రెవెన్యూ లోటు కొండంత.. జగన్ సర్కారు దివాళా!

Publish Date:Feb 14, 2022

Advertisement

సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు కొండలా పేరుకుపోయింది. ఏపీకి వచ్చిన ఆదాయం కంటే రెవెన్యూ ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో రెవెన్యూ లోటు 900 శాతం దాటేసిందని గణాంకాలు చెబుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాలకు సంబంధించిన గణాంకాలు తేలిపోయాయి.

అసెంబ్లీకి బడ్జెట్ సమర్పించినప్పుడు ఏపీ రెవెన్యూ లోటును 5 వేల కోట్లు మాత్రమే ఉంటుందని లెక్కగట్టింది వైసీపీ సర్కార్. దాని ప్రకారమే రెవెన్యూ రాబడిని, ఖర్చులను సమన్వయం చేసేలా బడ్జెట్ ప్రతిపాదన జరిగింది. అయితే.. డిసెంబర్ నెల చివరితో ముగిసిన 9 నెలల కాలంలో రెవెన్యూ లోటు ఏకంగా 45 వేల 907 కోట్లుగా లెక్క తేలింది. అంటే బడ్జెట్ అంచనాల కన్నా రెవెన్యూ లోటు 918 శాతం మేరకు పెరిగిపోయిందన్నమాట. అయితే.. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి రెవెన్యూ లోటు నాటి అంచనాలతో పోల్చితే.. కేవలం 270 శాతం మాత్రమే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు క్రమంగా మెరుగవుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని, పన్నేతర ఆదాయాన్ని, కేంద్రం నుంచి వచ్చిన ఆదాయాన్ని కలిపి రెవెన్యూ రాబడిగా లెక్కవేస్తారు. అలా రెవెన్యూ రాబడి ఈ ఏడాది సుమారు లక్ష కోట్లకు చేరిందని గణాంకాలు చూస్తే స్పష్టం అవుతుంది. ఈ 9 నెలల్లో కేంద్రం నుంచి గ్రాంటుగా 25 వేల 246 కోట్లు వచ్చింది. దీనితో కలిపి ఏపీ రెవెన్యూ రాబడి 97 వేల 887 కోట్లకు చేరింది.

కాగా.. ఏపీలో రెవెన్యూ లోటే కాకుండా అప్పులు కూడా భారీగా పెరిగిపోతుండడం గమనార్హం. మొదటి 9 నెలల్లో వైసీపీ సర్కార్ ఏకంగా 58 వేల 111 కోట్ల రూపాయలు అప్పుగు సమీకరించింది. బడ్జెట్ అంచనాల్లో కేవలం 37 వేల 029 కోట్ల రుణంతోనే ఈ ఆర్థిక సంవత్సరాన్ని గట్టెక్కించేయాలని జగన్ సర్కార్ అనుకుంది. కానీ.. ఇప్పటికే అప్పు అంచనాలకు మించిపోయి 156 శాతానికి చేరిపోవడం ఆందోళన కలిగించే అంశం అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఏపీకి వచ్చే సొంత ఆదాయానికి దరిదాపుల్లో అప్పు చేసేసిన పరిస్థితులు ఉన్నాయి. జీఎస్టీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ ట్యాక్స్, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఇతర పన్నులు కలిపి ఏపీకి ఈ 9 నెలల్లో 69 వేల 943 కోట్లు ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో ఏపీ సర్కార్ చేసిన అప్పు 58 వేల కోట్లకు పైగా ఉందని లెక్కల్లో తేలుతోంది.

అనాలోచిత చర్యలు, అదుపూ అడ్డూ లేని ఖర్చులు, దొరికిన కాడికి తెచ్చిన అప్పులు, వాటికి కట్టాల్సిన వడ్డీలు, ఆస్తుల అమ్మకాలు, చివరికి పార్కుల్ని కూడా తాకట్టు పెట్టేసే స్థాయికి దిగజార్చిన వైసీపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును పణంగా పెడుతోందనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి.

By
en-us Political News

  
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్  శుక్రవారం (జూన్ 27) తన నివాసంలోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని దారుణంగా హత్య చేసన కేసులో బమ్మడి అప్పలరాజు అనే వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తూ విశాఖ జిల్లా కోర్టు శుక్రవారం (జూన్ 27) తీర్పు వెలువరించింది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచే ఉద్దేశమే లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏపీఈపీడీసీఎల్ ఆధ్వ‌ర్యంలో విశాఖ‌ప‌ట్నంలో రూ.14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూప‌ర్ ఈసీబీసీ భ‌వ‌నాన్ని శుక్ర‌వారం (జూన్ 27) మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప్రారంభించారు.
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత వైసీపీ కీలక నేత కొడాలి నాని హఠాత్తుగా శుక్రవారం (జూన్ 27) గుడివాడకు వచ్చా రు . గత ఏడాది జరిగిన ఎన్ని కలలో పరాజయం తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్ననాని అకస్మాత్తుగా గుడివాడకు ఎందుకు వచ్చారంటే ఓ కేసులో నానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
నమ్మలేని నిజాలు బయటకు వస్తున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ దూకుడు పెంచింది. పాత చిట్టాకు కొత్తగా యాడవుతున్న ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరినీ పిలిచి వాగ్మూలాలను నమోదు చేస్తోంది. సిట్ నిజానికి, ఇంతవరకు ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారనే విషయంలో సిట్ కు కూడా స్పష్టత లేదని అంటున్నారు.
అనంతపురం జిల్లాలో నకిలీ స్టాంపుల కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. కళ్యాణదుర్గంలో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప, అలియాస్ మీసేవ బాబు ఈ నకిలీ స్టాంపుల కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.
ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 19 కార్లుకు కల్తీ డీజిల్ కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
సింగయ్య మతి కేసులో ఏ2గా ఉన్నజగన్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు జులై 1కి వాయిదా వేసింది. ఆ సందర్భంగా అప్పటి వరకూ జగన్ పై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. పురుషుల సర్జికల్ వార్డు వద్ద పైకప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది.
మంత్రి సీతక్కను టార్గెట్ చేస్తూ, మావోయిస్టులు ఆమె తమ మూలాలను మరిఛిపోయారని హెచ్చరిస్తూ రాసిన లేఖ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌పై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందా? ఆయన వరుస వివాదాలలో చిక్కుకోవడానికి కారణాలేంటి? ఎవరైనా ఆయన్ని ప్రత్యేకంగా టార్గెట్‌ చేసి వివాదాల్లో నెడుతున్నారా?.. గుంటూరులో జగన్ కాన్యాయ్ వాహనం కింద పడి మృతి చెందిన సింగయ్య కేసులో జిల్లా ఎస్పీని తప్పుదోవ పట్టించింది ఎవరు? తీవ్ర కలకలం రేపిన ఆ ప్రమాదానికి సంబంధించి వినిస్తున్న ప్రచారంపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకు వెళ్తేనే నిజమైన న్యాయం జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు
ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ను పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని తాను కోరుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.