క్రికెట్ దేవుడికి ఇక శలవు

Publish Date:Nov 16, 2013

Advertisement

 

 

క్రికెట్ ఆడని భారత్ ను ఊహించుకోవడం ఎంత కష్టమో, సచిన్ లేని క్రికెట్ ను ఊహించుకోవడం కూడా అంతకంటే చాలా కష్టం. క్రికెట్, సచిన్, దేవుడు మూడు కూడా మూడక్షరాల పదాలే కావడం సచిన్ క్రికెట్ దేవుడని చెప్పడానికే పుట్టాయని అనుకోవాలేమో.

 

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వేల పరుగులు, ఇంకా అనేక అద్భుతాలను సృష్టించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నకోట్లాది మంది అభిమానుల నుండి, తనకు ప్రాణంతో సమానమయిన క్రికెట్ నుండి ఇక శలవంటూ ఈ రోజు వీడ్కోలు తీసుకొన్నాడు.

 

నిన్నముంబై వాంఖేడ్ స్టేడియంలో వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచులో తన 200వ టెస్ట్ మ్యాచు ఆడి మరో సరి కొత్త రికార్డు నెలకొల్పిన సచిన్, నిన్ననే 76 పరుగులు తీసి అవుటవడంతో సాంకేతికంగా అతని క్రికెట్ ఆట ముగిసినట్లే అయింది. కానీ, అభిమానుల, ఆటగాళ్ళ కోరిక మేరకు ఈ రోజు మ్యాచులో కూడా అతను రెండు ఓవర్లు బౌలింగ్ చేసాడు. వెస్ట్ ఇండీస్ జట్టుని ఓడించిన భారత్ జట్టు ఆ క్రికెట్ దేవుడికి సవినయంగా దక్షిణ సమర్పించుకొంది.

 

అనేక ఏళ్ళు ఉద్యోగం చేసి పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగిలాగే, ఏకంగా 24సం.లు ఏకధాటిగా క్రికెట్ ఆడిన తరువాత రిటర్మెంట్ తీసుకొంటున్నసచిన్ కూడా మళ్ళీ తన జీవితంలో ఇక మైదానంలో అడుగుపెట్టేది లేదని గ్రహించినప్పుడు, చాలా ఉద్విగ్నతకు లోనయ్యి కన్నీళ్ళు పెట్టుకొన్నాడు.

 

తనకు ఇంత ఉన్నతమయిన జీవితాన్ని, పేరు ప్రతిష్టలని, గౌరవాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ఆ మైదానానికి వంగి నమస్కరించి శలవు తీసుకొన్నాడు. అతనిని ఆటగాళ్ళు తమ భుజాలపై ఎక్కించుకొని మైదానం చుట్టూ తిప్పుతుంటే, అతనికి వీడ్కోలు పలకడానికి వచ్చిన వేలాది ప్రజలు అదోరకమయిన సందిగ్దావస్థలో భారమయిన హృదయాలతో అతనికి వీడ్కోలు పలికారు.

 

సచిన్ టెండూల్కర్ వారినందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, తనకు జన్మనిచ్చిన తల్లి తండ్రులే తనని క్రికెట్ వైపు మళ్లించి తనకీ గొప్ప జీవితాన్ని, అరుదయిన గౌరవాన్ని కల్పించారని అందుకు వారికి సదా రుణపడి ఉంటానని అన్నారు. తన ఆటకోసం, ఉన్నతి కోసం, తన వ్యక్తిగత ఆనందాలను, సంతోషాలను పణంగా పెట్టి సహకరించిన అర్ధాంగి అంజలికి అతను ప్రేక్షకుల సమక్షంలో కృతజ్ఞతలు తెల్పుకొన్నాడు. ఈ రెండున్నర దశాబ్దాలలో తనకు సహకరించిన క్రికెట్ ఆటగాళ్ళకు, అభిమానులకు, బోర్డు మెంబర్లకు, మీడియాకి అందరికీ పేరుపేరునా అతను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నపుడు, అతనితో బాటు స్టేడియం లోపల బయట, టీవీల ముందు కూర్చొని వీక్షిస్తున్న లక్షలాది అభిమానులు కూడా తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యారు.

 

ఈ రోజుతో క్రికెట్ ప్రపంచంలో ఒక అధ్యాయం ముగిసి, చరిత్రగా మారింది. క్రికెట్ అనే పదానికి మారుపేరుగా మారిన సచిన్ ఇక ఆ క్రికెట్ లో ప్రత్యక్షంగా కనబడకపోవచ్చును. కానీ ఈ ప్రపంచంలో క్రికెట్ ఉన్నంత కాలం అతని పేరు తలచుకోకుండా బహుశః ఏ మ్యాచ్ కూడా పూర్తవదని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చును.

 

తెలుగువన్ తరపున, అభిమానుల తరపున సచిన్ టెండూల్కర్ కి శుభాకాంక్షలు.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.