేశం ఎల్ల‌లు దాటించి వంద‌ల కోట్ల‌ను వైసీపీ నేత‌లు ఆర్జించార‌ని ఆరోపణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రేష‌న్‌ బియ్యం దోపిడీ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.  దీంతో ప్ర‌స్తుతం పేర్ని నాని, ఆయ‌న భార్య‌తోపాటు మ‌రో న‌లుగురిపై కేసులు న‌మోద‌య్యాయి. గోదాములోని రేష‌న్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు త‌ర‌లించి సొమ్ము చేసుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే పేర్ని నానిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుటుంబం భూదందా వ్య‌వ‌హారం సైతం వెలుగులోకి వ‌చ్చింది. 

వైసీపీ  హ‌యాంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి క‌బ్జాల ప‌ర్వం ఇప్పుడు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏకంగా అట‌వీ భూమిని సజ్జల క‌బ్జా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ  హయాంలో  ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా, జగన్ కు రైట్ హ్యాండ్ గా స‌జ్జ‌ల ఉన్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ ఏప‌ని జ‌ర‌గాల‌న్నా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఓకే చెబితేనే ఫైలు ముందుకు క‌దిలేది. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని స‌జ్జ‌ల భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌జ్జ‌ల‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌చ్చాయి. త‌మ భూముల‌ను క‌బ్జా చేశార‌ని కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌లు ఫిర్యాదులు సైతం  అందాయి.  దీంతో వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఏకంగా 42 ఎక‌రాల అట‌వీ భూమిని క‌బ్జా చేసిన‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి. అందులో పండ్ల‌తోట‌లు, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారు. అంతే కాక అట‌వీ భూముల్లో గెస్ట్ హౌస్‌లు, ప‌నివారికోసం షెడ్లు క‌ట్టించారు. అయితే, స‌జ్జ‌ల పేరు బ‌య‌ట‌కు రాకుండా ఆయ‌న అండ‌తో  సోద‌రులు, కుటుంబ స‌భ్యులు అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్లు స‌మాచారం. వారంతా స‌జ్జ‌ల బినామీలేన‌ని ప్ర‌చారం జరుగుతోంది. గ‌త ప్ర‌భుత్వంలో స‌జ్జ‌ల సోద‌రులు క‌డ‌ప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వెలుగులోకి వ‌చ్చాయి. 

సీకేదిన్నె రెవెన్యూ ప‌రిధిలోని ప‌లు స‌ర్వే నెంబ‌ర్ల‌లో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సోద‌రుడు దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు సందీప్ రెడ్డికి దాదాపు 130కిపైగా ఎక‌రాలు ఉన్నాయి. అయితే, సీకేదిన్నె రెవెన్యూ ప‌రిధి స‌ర్వే నెంబ‌ర్‌ 1629లో 11వేల 129 ఎక‌రాల అట‌వీ భూమి ఉంది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ దీనికిలోని కొంత భూమిని ఆక్ర‌మించేశారు. ఇక్క‌డ స‌జ్జ‌ల ఎస్టేట్‌కు సంబంధించి మొత్తం 206 ఎక‌రాల భూమి ఉంది. ఇందులో ప‌ట్టాభూమి 147 ఎక‌రాలుకాగా..  ప్ర‌భుత్వం భూమి ప‌దెక‌రాలు, డీకేటీ ఆరు ఎక‌రాలు, చుక్క‌ల భూమి రెండెక‌రాలు ఉన్నాయి. ఈ స‌ర్వే నెంబ‌ర్ లోని అట‌వీ భూమిలో 42 ఎక‌రాల‌ను స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఆక్ర‌మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి ఇత‌ర వ్య‌క్తుల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బినామీల‌తో అట‌వీ భూముల్లో ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశార‌ని స్థానికులు పేర్కొంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇప్ప‌టికీ ఆ భూములు రిజ‌ర్వ్ ఫారెస్ట్ ప‌రిధిలోనే ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అన్యాక్రాంత‌మైన‌ అట‌వీ భూములపై ఫోక‌స్ పెట్ట‌గా స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ క‌బ్జాల ప‌ర్వం వెలుగులోకి వ‌చ్చింది. ఆ భూముల్లో అధికారులు స‌ర్వే చేయిస్తున్నారు. స‌జ్జ‌ల పేరుపైనా అక్క‌డ భూములు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి వివ‌రాల‌ను అధికారులు సేక‌రిస్తున్నారు. ప‌క్కా ఆధారాల‌ను సేక‌రించిన త‌రువాత స‌జ్జ‌ల‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మొత్తానికి త్వ‌ర‌లోనే స‌జ్జ‌ల, ఆయ‌న కుటుంబ స‌భ్యులు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

By
en-us Political News

  
వెస్ట్ బెంగాల్ లో మొత్తం 91 లక్షల ఓటు తొలగించారు. అంటే సగటున చూస్తే నియోజకవర్గానికి 31 వేల ఓట్లు తొలగించారు. ఈ తొలగింపు రెండు కారణాల వల్ల చాలా సెన్సిటివ్. మార్జిన్‌లతో పోలిస్తే ..2021లో టీఎంసీ గెలిచిన చాలా సీట్లలో మెజారిటీ 50,000 కంటే తక్కువ. 13 సీట్లలో ఇది మూడు వేల కంటే కూడా తక్కువ. ఇటువంటి పరిస్తితుల్లో నియోజకవర్గానికి 31 వేల ఓట్లు డిలిషన్ లో పోతే.. ఈ ప్రభావం ఎవరిపై ఎక్కువగా పడుతుంది?
మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు.
ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు కనిపించాయి. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం గుండా నౌకల రాకపోకలు సాఫీగా సాగడంతో, ముడి చమురు ధరలు 10 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. అటు అమెరికా స్టాక్ మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మరియు యూరోప్ దేశాలకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఇది తక్షణ ఆర్థిక ఊపిరిని అందించింది.
బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం. ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.