కరోనా కొంత మంది ఇంట్లో దుఃఖాన్ని నింపితే.. ఇంకొంత మంది గళ్ళ నిండుతుంది. చనిపోయిన శవాల దగ్గర కూడా చిల్లర ఏరుకుంటున్నారు. మరి తెలంగాణలో కరోనా విలయం తో పాటు పైవేట్ హాస్పిటల్ రోగులపై కొరడా విసుతున్నయి. అందినంత దొంచుకోవడమే పైవేట్ హాస్పిటల్ పనిగా మారింది. మొన్నటికి మొన్న విరించి హాస్పిటల్ లో 20 లక్షలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటే, అతనికి చెల్లి తన అన్నాను చంపారని, ఒక లేడీ డాక్టర్ తన కుటుంబ సభ్యులతో, బంధువులతో హాస్పిటల్ ముంది బైఠాయించారు. ఆ సంఘటన మరిచిపోక ముందే హైదరాబాద్ లో మరో ప్రైవేట్ హాస్పిటల్ బాగోతం బయట పడింది. రోగి కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా డబ్బుల కోసం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల చీకటి కోణాలు వెలుగుచూడటంతో వైద్యారోగ్యశాఖ వాటిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఇంకా బుద్ది మార్చుకోవడం లేదు. కాసుల వేటలో పడి కరోనా రోగుల కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఉప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. కరోనా మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.5లక్షలు చెల్లించాలని బాధిత కుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉప్పల్లోని ఆదిత్య ఆస్పత్రిలో బుధవారం వెలుగుచూసింది. భాస్కర్ అనే యువకుడు ఇటీవల కరోనా బారిన పడటంతో ఆదిత్య ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందడంతో ఆస్పత్రి యాజమాన్యం రూ.5లక్షలు చెల్లిస్తే గానీ డెడ్ బాడీ ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
మరో వైపు బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ లో అమ్ముతున్న వ్యక్తులు అరెస్ట్..
మారదు లోకం మారాడు కాలం..దేవుడు దిగి రాని.. ఎవ్వరు ఏమైపోనీ మారదు లోకం .. మారదు కాలం .. ఒక వైపు కరోనా తాజగా మరో వైపు బ్లాక్ఫంగస్ తో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే వారి ప్రాణాలతో చెలగాటం ఆగుతున్నారు కొంత మంది దుండగులు బ్లాక్ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముగ్గురిని ఏస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈసీఎల్ చౌరస్తాలో బ్లాక్ ఫంగస్ ఒక్కో ఇంజెక్షను రూ.30 వేలకు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. పూజారి నవీన్ కుమార్ (25), గ్రందే కిషోర్ (42), దబ్బారెడ్డి వెంకటేష్ (25) బోరబండ, మోతినగర్ ప్రాంతానికి చెందిన వీరు బ్లాక్ లో అమ్ముతుండా ఏస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకుని కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితుల నుంచి మూడు ఇంజెక్షన్లు, మూడు సెల్ ఫోన్లు, హ్యూండాయ్ ఎక్స్ంట్ కారు, 1,460 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rs-5lacs-demand-by-aditya-hospital-for-gave-to-dead-body-25-116771.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.