Publish Date:Oct 24, 2025
తెలంగాణలో ఇటీవలి కాలంలో రాజకీయంగా ఎంత చర్చనీయాంశమైందో.. అంతకు మించి వివాదాస్పదమైన బీసీ రిజర్వేషన్ల అంశం ఇక కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయినట్లేనా? తెలంగాణ స్థానిక ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్.. ఆ విషయంలో చేతులెత్తేసిందా? ఈ విషయంలో కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశాలున్నాయని తెలిసినా తగ్గేదే లే అంటూ ముందుకు వెళ్లిన రేవంత్ సర్కార్ చివరికి ఇది జరిగేది లే.. అని ఉసూరు మందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైన తరువాత కూడా రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశంలో ముందుకే సాగుతామని సంకేతాలిచ్చింది. ఈ విషయంపై గురువారం (అక్టోబర్ 23)న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామన్న సంకేతాలిచ్చింది.
అయితే గురువారం (అక్టోబర్ 23) సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై కనీసం చర్చ కూడా లేకపోవడంతో రేవంత్ సర్కార్ రిజర్వేషన్ల అంశాన్ని కోల్ట్ స్టోరేజీలో పెట్టేసినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అంటే కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశ కూడా వదిలేసుకుని.. రిజర్వేషన్ల ఊసెత్తకుండానే ‘స్థానిక’ ఎన్నికలకు సమాయత్తం అవుతోందని అవగతమౌతోంది.
ఎందుకంటే రిజర్వేషన్ల అంశం చర్చించకుండా.. స్థానిక ఎన్నికలలో పోటీకి ఇంత కాలం ఉన్న ఇద్దరు పిల్లలు అన్న నిబంధనను రద్దుపై చర్చింది, ఆమోదం తెలిపింది. ఇందు కోసం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. దీంతో స్థానికి ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తుతానికి అటకెక్కించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-sarkar-step-back-on-bc-reservations-in-local-bodies-elections-39-208421.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.