ఆమెకి పెద్దల టికెట్!.. జగన్ బిగ్ స్కెచ్!

Publish Date:Apr 29, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్’ లో ఒకేసారి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర శాసన సభలో ఉన్నసంఖ్యాబలం కారణంగా ఈ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ వారంలోనే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదలా ఉంటే,ఈ నాలుగు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసే పనిలో ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ఒక సీటు, బిజినెస్ కోటాలో, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ భార్య ప్రీతి అదానీకి రిజర్వు అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ విషయాన్ని కూడా ఢిల్లీ పెద్దలతో చర్చింఛి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. గత ఎన్నికల్లో ఇదే బిజినెస్ కోటాలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీకి సన్నిహితుడు, రిలయన్స్‌ సంస్థల వైస్‌ప్రెసిడెంట్‌ పరిమళ్‌ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పడు అదే విధంగా మరో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ భార్య ప్రీతి అదానీని రాజ్య సభకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది. 

అదలా ఉంటే, వైసీపీపీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం జూన్‌ మొదటివారంలో ముగుస్తోంది.ఆయనకు రెండోసారి కూడా అవకాశమిచ్చేందుకు జగన్ రెడ్డి సుముఖంగా లేరని సమాచారం. అయితే, మాయల పకీరు ప్రాణం చెట్టు తొర్రలో ఉన్నట్లు, జగన్ రెడ్డి గుట్టుమట్లన్నీ  విజయసాయి గుప్పిట్లో ఉన్నాయని, అందువలన చేత పార్టీ పునర్వ్యవస్తీకరణలో ప్రయోగించిన, ‘బ్లాక్ మెయిల్’ అస్త్రాన్ని విజయ సాయి మళ్ళీ  ప్రయోగిస్తే ముఖ్యమంత్రి ఏమి చేస్తారనేది అనుమానమే అంటున్నారు. 

విజయసాయి వ్యవహారం ఎలా ఉన్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరిని, కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరినీ పెద్దల సభకు పంపాలనే నిర్ణయానికి వచ్చారని, పార్టీ వర్గాల సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బీర మస్తాన్ రావు, డొక్కా మాణిక్య వర ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలొ ఒకరికి  రాజ్య సభ టికెట్ ఖాయమని అంటున్నారు. అలాగే, ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో కమ్మ సామాజిక వర్గానికి మొండి చేయి చూపించి, విమర్శలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి, చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్’కు రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని,అంటున్నారు. నిజానికి జగన్ రెడ్డి తెలుగు దేశం పార్టీనుంచి వచ్చిన విడదల రజనీని చిలకలూరి పేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించిన సమయంలోనే, రాజశేఖర్’ కు ఎమ్మెల్సీ, మంత్రి పదవి ప్రామిస్ చేశారు. అయితే, ఆతర్వాత అలవాటులో పొరపాటుగా, మాట తప్పారు. మడమ తిప్పారు. ఇప్పుడు, రాజకీయ అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చి, కమ్మ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే అలోచన చేస్తున్నారని అంటున్నారు. 
 
మరోవంక వైసీపీలో సహజంగానే, పైసా ఖర్చు లేకుద్న పెద్దల సభకు వెళ్ళే అద్భుత అవకాశం కోసం సజ్జల సహా చాలా  మందేపోటీ పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత న్యాయవాది నిరంజన్‌రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇంకా మరి కొందరు కూడా రేసులో ఉన్నారని అంటున్నారు.అదే సమయంలో, ఎవరూ ఉహించని పేర్లు ఉన్నా ఆశ్చర్య పోనవసరం లేదని, అంటున్నారు.
 

By
en-us Political News

  
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు
మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
19వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న బెంగాల్ పునరుజ్జీవనం భారత ఆధునిక చరిత్రలో ఒక మలుపు. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బంకిం చంద్ర చట్టోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయులు సమాజ సంస్కరణలు, విద్య, సాహిత్యం, జాతీయ చైతన్యం వంటి రంగాల్లో కొత్త దిశను చూపించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దశలోనూ బెంగాలీ నాయకుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్‌గా మారింది.
గత పదేళ్ల కాలంలో ప్రపంచం అనేక తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చితి, చైనా, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, పశ్చిమాశియాలో ఉద్రిక్తతలు వంటివి అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. ఇటువంటి గడ్డు కాలంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా స్థిరంగా నిలబడటమే కాకుండా, ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ఎదగడం వెనుక మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుండి నడిపిస్తున్నా.. వెనుక నుంచి ప్రత్యర్థుల కదలికలను గమనించే శైలి మోడీదని అంటారు. మోడీ ఎల్లప్పుడూ ఒకటి కాదు, పది అడుగుల ముందుంటారనీ, అదే సమయంలో ప్రత్యర్థుల ప్రతి కదలికనూ నిశితంగా గమనిస్తారనీ వారు చెబుతారు. ఆయన రాజకీయ శైలిలో ప్రోయాక్టివ్ లీడర్షిప్, రియాక్టివ్ అవగాహన అనే రెండు ముఖ్యలక్షణాలు ఉన్నాయి.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రధాని నరేంద్ర మోడీ.. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో మైగుడ్ ఫ్రెండ్ అని చంద్రబాబును సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో ఆయన చూపుతున్న చొరవ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకోవడంలో ఆయనకున్న విజన్ అద్భుతమని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తుతించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.