Rock Salt వాడి చూడండి – జీవితం మారిపోతుంది

Publish Date:Aug 10, 2018

Advertisement

 


ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే పసిపిల్లవాడు కూడా సముద్రం నుంచి అని ఠక్కున చెప్పేస్తాడు. కానీ గనుల నుంచి కూడా ఉప్పు దొరుకుతుందని చాలామందికి తెలియదు. దీనినే రాతి ఉప్పు- రాక్‌ సాల్ట్‌ అని పిలుస్తారు. రాళ్ల ఉప్పులో చాలా ఖనిజాలు ఉంటాయి. వీటితో సాధారణ ఉప్పు వల్ల ఏర్పడే చెడు ఫలితాలు రావు సరికదా... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఓసారి మీరే చూడండి...


- ఉప్పు అనగానే మనకి బీపీనే గుర్తుకి వస్తుంది. సాధారణ ఉప్పులో ఎక్కువగా ఉండే సోడియం వల్ల, మన రక్తపోటు పెరిగిపోతుంది. కానీ రాక్‌ సాల్ట్‌ అలా కాదు. సాధారణ ఉప్పుతో పోల్చుకుంటే- ఇందులో సోడియం క్లోరైడ్ తక్కువగా ఉండి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పుని వాడితే రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది.


- రాతి ఉప్పులో 80కి పైగా ఖనిజాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకని ఈ ఉప్పుని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి, ఎలాంటి వ్యాధులూ మన దగ్గరకి రావని హామీ ఇస్తున్నారు.


- అజీర్ణానికి ఉపయోగించే చాలా ఎంటాసిడ్స్‌లో మెగ్నీషియం ఉంటుంది. రాతి ఉప్పులోనూ మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి ఇది ఒక నేచురల్‌ ఎంటాసిడ్‌లా పనిచేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటే... కొంచెం రాతి ఉప్పుని, కాస్త జీలకర్రతో తీసుకుంటే సరి!


- ఒంట్లో ఉన్న కఫాన్ని కరిగించేందుకు రాక్‌ సాల్ట్‌ అమృతంలా పనిచేస్తుంది. రాతి ఉప్పుని నీళ్లలో వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, పొడి దగ్గు, టాన్సిల్స్ వాపు తగ్గుతాయి. రాతి ఉప్పు వేసిన నీటిని ఆవిరి పట్టడం వల్ల సైనస్, ఆస్తమా, చెవి పోటు లాంటి తీవ్రమైన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.


- రాతి ఉప్పుతో ఒళ్లు రుద్దుకోవడం వల్ల చర్మం మీద ఉన్న మలినాలన్నీ పోతాయి. ఇక ఒక చెంచాడు రాతి ఉప్పు నీళ్లో వేసుకుని స్నానం చేస్తే... ఎలాంటి ఒంటి నొప్పులైనా తగ్గిపోయి, హాయిగా నిద్ర పట్టేస్తుంది.


- ఇప్పటి కూరగాయల్లో పెస్టిసైడ్స్‌ చాలా ఎక్కువగా ఉంటున్నాయన్న విషయం తెలిసిందే! అందుకే వాటిని తరిగే ముందు రాతి ఉప్పు వేసిన నీటితో కడిగితే, కూరగాయల పై పొరల్లో ఉండే పెస్టిసైడ్స్ కొట్టుకుపోతాయని చెబుతున్నారు.


- రాతి ఉప్పుతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటే ఒంట్లో మెటబాలిజం కూడా బాగుంటుంది. దాని వల్ల మనిషి ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేయగలుగుతాడు. ఇలాంటి శరీరంలో క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి.


- డయాబెటిస్‌ ఉన్నవారు సముద్రపు ఉప్పుకంటే రాతి ఉప్పుని వాడటం మంచిదని సూచిస్తున్నారు. రాతి ఉప్పుని వాడటం వల్ల ఒంట్లో షుగర్‌ లెవెల్స్ అదుపులో ఉండి, ఇన్సులిన్ అవసరం కూడా తగ్గుతుందట.

మన వంటల్లో రాతి ఉప్పు వాడటం వల్ల వాటి రుచి పెరుగుతుందే కానీ తగ్గదు. పైగా దీని ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. మరి ఏ ఉప్పు వాడితే మంచిదో మీరే చెప్పండి!               


  - నిర్జర.

By
en-us Political News

  
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
డిప్రెషన్.. నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య.  చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ డిప్రెషన్ ఊబిలో చిక్కుకుంటున్నారు. దీన్నుండి బయటపడటానికి మానసికంగా యుద్దం చేస్తుంటారు...
దోసకాయ తినడానికి  చాలా మంది  ఇష్టపడతారు. సాధారణంగా దోసకాయను  కూరగాయల లిస్ట్ లో చెబుతారు. దోసకాయలో నీరు  సమృద్ధిగా ఉండటం వలన ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది,  శరీరం డీహైడ్రేట్ కాకుండా  నివారిస్తుంది...
శీతాకాలం ఆరోగ్యానికి పరీక్షలు పెట్టే కాలం.  శీతాకాలంలో చలి కారణంగా జలుబు, ఇన్ఫెక్షన్లు,  చర్మం పగలడం,  దురదలు,  ర్యాషెస్, డాండ్రఫ్ వంటివి చాలా వస్తాయి.  
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు.
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఇరుగు పొరుగు, కొలీగ్స్..  ఇట్లా  ఎవరితో అయినా ఎక్కడికైనా ప్రయాణాలు చేయాల్సి వస్తూనే ఉంటుంది....
పొట్ట కాస్త తేడా కొడితే చాలు.. ఎంత బలంగా, దృఢంగా ఉన్న మనిషి అయినా అసౌకర్యానికి లోనవుతారు. పొట్ట ఆరోగ్యం బాగుంటే మిగతా శరీరం ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. కానీ పొట్ట ఆరోగ్యం తేడా వస్తే తిండి, నీరు తీసుకోవడం కూడా బ్రేక్ పడుతుంది. ఇలా పొట్ట, ప్రేగు ఆరోగ్యాన్నే గట్ అని పిలుస్తారు....
సాధారణంగా ఏదైనా అనారోగ్యం వల్ల డాక్టర్ చెకప్ చేయించుకున్నప్పుడు చాలామంది కిడ్నీ టెస్ట్ కూడా చేయించుకుంటారు.  ఈ సందర్భంలో కొందరిలో క్రియేటినిన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్టు బయటపడుతుంటుంది.  క్రియేటినిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో విషపదార్థాలు ఎక్కువగా పేరుకుపోవడానికి..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.