కార్బైడ్‌ పండ్లు ప్రాణాంతకాలు!

Publish Date:Apr 23, 2018

Advertisement

 

పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు! అందులోనూ మామిడి, అరటి, యాపిల్‌ అంటే నోరూరనివారు ఎవరుంటారు? కాని ఆ పండ్లని మగ్గపెట్టేందుకు వాడే విషపదార్థాల గురించి వింటుంటేనే భయం కలుగుతోంది. మరీ ముఖ్యంగా కార్బైడ్‌తో పండించిన పండ్లని ముట్టుకోవాలంటేనే దడ పుడుతోంది. మరి నిజంగానే కార్బైడ్‌ అంత ప్రమాదకరమైనదా? అయితే దాన్ని ఎందుకు వాడుతున్నారు? దాని బారిన పడకుండా ఉండటం ఎలా?... మీరే చూడండి!

 

ఇందుకు వాడతారు!

మామిడి, అరటి వంటి పండ్లను చెట్టు మీద నుంచి కోసిన తరువాత కూడా మగ్గేందుకు కాస్త సమయం పడుతుంది. ఇది నిదానంగా జరిగే చర్య. పైగా వాటిని మగ్గపెట్టేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా కాస్త కేల్షియం కార్బైడ్‌ని కనుక వాటి మీద ప్రయోగిస్తే... అవి ఇట్టే పండిపోతాయి. లేదా కనీసం పండినట్లు కనిపిస్తాయి. ఇందులో మరో లాభం కూడా ఉంది! పచ్చిగా ఉండగానే కాయలని కోయడం, అవి గట్టిగా ఉన్నప్పుడే మార్కెట్‌కు తరలించడం వల్ల పండ్లు దెబ్బతినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పైగా కార్బైడ్‌తో పండిన పండ్లు లోపల ఇంకా పచ్చిగానే ఉంటాయి కాబట్టి చాలా రోజులు నిలవ ఉంటాయి కూడా! ఇక మిలమిలా మెరిసిపోయే కార్బైడ్‌ పండ్లని చూసిన కొనుగోలుదారులకి, వాటిని రుచి చూడాలన్ని ఆశ ఎలాగూ కలుగుతుంది.

 

ఇదీ ప్రమాదం!

కేల్షియం కార్బైడ్‌లో అర్సెనిక్‌, ఫాస్పరస్‌ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి అధిక మొతాదులో శరీరంలోకి చేరితే ఏర్పడే సమస్యలు అన్నీఇన్నీ కావు. తలనొప్పి, కళ్లు తిరగడం, నిద్రలేమి మొదలుకొని నరాలకు సంబంధించిన నానారకాల సమస్యలకూ ఇది దారితీయవచ్చు. చర్మం మీద కూడా కార్బైడ్‌ ప్రభావం అధికంగా ఉంటుంది. దద్దుర్లు నుంచి చర్మక్యాన్సర్‌ వరకూ కార్బైడ్‌ పండ్లని తినేవారిలే ఎలాంటి రోగమైనా తలెత్తవచ్చు. ఇక గుండె, మెదడు, కీళ్లు, జీర్ణాశయం వంటి శరీర భాగాల మీద ఈ కార్బైడ్‌ తీవ్ర ప్రభావం చూపుతుందనే వార్తలూ వినిపిస్తూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కనుక కార్బైడ్‌తో మగ్గపెట్టిన పండ్లని తింటే... అవి వారికీ, వారి కడుపులో ఉన్న బిడ్డకీ కూడా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

 

మరేం చేయడం!

కార్బైడ్‌ గురించి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా, రూపాయి కోసం వ్యాపారస్తులు పడే కక్కుర్తి ముందు ఉపయోగం లేకుండా పోతోంది. ఆరోగ్య శాఖ అధికారులు కూడా కార్బైడ్‌ వాడకాన్ని చూసీచూడనట్లు ఊరుకుంటారన్న ఆరోపణలూ ఉన్నాయి. కాబట్టి కార్బైడ్‌ పండ్ల నుంచి దూరంగా ఉండాల్సిన బాధ్యత వినియోగదారులదే. ఇప్పుడు కార్బైడ్‌తో పండించని పండ్లు అంటూ ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు వెలుస్తున్నాయి. నమ్మకం ఉంటే వాటిలో పండ్లను తీసుకోవచ్చు. లేదా పండ్లని కొనుగోలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నా సరిపోతుంది.

 

- కార్బైడ్‌తో పండించిన పండ్లు చూడ్డానికి మరీ పచ్చగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి.

 

- చాలా సందర్భాలలో పండ్లు ఒక చోట మగ్గి, మరో చోట పచ్చిగా ఉన్నట్లు రెండు రంగులలో ఉంటాయి.

 

- పైకి పండిపోయినట్లు ఉండి, లోపల పచ్చిగా ఉందంటే.... అది ఖచ్చితంగా కార్బైడ్‌ మహిమే!

 

- కార్బైడ్‌తో పండిన పండ్లు కృత్రిమంగా మగ్గి ఉంటాయి కాబట్టి, వాటిలోని తీపిశాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.

 

- అన్నింటికీ మించి మామూలు పండ్లు మగ్గినప్పుడు వచ్చే ఆ సువాసన, కార్బైడ్ పండ్లలో కనిపించదు. అంటే రంగు, రుచి, వాసనల ద్వారా ఫలానా పండు కార్బైడ్‌తో మగ్గించారు అని తేలిపోతుందన్నమాట.

 

ఇదీ కార్బైడ్ పండ్ల కథ! ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒకోసారి మోసపోయే ప్రమాదం ఉంది కనుక, తినబోయే ముందర కాసేపు పండ్లను నీటి ధార కింద ఉంచితే, వాటిలోని విష రసాయనాలు చాలావరకూ కొట్టుకుపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు నిపుణులు.

 

- నిర్జర.

By
en-us Political News

  
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.