Publish Date:Oct 29, 2025
ఒక పక్క నవీన్ యాదవ్.. తన ప్రధాన ప్రత్యర్ధి కేటీఆర్ కి సవాల్ విసిరి.. తానేంటో ప్రూవ్ చేసుకోడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఓటర్లే టార్గెట్ గా కొన్ని లెక్కలు సరి చేస్తున్నారు. అవెలాంటి లెక్కలో చూస్తే.. బేసిగ్గా జూబ్లీహిల్స్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సినిమా జనాలు. కృష్ణానగర్, ఇంద్రా నగర్ వంటి ప్రాంతాల్లో అధికంగా నివసించే సినీ కార్మికుల ను ఆకట్టుకునేలా రేవంత్ వరాల జల్లు కురిపించేశారు.
ఇకపై పెద్ద పెద్ద సినిమా హీరోల సినిమాల టికెట్ ధరలుపెంచాలంటే లాభాల్లో 20 శాతం వాటా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. ఇప్పటి వరకూ ఇలా సినీ కార్మికులను కలవడానికి ఏ సీఎం కూడా రాలేదనీ.. తాను అలాక్కాదని.. మీ వల్లే మన తెలుగు సినిమా ఏకంగా ఆస్కార్ మెట్లు ఎక్కిందని.. అలాంటి కార్మికులకు సీఎం గా కాకుండా ఒక ఇంటి సభ్యుడిగా మీ ముందుకు వచ్చాననీ.. వచ్చే నవంబర్ చివరి వారంలో.. మిమ్మల్ని తప్పక కలుస్తాననీ.. ఆపై డిసెంబర్ 9న మీపై వరాల జల్లు కురిపించడం ఖాయమని అనడంతో ఒక్కసారిగా వారిలో ఆనందం పొంగిపొర్లింది.
ఇదిలా ఉంటే హఠాత్తుగా సీఎంకు సినీ కార్మికులపై ప్రేమ పొంగి పొర్లడానికి ఇక్కడ అధికంగా ఉండే సీమాంధ్ర సెటిలర్స్, అలాగే ఒక సామాజిక వర్గం కారణమని అంటున్నారు. సీఎం ఇలా వీరందరినీ కలసే విషయంలో మంత్రి తుమ్మల కీలక పాత్ర వహించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇటు క్లాస్ అటు మాస్ రెండు వర్గాల ఓటర్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ కలయిక ద్వారా సీఎం కవర్ చేశారు సీఎం రేవంత్. దీంతో నవీన్ గెలుపు నల్లేరు నడక అన్న ధీమా కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-strategy-behind-sops-to-cineworkers-25-208653.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.