బుల్లి తెరపై ఇక రోజా స్టెప్పులు!

Publish Date:Feb 25, 2025

Advertisement

మాజీ మంత్రి రోజా.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లో  స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో   1998లో తెలుగుదేశం నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున 2004 ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి, ఆ తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి  నియోజకవర్గం నుంచీ పోటీ చేశారు. అయితే ఆ రెండు సార్లూ రోజా పరాజయం పాలయ్యారు.

వరుసగా రెండు ఎన్నికలలోనూ ఓడిపోయినా చంద్రబాబు ఆమెకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు. కానీ రోజా మాత్రం తన దూకుడుతోనూ, వ్యవహార శైలితోనూ  పార్టీలో ముఖ్య‌నేత‌ల నుంచి, క్యాడ‌ర్ వరకూ అందరి నుంచీ  వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నారు.  ఫ‌లితంగా ఆమె తెలుగుదేశం పార్టీకి దూరమై  2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.   ఆ తర్వాత చోటుచేసుకున్న రాజ‌కీయ‌ పరిణామాల నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా రోజాకు అవ‌కాశం ద‌క్కింది. టూరిజం, క్రీడ‌ల శాఖ మంత్రిగా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.

అప్పటి వరకూ ఆమె రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నా సినిమాలూ, స్మాల్ స్క్రీన్ ప్రజెన్స్ లను వదల లేదు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జబర్దస్త్ అనే కామేడీ షోకు జడ్జిగా వ్యవహరించారు. సినిమా హీరోయిన్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో, అంత కంటే ఎక్కువగా జబర్దస్త్ జడ్జిగా పేరు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాలలో చెప్పారు. అదే సమయంలో బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అయి ఉండీ జబర్దస్త్ లో వెకిలి జోకులకు పగలబడి నవ్వడాలేంటన్న విమర్శలనూ మూటగట్టుకున్నారు. అది వేరు సంగతి. అయితే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  తరువాత మాత్రం ఆమె జబర్దస్త్ కామెడీ షోకు గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు.. ఇకపై టీవీ షోలు సినిమాలూ చేయను ప్రజలకే  నా జీవితం అంకితం అంటు ప్రతిజ్ణ కూడా చేశారు.

అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న కల కల్ల అయిపోయింది. ఆమె నగర నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు. దీంతో ఇప్పుడు ఆమె మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. దీంతో గతంలో ఇక సినిమాలు, టెలివిజన్ షోలు చేయను అన్న ప్రతిజ్ణను పక్కన పెట్టేసి మళ్లీ బుల్లి తెరపై రీఎంట్రీకి సిద్ధమైపోయారు.

నగరిలో ఓటమి పాలు అయిన తరువాత రోజా మళ్లీ జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వస్తారన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఆమె జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ, బుల్లి తెర ఎంట్రీ మాత్రం ఫిక్సై పోయింది. ఒక ప్రముఖ టీవీ చానెల్ లో ప్రసారం కానున్న ఓ రియాలిటీ షోకు రోజా జడ్జిగా వ్యవహరించనున్నారు. ఆ షోకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా రిలీజ్ అయ్యింది. దీంతో అయితే మంత్రి లేకుంటే టీవీ షోలు అన్నట్లుగా రోజా తీరు ఉందన్న సెటైర్లు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.