Publish Date:Apr 16, 2022
వాళ్లు చాలా రిచ్. లెక్కలేనంత సంపద. ఇంట్లో కబోర్డ్స్ లోనే భారీగా బంగారు వజ్రాభరణాలు. మా ఇంట్లోకి ఎవరు వస్తారులే అనే ధీమా. ఆ నగలను పసిగట్టింది ఆ ఇంటికొచ్చిన నర్సు. విషయం మొగుడికి చెప్పింది. ఆ కిలాడీ కపుల్స్.. ఇంటి యజమానికి రోజూ నిద్ర మాత్రలు ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాక.. రోజుకో నగ దొంగిలిస్తూ వచ్చారు. ఒకేసారి అంతా దోచేస్తే డౌట్ వస్తుందని.. అలా ఒక్కోటీ ఎత్తుకెళ్లారు. ఆ ఖరీదైన నగలను అమ్మేసి.. అప్పులు తీర్చేసి.. కారు కూడా కొనుక్కున్నారు. కట్ చేస్తే.. ఆ దొంగ కపుల్స్ పోలీస్ స్టేషన్లో నిజమంతా కక్కేశారు.
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజాది సంపన్న కుటుంబం. వాళ్లు ఉండేది ముంబైలోనే అయినా.. వారికి ఢిల్లీలో ఖరీదైన భవనం ఉంది. అందులో ఆనంద్ అహుజా తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇటీవల ఆ ఇంట్లో 2 కోట్ల విలువైన ఆభరణాల చోరీ జరగడం కలకలం రేపింది. పోలీసుల దర్యాప్తులో ఆ దొంగలెవరో బయటపడ్డారు. ఆ ఇంట్లో పని చేస్తున్న నర్సు, ఆమె భర్తే ఈ దొంగతనానికి తెగించారని పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని దొంగతనం వివరాలు రాబట్టారు. ఆ ఖరీదైన దొంగతనం ఎలా జరిగిందంటే....
ఢిల్లీలోని అమృతా షెర్లింగ్ మార్గ్లో ఉన్న భవంతిలో ఉంటున్న సోనమ్కపూర్ అత్త ప్రియకు కేర్ టేకర్గా ఉండేందుకు అపర్ణ రీతూ వెల్సన్ అనే నర్సును నియమించారు. అయితే, ప్రియ బెడ్రూమ్ కబోర్డ్స్లో ఉన్న బంగారం, వజ్రాభరణాలు, డబ్బు.. నర్సు అపర్ణ కంటపడ్డాయి. ఈ విషయం భర్త నరేశ్ కుమార్కు చెప్పింది. ఆ సొమ్మంతా అపహరిస్తే.. తమకున్న అప్పులు తీరిపోతాయని భావించారు. నరేశ్ పథకం మేరకు.. ప్రియకు ప్రతిరోజూ రాత్రి నిద్రమాత్రలిచ్చి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని అపర్ణ అపహరించేది. అలా, దొంగిలించిన బంగారం, వజ్రాభరణాలను నరేశ్ అమ్మేసి నగదుగా మార్చేవాడు. ఇలా, ఆ జంట కొన్ని నెలలపాటు దొంగతనానికి పాల్పడి.. వచ్చిన డబ్బుతో తమకున్న అప్పులన్నీ తీర్చేసింది. మిగిలిన మనీతో ఓ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అందుకే, ఇంట్లో పని చేసే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలంటున్నారు. వివరాలు తెలుసుకోకుండా ఎవరిని పడితే వారిని పనిలో పెట్టుకోవద్దని.. అది నర్సు అయినా, పనోళ్లైనా బ్యాక్గ్రౌండ్ చెక్ కంపల్సరీ అంటున్నారు పోలీసులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/robbery-details-in-sonam-kapoor-delhi-house-25-134515.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.