Publish Date:Oct 31, 2022
అసలే మునుగోడు.. ఆపై ముఖ్యమంత్రి కేసీఆర్ సభ.. జనం రాకపోతే ఉన్న ప్రతిష్ట కూడా మంటగలిసిపోతుందనుకున్నారో ఏమో.. సీఎం సభకు వస్తే 500 రూపాయలు ఇస్తామని దండోరా వేసి మరీ ప్రచారం చేసి సభకు జనాన్ని సమీకరించింది టీఆర్ఎస్. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నది.
మునుగోడులో ఎలాగైనా గెలిచిన తీరాలన్న పట్టుదలతో సకల విలువలకూ, నిబంధనలకే తిలోదకాలిచ్చేసి మరీ టీఆర్ఎస్ బరి తెగిస్తోందనడానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ వీడియో కనిపిస్తున్నది. మునుగోడు ఉప పోరు ప్రచారం ముగింపు దశకు వచ్చేస్తున్న సమయంలో కేసీఆర్ మునుగోడులో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆదివారం ( అక్టోబర్30) ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం, బీజేపీపై విమర్శల వర్షం, హెచ్చరికల పర్వం పక్కన పెడితే.. ఆయన సభకు జనసమీకరణ చేసిన తీరు మాత్రం తీవ్ర వివాదాస్పదం కావడమే కాకుండా.. నిబంధనల ఉల్లంఘనకు పరాకాష్టగా నిలిచింది.
చెర్లగూడెంలో సీఎం బహిరంగ సభకు వచ్చిన వారందరికీ మనిషికి 500 రూపాయల చొప్పున ఇస్తామంటూ దందోరా వేశారు. ఈ దండోరాను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. రిగ్గింగులు, ఓటర్లకు డబ్జు పంపకాలు ప్రతిష్ఠాత్మకంగా జరగే ఎన్నికలలో మామూలే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కానీ ఇంత బహిరంగంగా, ఇంతగా బరితెగించి.. సభకు వస్తే డబ్బులిస్తాం అంటూ డబ్బు కొట్టి చాటింపు వేయడం మాత్రం ఇదే తొలి సారి అని పరిశీలకులు అంటున్నారు.
అధికార పార్టీ ఇంతగా బరితెగించడం పట్ల రాజకీయ వర్గాలలోనే కాదు సామాన్యులలో సైతం విష్మయం వ్యక్తం అవుతున్నది. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా డబ్బు కొట్టి మరీ కేసీఆర్ సభకు వచ్చిన వాళ్లకు 500 రూపాయలు ఇస్తాం అంటూ చాటింపునకు సంబంధించిన వీడియో, ఎవరైనా టీఆర్ఎస్ ను ఇబ్బందుల పాలు చయడానికి ఎవరైనా ప్లాన్ చేసినదా? లేక గులాబీ పార్టీయే బరి తెగించేసి మరీ ఇలా చాటింపు వేయించిందా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ ఇప్పటి వరకూ ఈ వీడియోపై టీఆర్ఎస్ నుంచి ఎటువంటి ఖండనా రాలేదు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోందన్నది వాస్తవం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rs500-for-wo-attend-kcr-meeting-trs-dandora-25-146304.html
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.