కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్?

Publish Date:Oct 19, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో అద్భుతమేమీ జరగలేదు. అనూహ్యమైన ఫలితం ఆవిష్కృతం అవ్వలేదు. అందరూ అనుకుంటున్నట్లుగానే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే విజయం సాధించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో మొత్తం 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. మరో  416 ఓట్లు చెల్లలేదు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ పరాజయం పాలైన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.

దీంతో రిగ్గింగ్ సంస్కృతి ఇప్పుడు పార్టీ అధ్యక్ష ఎన్నికలకు కూడా పాకిందా? ఇప్పటిదాకా అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చేవి. ఇప్పుడు ఈ జాడ్యం పార్టీ సంస్థాగత ఎన్నికలకు కూడా పాకిందా అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. 137 ఏళ్ల చరిత్ర గల గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఈ పదవికి పోటీ పడిన శశిథరూర్ ఆరోపణలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరిగాయి. బుధవారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో 9,500 ఓట్లు పోలవగా.. ఖర్గేకి 7,897 ఓట్లు రాగా.. శశిథరూర్ కు వెయ్యి 72 మంది ఓటు వేశారు. కాగా.. మరో 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. శతాధిక కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తాజాగా నిర్వహించిన ఎన్నికలతో కలిపి ఇప్పటి వరకూ ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. సుమారు 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు దక్కాయి.

ఈ ఎన్నికలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఓటమి చవిచూసిన శశిథరూర్ ట్విట్టర్ వేదికగా కొత్త అధ్యక్షుడు ఖర్గేను అభినందించారు. ఈ మేరకు ఆయన ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. అంతటితో ఆగకుండా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఉత్తరప్రదేశ్ లో అత్యంత తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపించడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసూదన్ మిస్త్రీకి శశిథరూర్ బృందం రాసిన లేఖ తాజాగా వెలుగుచూసింది.

ఒక పక్కన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగా శశిథరూర్ తరఫున ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరించిన సల్మాన్ సోజ్ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ‘ఉత్తరప్రదేశ్ లో తీవ్ర అవకతవకలు జరిగాయి. ఈ విషయం మిస్త్రీ కార్యాలయం దృష్టికి తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించాం. కానీ ఫలితం లేకపోవడంతో ఈ లేఖ రాయాల్సి వచ్చింది. యూపీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయత, సమగ్రత లోపించడం శోచనీయం. ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో ఖర్గే మద్దతుదారులు అక్రమాలకు పాల్పడిన విషయం ఆయనకు తెలియకపోవచ్చు. తెలిస్తే ఆయన అలా జరగనిచ్చేవారు కాదు. యూపీలో బ్యాలెట్ బాక్సులకు అధికారిక సీల్ వేయలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అనధికార వ్యక్తులు కూడా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే.. ఈ ఎన్నిక ప్రక్రియ స్వేచ్ఛగా.. న్యాయంగా , పారదర్శకంగా జరిగినట్లు ఎలా అవుతుంది? అందువల్ల యూపీలోని ఓట్లన్నీ చెల్లనివిగా పరిగణించాలని మేం డిమాండ్ చేస్తున్నాం’ అని థరూర్ బృందం ఆ లేఖలో పేర్కొన్నదని చెబుతున్నారు.

అయితే.. అంతర్గతంగా రాసిన ఈ లేఖ మీడియాకు లీకవడంతో సల్మాన్ సోజ్, శశిథరూర్ స్పందించారు. సీఈఏకి అంతర్గతంగా రాసిన లేఖ మీడియాకు లీక్ అవడం దురదృష్టకరం.  కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకే ఈ ఎన్నిక. విభజించేందుకు కాదు. ఈ విషయంలో సల్మాన్ ఇచ్చిన వివరణతో అనవసర వివాదానికి ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్ చేశారు.

By
en-us Political News

  
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.