రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు మరో సారి డుమ్మా కొట్టనున్నారా? అమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ తెలుగుదేశం నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ ఆయనను విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసుల మేరకు రామ్ గోపాల్ వర్మ సోమవారం (ఫిబ్రవరి 10) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో రామ్ గోపాల్ వర్మ మూవీ ప్రమోషన్స్ కారణంగా విచారణకు హాజరు కాలేనంటూ సీఐడీకి సమాచారం ఇచ్చారు.
మూవీ ప్రమోషన్స్ తో పాటు ’ నెల 28న సినీమా విడుదల కూడా ఉందనీ, అందుకు విచారణకు హాజరయ్యేందుకు తనకు ఎనిమిది వారాల గడువు ఇవ్వాలని రామ్ గోపాల్ వర్మ కోరారు. అయితే రామ్ గోపాల్ వర్మ వినతిపై సీఐడీ స్పందించలేదు. దీంతో ఆయన విచారణకు హాజరౌతారా? డుమ్మా కొడతారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒక వేళ ఆయన విచారణకు హాజరు కాకుంటే మరో సారి నోటీసులు జారీ చేయాలని సీఐడీ భావిస్తున్నట్లు సమాచారం.
కాగా సోషల్ మీడియాలో పోస్టులపై రామ్ గోపాల్ వర్మ తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు యాంటిసిపేటరీ బెయిలు ఇచ్చిన కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలని షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు సహకరించడం లేదని కోర్టు భావిస్తే బెయిలు రద్దౌతుంది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ శనివారం (ఫిబ్రవరి 8) ఒంగోలులో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా పోలీసులు ఆయనను 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి, అవసరమైతే మళ్లీ పిలుస్తాం రావాలని పేర్కొని పంపించారు. ఆ విచారణ పూర్తి అవ్వగానే సీఐడీ పోలీసులు ఆయనను నోటీసులు ఇచ్చి సోమవారం (ఫిబ్రవరి 10) విచారణకు రావాల్సిందిగా కోరారు.
ఈ మేరకు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వర్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వర్మ సీఐడీ విచారణకు హాజరు కాలేనంటూ సీఐడీకి సమాచారం ఇచ్చారు. సీఐడీ ఆయన వినతిని అంగీకరిస్తుందా? లేక మరోసారి నోటీసులు జారీ చేస్తుందా? అన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒక వేళ సీఐడీ నోటీసులను బేఖాతరు చేసి రామ్ గోపాల్ వర్మ విచారణకు గైర్హాజరైతే బెయిలు రద్దయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rgv-skips-cid-inquiry-39-192624.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.