Publish Date:Oct 15, 2022
రోడ్డుమీద వెళుతున్న టీవీలర్ వేగంగా వస్తూ అక్కడ ఆగిన ఆటోకి తగులుకుంది, కుర్రాడు కిందపడ్డాడు. వాడికి దెబ్బలు తగిలాయా లేదా అన్నది కాకుండా అసలు పార్కింగ్ ప్లేస్ కానిచోట ఆటో నిలిపిన ఆటో డ్రైవ ర్ ఆటో మీద గీత పడిందని ఆ కుర్రాడిని తిటిపోశాడు. కొద్దిరోజుల తర్వాత ఇలాంటి సంఘటనే జరిగింది మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఆ సంగతి వదిలి కారు పెద్ద మనిషి రెండువేలు కట్టించుకు న్నా డు. మనుషులం గనుక గాయపడినా, బండికి దెబ్బతగిలినా గొడవపడతాం, ఆస్పత్రికి వెళతాం. మరి నోరులేని జంతువు ఢీకొని గాయపడితే? అవును ఇది ఊహించని ప్రమాదమే. చాలా ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లోంచి రోడ్డు దాటి వెళుతూ గాయపడుతూంటాయి, ఒకటో అరో చనిపోతూనూ ఉంటాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా వాటి సంగతి పట్టించుకోవు. కానీ అస్సాం ముఖ్యమంత్రి బిశ్వశర్మ మాత్రం పట్టించుకు ని రైనో బాగోగులు కను గొన్నారు.
కజిరంగా నేషనల్ పార్కు సమీపంలో ఒక లారీ ఆగిఉంది. సాధారణంగా జింకలు, లేళ్లు, కుందేళ్లు వంటివి ఆ ప్రాంతాల్లో రోడ్డు దాటి వెళుతూంటాయి. అలాగే మొన్నామధ్య ఒక రైనో రోడ్డుమీదకి వచ్చింది. లారీని చూసింది. ఇదేదో తనవంటి పెద్ద జంతువు అనుకుని పొడవడానికి దూసుకువెళ్లింది. దానికి అది ఆగి ఉన్న లారీ అన్నది తెలీదుగదా. లారీ పక్కభాగాన్ని బలంగా ఢీకొట్టింది. కానీ లారీ కాస్తంత కదిలిం ది. మళ్లీ ఢీకొట్టిం ది కానీ లారీ పక్కభాగానికి ఉండే రేకు సొట్టబడిందంతే. రైనో మాత్రం బాగానే గాయపడి పడి పో యింది. లేవ బోయింది..కానీ దానివల్ల కాలేదు. ఇంతలో లారీ వెళిపోయింది. రైనో లేచి మెల్లగా అడవిలోకి వెళిపోయింది. దాని సంగతి తెలిసి అధికారులు డ్రోన్ సహాయంతో అది ఎక్కడుందో తెలుసు కుని ప్రాణాపాయం లేదని తెలిసి హమ్మయ్య అనుకున్నారు. అదే సంగతి ముఖ్య మంత్రి బిశ్వశర్మకి తెలియజేశారు.
అసలు అటవీ ప్రాంతం దగ్గర్లోని హైవేలకు స్పీడ్ బ్రేకర్లు గురించి చాలాకాలం నుంచే అక్కడి వారు గోడు పెడుతున్నారు. కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అక్కడే కాదు దేశంలో చాలాప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. కనీసం ఆ ప్రాంతాల్లో వేగం తగ్గించి వాహనాలు వెళ్లాలన్న హోర్డింగ్ హెచ్చరికలూ లేకపోవడం వల్లనే మూగజీవాలు చాలా ప్రమాదాలకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అటవీశాఖ, రైల్వే శాఖకు, రోడ్డురవాణాశాఖకు అనేక ఫిర్యాదులు వెళ్లినా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. మూగజీవాల సంరక్షణ గురించి పెద్ద ప్రచారం చేసేవారంతా ప్రధానంగా ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rhino-injured-after-attack-on-lorry-25-145462.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.