Publish Date:Jul 13, 2022
కంటి కింద పులిపిరికాయ, గీరల టీ షర్టు, లుంగీతో బెదిరించి మరీ వసూలు చేసేది దాదాగిరీ తాలూకు ఫీజు. చేయించుకున్న వెధవ పనికి ఆ వచ్చిన వాడికి అడిగినంతా ఇవ్వక తప్పదు సదరు ధనికుడికి.. ఇది పాత సినిమాల్లో, కథల్లో విలన్ అసిస్టెంట్ల తీరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వుంది. మున్సిపల్ కార్మికులచేత నడుం విరిగేలా పనిచేయించుకుంటూ వారికి జీతాలు ఇవ్వకపోగా చెత్త మీద పన్ను విధించి వసూలు చేయడానికి హెచ్చరికలూ చేయడం. రాష్ట్రంలో కనీసం మున్సిపల్ వ్యవస్థా సరిగా పనిచేయడం లేదన్నదానికి ఇదే పెద్ద ఉదాహరణ.
అధికారంలోకి రాగానే నూతనోత్సాహంతో ముఖ్యమంత్రిగా జగన్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచుతు న్నట్టు ప్రకటించారు. ఇన్నాళ్లకు ప్రభుత్వానికి తమపై కాసింత ప్రేమ, దయా కలిగిందని పాపం వారంతా తెగ ఆనందపడ్డారు. ఆ ఆనందంలో మూడు షిఫ్ట్లూ పనిచేసి రోడ్లను అద్దంగా చేయడానికి శ్రమిస్తు న్నా రు. కానీ రాజుగారి నీతి వాక్యాలన్నీ అమలు కావన్న సంగతి కార్మికులకు బ్యాంకులకు వెళ్లి డబ్బులు అడి గితేగాని తెలియలేదు. ప్రభుత్వం ప్రకటించిన పద్దెనిమిది వేలు కాకుండా ముందు ఇస్తున్న పదిహేను వేలే అందుకుంటున్నారు.
కనీసం ఇవ్వాల్సిన జీతం కూడా ఇవ్వకపోగా, వారి గోడు వినిపించుకొనకపోవడంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తం గా పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు సక్రమంగా ఇవ్వాలని.. మరింత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల విషయంలో ఇంత కాలం ఓపిక పట్టిన వారు ఇప్పుడు రోడ్డెక్కి సమ్మె ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా చెత్తపన్నును ముక్కు పిండి మరీ వసూలు చేస్తోంది.
ఈ ప్రకారం పెద్ద ఎత్తున ఆదాయం కూడా వస్తోంది. చెత్త పన్ను ఇవ్వకపోతే చెత్త ఇంటి ముందు పోయ్యాలనే హెచ్చరికలు కూడా మంత్రుల స్థాయి నేతలు చేశారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాల విషయం మాత్రం మాట్లాడటం లేదు. అసలు అన్నింటికీ మించి మరీ విచిత్రమేమంటే.. మళ్లీ అధి కారంలోకి వస్తే జీతాలు పెంచుతామని మం త్రులు చెప్పడం. ప్రజలు, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు ఈ మాటలు విని నవ్వాలో, ఏడవాలో అర్ధం గాని సందిగ్ధంలో వున్నారు.
అధికారంలో వున్నవారు, జీతాలు ఇవ్వాల్సినవారు ఇలాంటి జోకులు వేస్తే తట్టుకునే శక్తి సామాన్య కార్మికులకు ఎలా వుంటుందన్న ధ్యాస సదరు మంత్రులకు లేకపోవడమే విచిత్రం. మరి పారిశుధ్యం ఎవరికి అవసరం?
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rulers-should-know-cleanness-importence-25-139635.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.