యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య..!

Publish Date:Jul 19, 2026

Advertisement

 

భయంతో యువకుడి సుసైడ్..!

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సమాజానికి సేవ చేయాలనే ఉన్నత ఆశయాలతో, ఎన్నో అవధులు లేని ఆశలతో డాక్టర్ చదువుతున్న ఇరవై ఏళ్ల ఎంబీబీఎస్ వైద్య విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న ప్రేమోన్మాదానికి బలవ్వగా, ఆమె మృతికి కారణమైన ఇరవై రెండు ఏళ్ల చిలుముల రామ్ చరణ్ అనే యువకుడు కూడా భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కన్నవారి కలలను నిజం చేస్తూ సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న లక్ష్మీ ప్రసన్న ప్రిపరేషన్ హాలిడేస్ నిమిత్తం తన స్వగ్రామమైన మునుకుంట్లకు వచ్చింది. అయితే, అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ గత కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు పలుమార్లు రామ్ చరణ్‌ను మందలించినప్పటికీ అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మీ ప్రసన్న అనుమానాస్పద స్థితిలో దూలానికి ఉరివేసుకుని కనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె సోదరి ఈ ఘోరాన్ని గమనించి కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు సమాచారం అందించింది. శనివారం ఉదయానికి నిందితుడు రామ్ చరణ్ కూడా గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న తన తండ్రి నర్సింహ సమాధిపై తన రక్తంతో లక్ష్మీ ప్రసన్న నిక్ నేమ్ అయిన 'చిన్నారి' అనే పేరును రాసి, పక్కనే ఉన్న తాటిచెట్టుకు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

 శుక్రవారం సాయంత్రం రామ్ చరణ్ మరో వ్యక్తితో కలిసి లక్ష్మీ ప్రసన్న ఇంటికి వెళ్లినట్లు స్థానికులు చెప్తుండటంతో, యువతి మృతి వెనుక హత్య కోణం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతి తండ్రి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వగ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. ఈ ఘటనపై శాలిగౌరారం సీఐ రాజశేఖర్, కట్టంగూర్ ఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Nalgonda MBBS student suicide, Lakshmi Prasanna medical student death, Kattangur Munukuntla news, Ram Charan suicide Nalgonda, Suryapet medical college student, Telangana crime updates, CM Revanth reddy, Telangana goverment

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన వాంగ్‌చుక్ సతీమణి..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.