జగన్ పార్టీ ముద్దు.. జగనే వద్దు!

Publish Date:Feb 13, 2025

Advertisement

ఏపీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి ఆరు రోజులయ్యిందో లేదో.. జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ పగ్గాలు విజయమ్మకు అప్పగించాలంటూ జగన్ గాలి తీసేశారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకే తాను వైసీపీలో చేరానని చెప్పిన శైలజానాథ్, ఆ లక్ష్యం నెరవేరాలంటే వైసీపీ పగ్గాలు జగన్ చేతిలో కాదు విజయమ్మ చేతిలో ఉండాలని అన్నారు.

తాను వైఎస్సార్ కు వీరాభిమానినని చెప్పుకున్న ఆయన.. జగన్ భావాలు, ఆలోచనలు తన ఆలోచనలకు దగ్గరగా ఉన్నందునే తాను కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరానన్నారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ పగ్గాలను జగన్ నుంచి విజయమ్మ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.  శైలజానాథ్ కాంగ్రెస్ ను వీడి వైసీపీ గూటికి చేరి కేవలం ఆరు రోజులే అయ్యింది. ఇంతలోనే ఆయన జగన్ నాయకత్వంపై అపనమ్మకాన్ని, అయిష్టతను వ్యక్తం చేసి విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అనడం వైసీపీలో సంచలనం సృష్టించింది. జగన్ సీటు కింద శైలజానాథ్ బాంబు పెట్టారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.  

పార్టీ పగ్గాలు విజయమ్మకు అప్పగిస్తే   పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరతారన్న సంకేతాలను శైలజానాథ్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు.  వైఎస్సార్ కు రాష్ట్రంలో అసంఖ్యాక అభిమానులు ఉన్నారనీ, వారంతా కూడా ఆయన కుటుంబంలో ఆస్తుల తగాదా పట్ల తీవ్ర ఆవేదనతో ఉన్నారని చెప్పిన శైలజానాథ్.. వైఎస్సార్ కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేశారు.  అదే సమయంలో విజయమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ తో జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ ఓకే కానీ జగన్ నాయకత్వం మాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పకనే చెప్పారు. అది కూడా విజయమ్మ  తన కుమారుడు, కోడలు అబద్ధాలు చెబుతున్నారంటూ బహిరంగంగా చెప్పిన రెండు రోజులకే పార్టీ నాయకత్వం విజయమ్మకు ఇస్తేనే వైపీపీ బలోపేతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

సరస్వతి పవర్ వాటాల విషయంలో జగన్, భారతి అబద్ధాలు చెప్పారని విజయమ్మ కుండబద్దలు కొట్టిన తరుణంలో శైలజానాథ్ వైసీపీ పగ్గాలను విజయమ్మకు అప్పగించాలడం సంచలనం సృష్టించింది. శైలజానాథ్ వ్యాఖ్యల పట్ల వైసీపీలో కూడా సానుకూలత వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద  కోరి తెచ్చుకున్న శైలజానాథ్ జగన్ సీటుకే ఎసరు పెట్టారన్న టాక్ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.  

By
en-us Political News

  
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.