వన్డేల్లో ఆగిన పరుగులయంత్రం

Publish Date:Dec 23, 2012

Advertisement

 

క్రికెట్ నే శ్వాసించి జీవించే కోట్లాది క్రికెట్ అభిమానుల క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరిక మైదానంలో వారికి దర్శనం ఈయబోనని చెప్పి హట్టాత్తుగా మాయమయిపోనున్నాడు. 23 సం.లు పాటు నిర్విరామంగా పనిచేసి 18,468 పరుగులు సృష్టించి ప్రపంచంలో తనకి మరే యంత్రం సాటిరాదని నిరూపించిన పరుగులయంత్రం తనకీ ఇక విశ్రాంతి కావాలని సవినయంగా విన్నవించుకొని శాశ్వితంగా ఆగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ భారత క్రికెట్ రారాజు సచిన్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్ నుండి తప్పుకొంటున్నట్లు ఈరోజు (ఆదివారం) ప్రకటించేడు.

 

త్వరలో జరగనున్న ఇండియా-పాకిస్తాన్ వన్-డే సిరీస్ లో తన విశ్వరూపం చూపించి దాయదులను కట్టడిచేస్తుంటే చూడాలనుకొంటున్న కోట్లాది అభిమానులను తీవ్రనిరాశకు గురిచేస్తూ, సరిగ్గా 23సం.ల క్రితం ఏ పాకిస్తాన్ టీమ్ తో ‘ఆడుకొని’ తన సుదీర్ఘ క్రికెట్ యాత్రని ప్రారంభించేడో, నేడు అదే టీముతో ఆడాల్సిన తరుణంలో సచిన్ టెండూల్కర్ వన్-డే పోటీలనుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. చివరికి, సెలక్టర్లు కూడా అతను తన నిర్ణయాన్ని ప్రకటించిన సమయం (టైమింగ్) చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏమయినప్పటికీ, క్రికెట్ రారాజు సచిన్ టెండూల్కర్ మరిక వన్డే క్రికెట్ లో మనకిక కనిపించబోడు.

 

తన నిర్ణయం ప్రకటిస్తూ సచిన్ టెండూల్కర్ ఇంతవరకు తనను తన ఆటను ఆదరించి గౌరవించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, 2015 సం.లో జరుగనున్న ప్రపంచ కప్ పోటీలకు సరయిన జట్టుకూర్పు ఏర్పడేందుకు వీలుకల్పించాలనే ఆలోచనతోనే తానూ తప్పుకొంటున్నట్లు ప్రకటించి హుందాగా జంటిల్ మ్యాన్ తప్పుకొన్నాడు. అయితే, గత కొంతకాలంగా తన పేలవమయిన ఆటతీరుతో ఇబ్బందిపడుతున్న సచిన్ టెండూల్కర్ కు తన రిటైర్మెంటు కోసం మీడియాలో జరుగుతున్నరగడ చూసి భాధతోనే క్రికెట్ నుండి హటాత్తుగా నిష్క్రమిస్తున్నట్లు అర్ధమవుతుంది.

 

అతని నిష్క్రమణ మంచిదా, కాదా అనే విషయాన్ని పక్కన పెడితే అతను భారత క్రికెట్ కు చేసిన సేవలు మరువరానివి. భారత క్రికెట్ టీం కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన వారిలో అతనూ ఒక్కడు. సచిన్ టెండూల్కర్ అంటే భారతీయ క్రికెట్టుకి ప్రతిరూపం. భారతీయ క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ అని క్రికెట్ ప్రేమికులు బావించడం అతనిపట్ల వారికున్న ప్రేమాభిమానాలకు ఒక నిదర్శనమయితే, వారు ఆవిధంగా అనుకొనే విదంగా ఆటలో జీవించిన ఘనత టెండూల్కర్ ది.

 

1989 వ సం.లో పాకిస్థానుతో అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించిన సచిన్ టెండూల్కర్ తన 23 సం.ల కెరీర్‌లో 463 వన్డేలు ఆడి 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలతో అనితర సాద్యమయిన విదంగా 18, 428 పరుగుల్ని సాధించాడు. అంతే గాకుండా, తన జీవితాశయమయిన భారత్ దేశానికి ప్రపంచకప్ కూడా సాదించి నిష్క్రమిస్తున్నాడు.

 

అతను సాదించిన ఘన విజయాల వివరాలన్నిటినీ ఔపోసనపట్టిన క్రికెట్ ప్రేమికులకి మళ్ళీ ప్రత్యేకంగా వివరించనవసరం లేదు. వివరించదలిస్తే అది ఒక మహాగ్రందం అవుతుందని అందరికీ తెలుసు. సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ కు అందించిన సేవలకు భారత ప్రభుత్వం అతనిని పద్మవిభూషణ్, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులతో సత్కరించింది. అతనికి దక్కిన అరుదయిన మరో గౌరవం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన గ్రూప్ కెప్టెన్ హోదాతో గౌరవించడం. కొద్దికాలం క్రితం మైసూర్ విశ్వవిద్యాలయం వారు అతనికి గౌరవడాక్టరేట్ తో గౌరవించేరు. భారత ప్రభుత్వం కూడా అతని విశిష్ట సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసి క్రికెట్ ప్రేమికులను సంతోషపరిచింది. అయితే కోట్లాది అభిమానుల కోరిక ‘భారత రత్న’ మాత్రం ఇంకా సాకారం కాక పోవడం వారికి విచారం కలిగిస్తోంది. అది అతనికి ఎంత గౌరవం కలిగిస్తుందో, డాన్ బ్రాడ్ మన్ లాంటి క్రికెట్ దిగ్గజాల సరసన నిలిచిన సచిన్ వల్ల కూడా ఆ బిరుదుకు అంతే వన్నె పెరుగుతుంది.

 

సచిన్ టెండూల్కర్ను కేవలం ఒక క్రికెట్ ఆటగాడిగా మాత్రమే గాకుండా, అతనిని భారత క్రీడా రాయభారిగా కూడా ప్రపంచం భావిస్తుంది. అందుకు, అతని విశిష్టమయిన ఆట ఒక్కటే కారణం మాత్రo కాదు. అతని విశితమయిన వ్యక్తిత్వం కూడా అందుకు ఒక కారణమని చెప్పవచ్చును. అతను క్రికెట్ ఆటను ఎంతగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా తన దేశాన్ని, తన ప్రజలను ప్రేమిస్తాడు. నిత్యం ప్రపంచం దేశాలు చుట్టి వచ్చే అతనికి భారత దేశంలో అడుగుపెట్టినప్పుడే సంపూర్ణమయిన ఆనందం అనుభూతి చెందుతానని చెప్పడమే అతని భారతీయ హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.

 

ప్రపంచ దేశాల నడుమ తన మువ్వనెల భారతీయ పతాకం టీవిగా రెపరెపలాడుతూ నిలిపిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిష్క్రమణతో భారతీయ క్రికెట్ చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం ముగిసింది. ఇక, భారతీయ క్రికెట్ చరిత్రలో సచిన్ కి ముందు, సచిన్ కి తరువాత అని రెండు శకాలుగా మనం ప్రస్తావించుకోక తప్పదు.

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.