జనం చెవిలో రేవంత్ రెడ్డి పూలు!

Publish Date:May 4, 2024

Advertisement

రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు పెట్టిన పూలే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెడుతున్నారు. ఎందుకంటే, ఆ పూలు పెట్టక తప్పని పరిస్థితి. విభజన చట్టం ప్రకారం పోలవరం పరిసరాల్లోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యాయి. 2014లో ఈ విలీనం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రక్రియకు మద్దతు పలికారు. అది జరగక తప్పని అంశం అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ మాట మార్చారు. ఆంధ్రాలో కలసిన గ్రామాలను తిరిగి తెలంగాణకు తెస్తాం అని చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చి పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ అండ్ కంపెనీ విలీన గ్రామాలు అనే పాయింట్‌ని పట్టుకుని మొన్నటి వరకూ వేలాడింది. ఇప్పుడు అదే పాయింట్‌ని పట్టుకుని రేవంత్ రెడ్డి వేలాడ్డం ప్రారంభించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రీసెంట్‌గా విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఈ హామీ చేశారు. ఏపీలో విలీనం అయిన గ్రామాలను వెనక్కి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావాల్సిన 1. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, 2. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, 3. హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), 4. హైదరాబాద్-విజయవాడ రహదారి వెంటే వేగవంతమైన రైల్వే ప్రాజెక్టు, 6. మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు... ఇవన్నీ సాధిస్తామని రాసుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సినవి ఇవ్వాల్సిందే అని అడగడంలో న్యాయం వుంది. కాకపోతే అదే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే కదా... తెలంగాణలోని గ్రామాలను ఆంధ్ర్రపదేశ్‌లో కలిపింది. మాకు రావలసినవి అడుగుతాం.. ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వం అనే సిద్ధాంతం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. పైగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. 

కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే జనాన్ని మభ్యపెట్టడానికి గ్రామాలను తిరిగి తెచ్చే హామీ ఇస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవాలని అనుకుంటే ఆయన ఇష్టం. ఎవరు కాదంటారు?

By
en-us Political News

  
పిరికి పిల్లి పిన్నెల్లి చేసిన పాపాలకు కనీసం ఏడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది. ఆయన రాక కోసం సెంట్రల్ జైలు గేటు ఎదురుచూస్తోంది.
మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం పంపించారు.
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఘటనలో బాధితుడు శేషగిరిరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి, పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని... ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈవీఎంపై దాడిని ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని అభినందించారు.
శాంక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైన అచ్చ తెలుగు మహిళ జయ బాడిగ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఈ సందర్భంగా తెలుగు వెలుగును చాటారు.
పోలీసుల కళ్ళుగప్పి పిన్నెల్లి బ్రదర్స్ తప్పించుకుని పారిపోయారని తెలుస్తోంది. వీళ్ళ అరెస్టు గురించి గానీ, మళ్ళీ తప్పించుకుని పోయిన  విషయంలో గానీ, పోలీసుల నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు.
కిక్రెట్ రారాజు, రన్ మిషన్ కింగ్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందా? అంటే ఔననే అంటున్నారు గుజరాత్ పోలీసులు. కచ్చితమైన సమాచారం మేరకు కింగ్ కోహ్లీ లక్ష్యంగా ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిన నలుగురు టెర్రరిస్టులను అదుపులోనికి తీసుకున్నామని చెబుతున్నారు.
పిఠాపురంలో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. పట్టణంలోని అగ్రహారం పశువుల సంత సమీపంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్నిధ్వంసం చేశారు. అంత‌టితో ఆగ‌క, విగ్ర‌హం ముఖంపై క‌సిగా గాట్లు పెట్టారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు అక్క డకు చేరుకుని అంబేద్కర్‌ విగ్రహాన్ని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాస్తారోకోకి దిగారు.
విజయంపై విశ్వాసం వ్యక్తం చేయడంలో వైసీపీ కీలక నేతలంతా సైలెంట్ అయిపోయినప్పటికీ కొందరు మాత్రం ఇంకా గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నారు. వీరిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ లు ముందు వరుసలో ఉంటారు. వారి ప్రకటనలను నమ్ముతున్నదెవరు? నవ్వి పోతున్నదెవరు అన్నది పక్కన పెడితే.. వారి ప్రకటనల్లోని డొల్లతనం వారి మాటల్లోనే కనిపించేస్తోంది.
ప్రాణవాయువు ఇచ్చే చెట్టు నిండు ప్రాణం తీసింది. చెట్టు విరిగి మీద పడటంతో రవీంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
తెలుగుదేశం అధికారం చేపట్టిన  రోజునుంచే రెడ్ బుక్ పేజీల్లో ఎవరెవరి పేర్లు వున్నాయో... వారి పేజీలు చిరిగిపోవడం ప్రారంభమవుతుంది.
ఈసారి అటో ఇటో ఎటోకాకుండా తన భార్య అన్నా లెజ్నేవాతో కలసి తన అత్తగారి దేశమైన రష్యాకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారట
ఆయ‌న చ‌నిపోయిన సంఘ‌ట‌న మతవర్గాలలో దిగ్భ్రాంతి క‌లిగించింది. ఇరాన్ దేశమంతటా సామాన్య జనంలో సంతోష ఛాయలు క‌నిపించాయి. ఎందుకంటే.... హిజాబ్‌ ధరించకుండా ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణతో మహషా అమీని ప్రాణాలు తీశారు. మత ఛాంద‌సంతో నైతిక పోలీసింగ్ పేరిట‌, ఆమెకు నీతి పాఠాలు బోధిస్తూ, చిత్ర హింసలు పెడుతూ ప్రాణాలు తీశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.