జనం చెవిలో రేవంత్ రెడ్డి పూలు!

Publish Date:May 4, 2024

Advertisement

రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు పెట్టిన పూలే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెడుతున్నారు. ఎందుకంటే, ఆ పూలు పెట్టక తప్పని పరిస్థితి. విభజన చట్టం ప్రకారం పోలవరం పరిసరాల్లోని కొన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యాయి. 2014లో ఈ విలీనం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రక్రియకు మద్దతు పలికారు. అది జరగక తప్పని అంశం అని చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ మాట మార్చారు. ఆంధ్రాలో కలసిన గ్రామాలను తిరిగి తెలంగాణకు తెస్తాం అని చెప్పడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చి పబ్బం గడుపుకోవడానికి కేసీఆర్ అండ్ కంపెనీ విలీన గ్రామాలు అనే పాయింట్‌ని పట్టుకుని మొన్నటి వరకూ వేలాడింది. ఇప్పుడు అదే పాయింట్‌ని పట్టుకుని రేవంత్ రెడ్డి వేలాడ్డం ప్రారంభించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రీసెంట్‌గా విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఈ హామీ చేశారు. ఏపీలో విలీనం అయిన గ్రామాలను వెనక్కి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావాల్సిన 1. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, 2. బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం, 3. హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), 4. హైదరాబాద్-విజయవాడ రహదారి వెంటే వేగవంతమైన రైల్వే ప్రాజెక్టు, 6. మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు... ఇవన్నీ సాధిస్తామని రాసుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సినవి ఇవ్వాల్సిందే అని అడగడంలో న్యాయం వుంది. కాకపోతే అదే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే కదా... తెలంగాణలోని గ్రామాలను ఆంధ్ర్రపదేశ్‌లో కలిపింది. మాకు రావలసినవి అడుగుతాం.. ఇవ్వాల్సినవి మాత్రం ఇవ్వం అనే సిద్ధాంతం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి. పైగా ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. 

కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు అయితే జనాన్ని మభ్యపెట్టడానికి గ్రామాలను తిరిగి తెచ్చే హామీ ఇస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవాలని అనుకుంటే ఆయన ఇష్టం. ఎవరు కాదంటారు?

By
en-us Political News

  
వైసీపీ నేత పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ లో పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేశారు. మాచర్ల వైసీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి పోలింగ్ రోజున విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు.
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ పేరు కాస్తా మారిపోయింది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం తన మార్కు ఉడేలా  జాగ్రత్తపడింది.
సార్వత్రిక ఎన్నికలు ఇప్పటివరకూ ఐదు విడతలు పూర్తి అయ్యాయి. జూన్ 1వతేదీతో ఎన్నికలు పూర్తి అవుతాయి. మూడోసారి తమకు అధికారం రావడం గ్యారంటీ అని బీజేపీ ఘంటాపథంగా చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు తొలి ఐది విడతలలో బీజేపీ భారీగా నష్టపోతున్నది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అయినపుడు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు 2017 లో ప్రభుత్వ స్పెషల్ జీ.ఓ ద్వారా కార్పొరేట్ మద్యం దుకాణాన్ని తెరిచి.. పన్నులు చెల్లించకుండా యథేచ్చగా అక్రమాలకు పాల్పడిన టానిక్ ది, స్కామ్ అని బీజేపీ పెద్దలు భావించలేదు? ఎందుకు కవితను మాత్రమే టార్గెట్ చేశారు? రెండు మధ్యానికి సంబందించిన కుంభకోణాలే కదా!
ఇంతకాలం జగన్‌కి కావల్సిన ప్రమోషన్ కార్యక్రమాలు, టీడీపీ వ్యతిరేకంగా విష ప్రచారాలు, ఉత్తుత్తి సర్వేలు జరిపి జగన్ గెలుస్తున్నాడని ప్రచారం చేస్తూ, తోకఊపుతూ బతికిన ‘రేసు’ కుక్క లాంటి  సంస్థ కూడా తోక ముడుచుకుని తన దుకాణం బంద్ చేసే ప్రయత్నాల్లో వుంది.
మాచర్ల నుంచి పారిపోయిన పిన్నెల్లి పిల్లి బ్రదర్స్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పిన్నెల్లిని ఎమ్మెల్యే పదవికి, ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించే అవకాశాలను కూడా ఈసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసీ ఏ నిర్ణయమైనా లాగకుండా త్వరగా తీసుకుంటే మంచిది.
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా ఆయన ఒక పోలింగ్ బూత్ లో ఈవీఎమ్ ధ్వంసం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన తరువాత మాత్రమే ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.
తమ్మినేని సీతారాం.. జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఆయన వ్యవహారశైలి ఎంత వివాదాస్పందంగా ఉందో అందరికీ తెలిసిందే. అసెంబ్లీ లోపలా, బయటా కూడా ఆయన తీరు, భాష అనుచితంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి.
పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడడం లేద‌ని అనుకున్న‌ట్లుగా ఉంది వైసీపీ నేత‌ల తీరు. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ రోజు, ఆ త‌రువాత వైసీపీ నేత‌ల అరాచ‌కం అంతాఇంతా కాదు. పోలింగ్ స‌జావుగా జ‌ర‌గ‌కుండా ఉండేందుకు వారు చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు కావడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. సాధారణంగా వారాంతాలతో పోలిస్తే మిగిలిన రోజులలో భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంటుంది.
రాయల్ భూటాన్ మొనాస్టరీ ప్రధాన బౌద్ధాచార్యులు ఖెన్ పొ ఉగేన్ నాంగెల్, బుద్ధవనం బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ ప్రత్యేకతలను ప్రశంసించినట్లు బుద్ధవనం కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ మరోసారి పేదల ఖాతాల్లోకి సొమ్ము అంటూ హామీ ఇచ్చారు. దీంతో గతంలో కూడా విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి రప్పించి పేదల ఖాతాల్లో జమ చేస్తానంటూ ఇచ్చిన హామీ గురించి జనం గుర్తు చేసుకుంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.