కేసుల ఆరాటం..భంగపాటుతో ఆయాసం..ఆర్కే నైజం!

Publish Date:May 11, 2022

Advertisement

నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పొంగూరు నారాయణకు బెయిల్ మంజూరైంది. టెన్త్ ప్రశ్నాపత్రాల లీక్ తో ఆయనకు సంబంధం ఉందని చిత్తూరు జిల్లా పోలీసులు మంగళవారం నారాయణను అదుపులోకి తీసుకున్నది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా పెద్ద డ్రామాయే నడిచింది. అయితే.. టీడీపీ హయాంలో అమరావతి భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసును తెరమీదకు తెస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ తదితరులపై ఆర్కే అప్పట్లో కోర్టులో కేసు వేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి చరిత్ర కోర్టులు, కేసులతోనే ముడిపడి ఉందనేది వాస్తవం. అయితే.. ఆర్కే వేసిన ఏ కేసు కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేవు. పైగా కోర్టు నుంచే ఆర్కేకు అక్షింతలు కూడా పడుతుంటాయి. అయినా.. మళ్లీ ఏదో ఒక అంశం మీద కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉండడం ఆర్కే నైజం అంటారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర తేల్చాలంటూ ఆర్కే వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో బాధితులు ఎవరికీ లేని శ్రద్ధ మీకు ఎందుకంటూ హైకోర్టు ఆర్కేని ప్రశ్నించింది. ముందుగా ఆర్కే సీబీఐ కోర్టులో కేసు వేశారు. సీబీఐ కోర్టు తీర్పుపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయిస్తే.. ఆర్కే సుప్రీంకోర్టుకు వెళ్లారు. అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ ఆర్కే కేసులు పెట్టారు. చంద్రబాబు సహా అప్పటి ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నవారిని ఇరికించాలని ఆర్కే యత్నించారు. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్లి భంగపడ్డారు. అయినా.. కేసుల ఆరాటం ఆర్కేకి తగ్గలేదంటారు. అమరావతిలో వెయ్యని ఇన్నర్ రింగ్ రోడ్డును అడ్డం పెట్టుకుని చంద్రబాబును ఏ1గా, అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణను ఏ2 గా సహా ఇంకా పలువురిపై కేసులు పెట్టారు ఆర్కే.

అమరావతిని రాజధాని చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటి నుంచే ఆర్కే ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అమరావతి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే అయినా అక్కడ రాజధాని ఏర్పాటుకు ఆర్కే అడ్డుపడుతూనే ఉంటారు. అమరావతికి భూ సమీకరణ సందర్భంగా మున్సిపల్ మంత్రి నారాయణ సభకు ఆళ్ల అడ్డుపడ్డారు. సీఆర్డీయే అధికారులపై దాడి చేశారు. తమ విధులకు ఆర్కే ఆటంకం కలిగించారంటూ అధికారులు కేసు పెట్టారు. అయితే.. ఆర్కేపై నమోదైన ఈ కేసును విజయవాడలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆ తర్వాత కొట్టివేసింది. మంత్రి నారాయణ ఆదేశాలతోనే అధికారులు తనపై కేసులు పెట్టారని ఆళ్ల కక్ష పెంచుకున్నారని రైతులు చెబుతారు. నారాయణపై ప్రతీకారం తీర్చుకునేందుకే అసంబద్ధ ఆరోపణలతో సీఐడీకి ఫిర్యాదు చేశారంటారు.

రాజధాని ప్రాంతంలో దళితులను బెదిరించి భూములు లాక్కున్నారనేది ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణ. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే దళితుల అసైన్డ్ భూములు తక్కువ ధరలకు కొనేసి, తన మనుషులకు చంద్రబాబు కట్టబెట్టి, వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆర్కే ఆరోపణ. రాజధాని నిర్మాణానికి భూములను తాము సమ్మతితో ఇచ్చామని దళితులే చెప్పడంతో ఆర్కేవి తప్పుడు ఆరోపణలే అని తేలిపోయింది. చంద్రబాబుపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే దళిత రైతులంతా కలిసి ఎమ్మెల్యే ఆర్కేపైనే అట్రాసిటీ కేసులు పెడతామని దళిత నేత మార్టిన్ హెచ్చరించే దాకా విషయం వెళ్లింది.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోర్టుల్లో రకరకాల కేసులు వేసి అప్పటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు యత్నించేవారు ఆర్కే. గుంటూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయాన్ని వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారని, దానికి ఇచ్చిన లీజ్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో ఆర్కే పిటిషన్ వేశారు. అయితే.. పిల్ వేయడంలో ఆర్కే ఆసక్తి ఏమిటని ప్రశ్నించిన కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వం 150 రూపాయలకే ఫైబర్ నెట్ ద్వారా ఫోన్, టీవీ, ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు యత్నిస్తే.. హైకోర్టులో ఆర్కే కేసు వేసి అడ్డుపడేందుకు యత్నించారు. 2014 ఎన్నికల అఫిడవిట్ లో నకిలీ డిగ్రీ పట్టా పెట్టడాన్ని టీడీపీ నేతలు పసిగట్టారు. ఆ డిగ్రీ కాస్తా 2019 ఎన్నికల నాటికి డిప్లమా డిగ్రీగా మార్చేయడం గమనార్హం. ఎంతసేపూ కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు అంటూ తిరిగే తమ ఎమ్మెల్యే ఆర్కే కనిపించడం లేదని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో రైతులు కేసు పెట్టారు.

ఆర్కే పెట్టే పెట్టే ఏ కేసులోనూ బాధితులు ఉండరు. తమకు నష్టం జరిగిందనే వారూ ఉండరు. లబ్ధిదారులు ఉండరు. ఫలానా వారికి లాభం కలిగిందనే వారు కూడా ఉండరు. కేవలం ఆర్కే మాత్రమే ఏదో జరిగిపోయిందని కేసులు పెడుతుంటారు.

By
en-us Political News

  
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.