Publish Date:Nov 26, 2024
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజును ఆయన జన్మదినం రోజునే అదుపులోకి తీసుకుని కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎంపీని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా కస్టడీలో థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కలకలం రేపింది. తనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన ఎవరినీ వదలేది లేదని రఘురామకృష్ణం రాజు అనాడే ప్రతిజ్ణ చేశారు.
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇప్పుడు నాడు కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వారిపై కేసుల దర్యాప్తు జోరందుకుంది. రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన కేసులో అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయపాల్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. నాడు పోలీసు కస్టడీలో ఉన్న తనపై విజయపాల్ హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలుకు పిలిపించి ప్రశ్నించారు. తొలి సారి విచారణలో విజయ్ పాల్ ఏ మాత్రం సహకరించలేదు. ఆ తరువాత హైకోర్టులోనూ, సుప్రీం కోర్టులోనూ కూడా ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. అనంతరం మంగళవారం విజయ్ పాల్ ను ఒంగోలు పోలీసులు మరో సారి సుదీర్ఘంగా విచారించి అరెస్టు చేశారు. ఆయన రిమాండ్ రిపోర్టును కూడా రెడీ చేశారు. ఆయనను ఒంగోలు నుంచి గుంటూరుకు తరలించి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ ది తొలి అరెస్టు. ఈ కేసులో విజయ్ పాల్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుంది. ఇంకా ఈ కేసులో సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి సహా మరి కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా పోలీసు విచారణను ఎదుర్కోవలసి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణం రాజు గత ప్రభుత్వంలో తనను అక్రమంగా అరెస్టు చేసి కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తనను భౌతికంగా అంతం చేయాలన్న కుట్ర జరిగిందని, ఆ కుట్ర వెనుక ఉన్నవారెవరో తేల్చి వారిపైనా కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇక విజయ్ పాల్ అరెస్టుతో డొంక కదిలే అవకాశం ఉంది. విజయ్ పాల్ వాంగ్మూలం ఆధారంగా ముందు ముందు మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rrr-custodial-torcher-case-25-189046.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.