అటవీ భూములనూ అప్పనంగా బొక్కేశారు.. వెలుగులోని సజ్జల కబ్జాల బాగోతం!?

Publish Date:Jan 2, 2025

Advertisement

వైసీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల పాల‌న‌ అవినీతికి హ‌ద్దే లేదన్నట్లుగా సాగింది.  ఆ పార్టీ నేత‌లు అందినకాడికి ప్ర‌భుత్వ భూముల‌తోపాటు అట‌వీ భూములు, ప్రైవేట్ భూముల‌ను క‌బ్జాలు చేసేశారు. మ‌రికొన్ని భూముల‌ను త‌క్కువ ధ‌ర‌కే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తన అనుకూల ట్ర‌స్టుల‌కు, కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టేసింది. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తార‌ని అధికారాన్ని అప్ప‌గిస్తే.. జ‌గ‌న్ మాత్రం త‌న హ‌యాంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగాపెట్టుకొని పాల‌న‌ను గాలి కొదిలేశారు. దీంతో వైసీపీ హ‌యాంలో రాష్ట్రం క‌నీస‌ అభివృద్ధికి నోచుకోక‌పోవ‌డంతో దేశంలోనే ఏపీ అట్ట‌డుగు స్థాయికి వెళ్లిపోయింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన త‌రువాత  2014లో తొలిసారి జ‌రిగిన ఎన్నిక‌ల్లో  తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని దేశానికే ఆద‌ర్శంగా తీర్చిదిద్దేందుకు త‌న‌ వంతు కృషి చేశారు. అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా ఏర్పాటు చేయ‌డంతోపాటు, పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ప‌రుగులు పెట్టించాడు. అవినీతి, అక్ర‌మాల‌కు తావులేకుండా ఐదేళ్లు చంద్ర‌బాబు హ‌యాంలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్లింది.  2019 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఒక్క చాన్స్ ప్లీజ్ అన్న జగన్ ను నమ్మి ఆయనకు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ముఖ్య‌మంత్రి చైర్‌లో కూర్చున్న మొద‌టి రోజు నుంచే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక్షేమాన్ని గాలికొదిలేసి.. రాష్ట్రాన్ని దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. 

జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డితో స‌హా ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు, వైసీపీ ముఖ్య‌నేతలు ఐదేళ్ల కాలంలో ప్ర‌భుత్వ, ప్రైవేట్ భూముల‌ను దోచుకోవ‌ట‌మే ప‌నిగా పెట్టుకున్నారు. ఐదేళ్లు మంత్రిగా కొన‌సాగిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుటుంబం పెద్ద ఎత్తున  భూముల‌కు క‌బ్జాచేసింది.  పెద్దిరెడ్డి తన సతీమణి, కుమారుడి పేరుతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వంద‌ల ఎక‌రాల భూముల‌ను క‌బ్జా చేశారు. ఆయన తమ్ముడు, ఇతర కుటుంబసభ్యులు వారి అనుచరులు, బినామీల పేర్లతో దోచుకున్న‌ భూములకు లెక్కేలేదు. విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి భూదందా గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలా వైసీపీ హ‌యాంలో ఆ పార్టీ నేత‌ల భూక‌బ్జాల ప‌ర్వం మూడుపువ్వులు ఆరు కాయ‌లుగా సాగింది. దీనికితోడు రేష‌న్‌ బియ్యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించి కొంద‌రు  వైసీపీ నేత‌లు భారీ మొత్తంలో ప్ర‌భుత్వ సొమ్మును జేబుల్లో వేసుకున్నారు. కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యాన్ని దేశం ఎల్ల‌లు దాటించి వంద‌ల కోట్ల‌ను వైసీపీ నేత‌లు ఆర్జించార‌ని ఆరోపణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రేష‌న్‌ బియ్యం దోపిడీ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.  దీంతో ప్ర‌స్తుతం పేర్ని నాని, ఆయ‌న భార్య‌తోపాటు మ‌రో న‌లుగురిపై కేసులు న‌మోద‌య్యాయి. గోదాములోని రేష‌న్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు త‌ర‌లించి సొమ్ము చేసుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే పేర్ని నానిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న కుటుంబం భూదందా వ్య‌వ‌హారం సైతం వెలుగులోకి వ‌చ్చింది. 

వైసీపీ  హ‌యాంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి క‌బ్జాల ప‌ర్వం ఇప్పుడు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏకంగా అట‌వీ భూమిని సజ్జల క‌బ్జా చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వైసీపీ  హయాంలో  ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా, జగన్ కు రైట్ హ్యాండ్ గా స‌జ్జ‌ల ఉన్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ ఏప‌ని జ‌ర‌గాల‌న్నా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఓకే చెబితేనే ఫైలు ముందుకు క‌దిలేది. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకొని స‌జ్జ‌ల భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌జ్జ‌ల‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌చ్చాయి. త‌మ భూముల‌ను క‌బ్జా చేశార‌ని కూట‌మి ప్ర‌భుత్వానికి ప‌లు ఫిర్యాదులు సైతం  అందాయి.  దీంతో వాటిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా స‌జ్జ‌ల రామ‌కృ ష్ణా రెడ్డి భారీ అవినీతి బాగోతం వెలుగులోకి వ‌చ్చింది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఏకంగా 42 ఎక‌రాల అట‌వీ భూమిని క‌బ్జా చేసిన‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి. అందులో పండ్ల‌తోట‌లు, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారు. అంతే కాక అట‌వీ భూముల్లో గెస్ట్ హౌస్‌లు, ప‌నివారికోసం షెడ్లు క‌ట్టించారు. అయితే, స‌జ్జ‌ల పేరు బ‌య‌ట‌కు రాకుండా ఆయ‌న అండ‌తో  సోద‌రులు, కుటుంబ స‌భ్యులు అట‌వీ భూముల‌ను ఆక్ర‌మించిన‌ట్లు స‌మాచారం. వారంతా స‌జ్జ‌ల బినామీలేన‌ని ప్ర‌చారం జరుగుతోంది. గ‌త ప్ర‌భుత్వంలో స‌జ్జ‌ల సోద‌రులు క‌డ‌ప శివారు ప్రాంతంలో చేసిన అక్రమాలు కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వెలుగులోకి వ‌చ్చాయి. 

సీకేదిన్నె రెవెన్యూ ప‌రిధిలోని ప‌లు స‌ర్వే నెంబ‌ర్ల‌లో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సోద‌రుడు దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు సందీప్ రెడ్డికి దాదాపు 130కిపైగా ఎక‌రాలు ఉన్నాయి. అయితే, సీకేదిన్నె రెవెన్యూ ప‌రిధి స‌ర్వే నెంబ‌ర్‌ 1629లో 11వేల 129 ఎక‌రాల అట‌వీ భూమి ఉంది. స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ దీనికిలోని కొంత భూమిని ఆక్ర‌మించేశారు. ఇక్క‌డ స‌జ్జ‌ల ఎస్టేట్‌కు సంబంధించి మొత్తం 206 ఎక‌రాల భూమి ఉంది. ఇందులో ప‌ట్టాభూమి 147 ఎక‌రాలుకాగా..  ప్ర‌భుత్వం భూమి ప‌దెక‌రాలు, డీకేటీ ఆరు ఎక‌రాలు, చుక్క‌ల భూమి రెండెక‌రాలు ఉన్నాయి. ఈ స‌ర్వే నెంబ‌ర్ లోని అట‌వీ భూమిలో 42 ఎక‌రాల‌ను స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ ఆక్ర‌మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోకి ఇత‌ర వ్య‌క్తుల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి బినామీల‌తో అట‌వీ భూముల్లో ఓ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశార‌ని స్థానికులు పేర్కొంటున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఇప్ప‌టికీ ఆ భూములు రిజ‌ర్వ్ ఫారెస్ట్ ప‌రిధిలోనే ఉన్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అన్యాక్రాంత‌మైన‌ అట‌వీ భూములపై ఫోక‌స్ పెట్ట‌గా స‌జ్జ‌ల బ్ర‌ద‌ర్స్ క‌బ్జాల ప‌ర్వం వెలుగులోకి వ‌చ్చింది. ఆ భూముల్లో అధికారులు స‌ర్వే చేయిస్తున్నారు. స‌జ్జ‌ల పేరుపైనా అక్క‌డ భూములు ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో పూర్తి వివ‌రాల‌ను అధికారులు సేక‌రిస్తున్నారు. ప‌క్కా ఆధారాల‌ను సేక‌రించిన త‌రువాత స‌జ్జ‌ల‌ను, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మొత్తానికి త్వ‌ర‌లోనే స‌జ్జ‌ల, ఆయ‌న కుటుంబ స‌భ్యులు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

By
en-us Political News

  
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.