చిట్టీల పేర మోసాల సంఘటనలు ఎన్ని జరిగినా అమాయక జనం వంచనకు గురవడం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. బ్యాంకులలో వడ్డీ అంతకంతకూ తక్కువ అవుతుండటం, బ్యాంకు లావాదేవీలు గ్రామీణులకు ఒకింత సంక్లిష్టంగా అనిపించడంతో.. నమ్మకస్తులే కదాని తమ పొదుపునకు చిట్టీ పాటదారులను ఆశ్రయిస్తున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చిట్టీల నిర్వాహకులు కోట్లాది రూపాయలకు ఎగనామం పెట్టేసి తమ వద్ద చిట్టీలు వేసిన వారి నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారు. తాజాగా ఇటువంటి ఘరానా మోసం వరంగల్ లో జరిగింది. నగరంలోని టీఆర్టీ కాలనీలో ఓ చిట్టీల నిర్వాహకులు ఏకంగా 30 కోట్లతో పరారయ్యాడు.
గత పదేళ్లుగా కాలనీలోనే ఉంటూ చిట్టీలు నిర్వహిస్తూ స్థానికుల నమ్మకాన్ని చూరగొన్న మూడెడ్ల వెంకటేశ్వర్లు హఠాత్తుగా రూ.30 కోట్లకు ఎగనామం పెట్టి ఉడాయించాడు. పదేళ్లుగా చిట్టీలు సక్రమంగా నిర్వహిస్తుండటంతో అతడిని నమ్మి, అధిక వడ్డీ ఆశతో రూ. లక్షలు ముట్ట చెప్పారు. అయితే గత కొద్ది కాలంగా మూడెడ్ల వెంకటేశ్వర్లు చిట్టీల నిర్వహణ సక్రమంగా ఉండటం లేదు. పాడుకున్న వారికి చిట్టీ డబ్బులు తరువాత తరువాత అంటూ వాయిదా వేయడం, అలాగే డిపాజిట్ దారులకు డబ్బులు ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం చేస్తుండటంతో స్థానికులు ఆయనను గట్టిగా నిలదీశారు. దీంతో మూడెడ్ల వెంకటేశ్వర్లు దైవదర్శనం పేరు చెప్పి కుటుంబంతో సహా పరారయ్యాడు. విషయం తెలిసిన బాధితులు లేబర్ కాలనీలోని యాజమాని ఇంటి ఎదుట నిరసనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నవెూదు చేసి విచారణ చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rs-30-crores-fraud-im-warangal-39-135361.html
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు