ఏం పాదం రోజా.. అలా ఎంట్రీ.. జగన్ పై కేసు..
Publish Date:Nov 21, 2017
Advertisement
ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్పం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ పాదయాత్రలో రోజా కూడా పాల్గొంది. పాదయాత్రలో భాగంగా.. జగన్, రోజా వైసీపీ నేతలు బనగాని పల్లెలో మహిళా సదస్సు నిర్వహించారు. దీంతో అనుమతి లేకుండా ఈ సదస్సు నిర్వహించారన్న ఆరోపణలతో జగన్ పై కేసు నమోదైంది. జగన్ కేవలం పాదయాత్ర కోసం మాత్రమే అనుమతి తీసుకున్నారు. కానీ మహిళా సదస్సు నిర్వహించడం కోసం కాదని టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళా సదస్సుకు అనుమతి తీసుకోలేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. మహిళలను తరలిస్తున్న వాహనాలను మొదట్లో అడ్డుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం మహిళలను అడ్డుకుంటోందని ఆరోపిస్తూ.. ధర్నా చేస్తామని రోజా హుస్సేనాపురానికి చేరుకున్నారు. అక్కడ పెద్దగా మహిళలు లేకపోవడంతో ఆమె తిరిగి బనగానపల్లెకు వచ్చారు. పట్టణంలో వాహనంలో అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేసి చివరకు జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఏదేమైనా రోజా పాదయాత్రలో ఎంటర్ అయ్యిందో లేదో జగన్పై కేసు నమోదైంది.
యాదృశ్చికమో లేక రోజా టైం బాలేదో తెలియదు కానీ అందరూ అన్నట్టే జరగడం ఆశ్చర్యం. గతంలో రోజా వల్ల జగన్ అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది అన్న కథనాలు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. అలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇప్పుడు జగన్ పై కేసు నమోదు అవ్వడంతో.. మళ్లీ రోజాపై విమర్శలు మొదలయ్యాయి. రోజా వచ్చిందో..? లేదో..? జగన్ పై కేసు నమోదైంది అని కామెంట్లు విసురుతున్నారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో ఓడి పోవడానికి ఓ రకంగా రోజానే కారణమని సొంత పార్టీ నేతలే తిట్టుకున్నారు. ఆతరువాత.. రోజా తిరుమలపై కొబ్బరికాయ కొట్టింది.. పాదయాత్ర ఆగింది అని అన్నారు. ఇప్పుడు జగన్ పాదయాత్రకి రోజా వెళ్లింది.. జగన్ పై కేసు నమోదైంది అంటున్నారు.
http://www.teluguone.com/news/content/roja-45-78895.html





