హింసను నిలువరించింది.. పోలింగ్ కు సహకరించింది.. శభాష్ తెలుగుదేశం క్యాడర్!

Publish Date:May 14, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసింది.  ఓటర్ల తీర్పు ఈవీఎంలలో  నిక్షిప్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల పోలింగ్ స్టేషన్లలో మంగళవారం (మే14) తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. తమ వంతు వచ్చే వరకూ ఓటర్లు ఓపికతో ఎదురు చూస్తే రాత్రంతా జాగారం చేయడం ఓటరు చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. అంత వరకూ గెలుపు మాదంటే మాదంటూ అధికార విపక్షాలు తమ వాదనలకు సాధ్యమైనంత పదును పెట్టుకుంటాయి. పార్టీలు చెప్పుకోవడంతో సంబంధం లేకుండానే ఫలితం ఏమిటన్నది ఇప్పటికే అందరూ ఓ అంచనాకు వచ్చేశారు. ఫలితాలు వెలువడే జూన్ నాలుగో తారిఖునే అధికారికంగా ఏ పార్టీ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అన్నది తేలుతుంది. 

కానీ ఈ సారి ఏపీలో ఎన్నికల సరళి, ఓటరు చైతన్యం, ఓటు వేయాలన్న పట్టుదలతో జనం కదిలిన తీరు అన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత  జనంలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ప్రత్యేకంగా, ఒక విశేషంగా చెప్పుకోవలసిందేమిటంటే.. గత ఐదేళ్లుగా అన్ని విధాలుగా వేధింపులకు గురై, కేసుల్లో ఇరుక్కుని నానా అగచాట్లూ పడిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ఉత్సాహం. చేసిన త్యాగాలు.   ఈ ఎన్నికల్లో కూటమి విజయం లక్ష్యంగా తెలుగుదేశం శ్రేణులు అహర్నిశలూ కష్టపడ్డాయి. ముఖ్యంగా పొత్తుల కారణంగా త్యాగాలు చేయాల్సి వచ్చినా, అనుకున్న నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పోటీలో లేకపోయినా.. తెలుగుదేశం క్యాడర్ నిరుత్సాహ పడలేదు. అదు ఉత్సాహంతో, అదే స్ఫూర్తితో పని చేసింది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం మేనిఫెస్టో ను బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లం, అలాగే  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే చంద్రబాబు సంతకం అన్న సంగతిని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లడంలో తెలుగుదేశం క్యాడర్ కంప్లీట్ గా సక్సెస్ అయ్యింది.  
అక్కడి వరకూ ఒకెత్తు అయితే పోలింగ్ రోజున పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, సంయమనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉంటుంది.

వైసీపీ మూకలు ఎంత రెచ్చగొట్టినా, పోలింగ్ కు విఘాతం కలిగించే లక్ష్యంతో ఎంతగా హింసాత్మక చర్యలకు పాల్పడినా తెలుగుదేశం శ్రేణులు, నేతలూ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. పోలింగ్ సజావుగా సాగేలా చూశారు.  తెలుగుదేశం నాయకులు, క్యాడర్ సర్వశక్తులూ ఒడ్డి పనిచేశారు. ఇక్కడ పోటీలో ఉన్నది తెలుగుదేశం అభ్యర్థా, బీజేపీ అభ్యర్థా అని చూడలేదు. కూటమి అభ్యర్థి అంటే తెలుగుదేశం అభ్యర్థే అన్నట్లుగా పని చేశారు. దీంతో కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీకి ఎలాంటి అవరోధాలూ లేకుండా సజావుగా సాగింది.  

తెలుగుదేశం, జనసేన పొత్తులోకి బీజేపీ వచ్చి కలిసిన తరువాత తొలి రోజులలో   ఓట్ల బదిలీ పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఉన్న బలంతో సంబంధం లేకుండా పేచీపెట్టి మరీ బీజేపీ పొత్తులో భాగంగా ఎక్కువ స్థానాలు  దక్కించుకోవడం, అక్కడితో ఆగకుండా చివరి క్షణం వరకూ సీట్ల మార్పు కోసం మడత పేచీలు పెట్టడంతో  ఒక దశలో బీజేపీ పొత్తు పేరుతో తెలుగుదేశం పార్టీకి నష్టం చేయాలన్న వ్యూహంతో పని చేస్తోందా అన్న అనుమానాలు కూడా తెలుగుదేశం క్యాడర్ లోనే వ్యక్తం అయ్యాయి. పార్టీల మధ్య ఓట్ల బదలాయింపుపై అనేక సందేహాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఎన్నికల రోజుల మాత్రం అన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం శ్రేణులు కూటమి అభ్యర్థుల కోసం పని చేశాయి. అలాగే జనసేన బీజేపీ శ్రేణులు కూడా కదలడంతో మూడు పార్టీలూ ఒక్కటే అన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఓటు బదలీ సజావుగా సాగింది. పల్నాడు, పుంగనూరు వంటి సున్నిత ప్రాంతాలలో  అధికార పార్టీ పెద్ద ఎత్తున హింసకు పాల్పడినా ఎన్నికల సంఘం, పోలీసు శాఖ చోద్యం చూస్తూ నిలిచిపోయాయి. అయితే అవి చేయాల్సిన పని కూడా తెలుగుదేశం క్యాడరే చేసింది. వైసీపీ గూండాయిజాన్ని ఎదురొడ్డి ఎదుర్కొని నిలువరించింది. ప్రాణాలను ఫణంగా పెట్టి కూటమి విజయం కోసం నిలబడింది. తెలుగుదేశం క్యాడర్ స్థైర్యం, ధైర్యం ముందు వైసీపీ వ్యూహాలు పారలేదు. హింసతో భయభ్రాంతులకు గురి చేసి ఓటింగ్ జరగకుండా చేయాలన్న వైసీపీ ఎత్తుగడ భగ్నమైంది.  దీంతో అనీల్ కుమార్ యాదవ్, గోపిరెడ్డి వంటి వైసీపీ నేతలు ఎన్నికల సంఘం, అధికారులు, పోలీసులు తమ చేతులు కట్టేసి తెలుగుదేశం శ్రేణులకు అనుకూలంగా వ్యవహరించారంటూ మీడియా ముందు బేలగా చెప్పుకునే పరిస్థితికి వచ్చారు.  టీడీపీ క్యాడర్ ప్రతిఘటనతో   పల్నాడుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అంబటి రాంబాబు, పినెల్లి రామకృష్ణారెడ్డి వంటి వైఎస్సార్‌సీపీ నేతలందర్నీ డిఫెన్స్ లో పడేసింది. గత ఐదేళ్ల దాడులు, బెదరింపులు, వేధింపులకు దీటుగా సమాధానం చెప్పింది. ఇంకానా ఇకపై సాగవు అంటూ విస్పష్ట సందేశం ఇచ్చింది.  ప్రజలలోనూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు వేసే ధైర్యాన్నిచ్చింది. ఇక్కడే అధికారికంగా ఫలితం వెలువడటానికి ముందే తెలుగుదేశం పార్టీకి నైతిక విజయం దక్కేటట్లు చేసింది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది.
మీడియా రంగంలో, సినిమా రంగంలో, వ్యాపార రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించిన దివంగత రామోజీరావుకు దేశంలోనే అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’ ప్రకటించాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది.
తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్‌లకు కేంద్ర మంత్రిపదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది.
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు  అంటే జూన్ 9న ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్ల జరుగు తున్నాయి.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచీ గట్టిగా సర్క్యులేట్ అవుతూ వస్తున్న మాట ఏపీకి ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా అంశం కారణంగానే గతంలో ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఘోర పరాజయం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆయితే తాజా ఎన్నికలలో జగన్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, ఆ పార్టీకి వచ్చిన సీట్లు మాత్రం మహామహా రాజకీయ పండితులే అచ్చెరువొందేటట్లు చేశాయి.
రామోజీరావు మరణం పట్ల రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తెలుగు నాట శ్రీ శ్రీ పేరు తెలియనివారుండరు.   మ‌హాక‌వి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) కుమారుడు శ్రీరంగం వెంక‌ట ర‌మ‌ణ (59) క‌న్నుమూశారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న అమెరికా క‌నెటిక‌ట్ రాష్ట్రంలోని త‌న నివాసంలో తుదిశ్వాస విడిచారు. శుక్ర‌వారం సాయంత్రం కుటుంబ స‌భ్యులు, తెలుగు ప్ర‌వాసులు స్థానికంగానే ఆయ‌న అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న బంధువు అయిన డాక్టర్‌ రమణా యశస్వి తెలిపారు. 
జగన్ ఓటమి మహా గొప్పగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసిన అందరూ కూడా ఇలాంటి ఓటమి నభూతో నభవిష్యత్ అంటున్నారు. గత ఎన్నికలలో 151 స్థానాలు గెలిచిన వైసీపీ.. ఈ సారి ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పడిపోయింది.
తీన్మార్ మల్లన్న.  గత బిఆర్ఎస్  ప్రభుత్వ హాయంలో  ఆ పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు బయటపెట్టిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరి బోణి కొట్టారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చెల్ నియోజకవర్గం నుంచి, పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గం  నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎంఎల్సి ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్ధిని మట్టి కరిపించి అత్యధిక మెజారిటీతో  తీన్మార్ మల్లన్న గెలుపొందారు.  
ఆంధ్రప్రదేశ్ లో చెత్త పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి. చెత్తపై పన్ను వసూలు చేసిన చెత్త ప్రభుత్వంగా జగన్ సర్కార్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు సమాజానికి, తెలుగు జాతికి తీరని లోటుగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.