రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏసీబి తొందరపడిందా?

Publish Date:Jun 5, 2015

Advertisement

 

తెదేపా యం.యల్యే. రేవంత్ రెడ్డిని ఏదో విధంగా ఉచ్చులో బిగించాలని తొందరలో ఏసీబి అధికారులు, వారికి వెనుక నుండి వత్తాసు పలుకుతున్నవారు కొన్ని విషయాలు విస్మరించడం వలన చివరికి వారు త్రవ్విన గోతిలో వారే పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యవహారం అంతా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జరిగింది. కనుక ప్రజాప్రతినిధి అయిన రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేముందు ఏసీబి అధికారులు తప్పనిసరిగా ఎన్నికల కమీషన్ కి ముందుగా తెలియజేసి, దాని అనుమతితోనే చేప్పట్టవలసి ఉంటుంది. కానీ ఎన్నికల కోడ్ ని పట్టించుకోకుండా ఏసీబి అధికారులు ప్రజాప్రతినిధి అయిన రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టడం, నిర్బందించడం రెండూ కూడా తప్పేనని, ఆవిధంగా చేసినందుకు ఒకవేళ ఎన్నికల కమీషన్ ఏసీబి అధికారులపై చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

 

ఇక ఏప్రిల్, 2014లో ఆప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గోగయ్ మరియు జస్టిస్ యన్.వి. రమణలతో కూడిన ధర్మాసనం “స్టింగ్ ఆపరేషన్లపై” ఇచ్చిన ఒక తీర్పులో “ఒక నేరస్తుడిని సాక్ష్యాధారాలతో పట్టుకొనే ప్రయత్నంలో స్టింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం నైతిక విలువలను ప్రశ్నార్ధకంగా మార్చుతాయి. ఒకవేళ నిందితుడికి నేరం చేయాలనే ఉద్దేశ్యం, ఆలోచనా లేకపోయినప్పటికీ, తను నేరం చేసినా ఎవరూ కనుగొనలేరనే భావన అతనిలో కల్పించడం, తద్వారా అతనిని నేరానికి ప్రోత్సహించడం ఏవిధంగా సమర్ధనీయం కాదు. అటువంటి పరిస్థితి నెలకొని ఉందని తెలిసుంటే బహుశః నిందితుడికి నేరం చేయాలనే ఆలోచన చేయకపోవచ్చును. అటువంటప్పుడు ఒక అమాయకుడయిన వ్యక్తిని ఈవిధంగా నేరం చేయడానికి ప్రేరేపించి నేరస్తుడిగా నిరూపించే ప్రయత్నం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. అతను నేరం చేయడానికి అనువయిన పరిస్థితులను స్వయంగా కల్పించి, నేరం చేసినా ఎవరూ కనుగొనలేరనే అభిప్రాయం అతనికి కలిగించి, నేరం చేయడానికి పరోక్షంగా ప్రేరేపించి, అతను నేరం చేస్తున్నపుడు ఈ విధంగా స్టింగ్ ఆపరేషన్స్ చేసి ఒక వ్యక్తిని దోషిగా నిరూపించే ప్రయత్నం కూడా నేరమే! కనుక నైతిక విలువలకు విరుద్దమయిన ‘స్టింగ్ ఆపరేషన్స్’ ద్వారా సేకరించిన ఆధారాలను సాక్ష్యాలుగా స్వీకరించలేము,” అని పేర్కొంది సుప్రీం కోర్టు ధర్మాసనం.

 

అదే విధంగా రిసాల్ సింగ్ వెర్సస్ హర్యానా ప్రభుత్వం కేసుతో సహా అటువంటి అనేక ఇతర కేసులలో సుప్రీంకోర్టు ‘స్టింగ్ ఆపరేషన్’ నిర్వహించడాన్ని తప్పు పట్టడమే కాకుండా వాటి ద్వారా సేకరించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. కనుక రేవంత్ రెడ్డిపై ఏసీబీ అధికారులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకోవని భావించవచ్చును.

 

ఇక ఇటువంటి వ్యవహారాలలో ఏసీబీ అధికారులు స్వయంగా సేకరించిన ఆధారాలకు తప్ప మూడవ వ్యక్తి అందజేసిన ఆధారాలు అంటే నామినేటడ్ యంయల్యే స్టీఫన్ సన్ లేదా మరొకరో తమ ఫోన్ లో రికార్డు చేసిన సంభాషణలు వంటివి కోర్టులు సాక్ష్యాలుగా స్వీకరించవని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారంలో జరిగిన మరొక పొరపాటు ఏమిటంటే ఏసీబీ అధికారులు చిత్రీకరించిన ఆడియో వీడియో క్లిప్పింగులను వారికి తెలిసో, తెలియకుండానో ఎవరో బహిర్గతం చేయడం. ఏసీబీ అధికారులు కేవలం నేరస్తుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొనే ఉద్దేశ్యంతోనే రికార్డు చేసిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కేవలం నేర విచారణ కోసమే వినియోగించాలి తప్ప మీడియాకు విడుదల చేయకూడదు. కానీ విడుదల చేయబడ్డాయి. అంటే రాజకీయ దురుదేశ్యంతోనే ఎవరో పనిగట్టుకొని ఈ పని చేసినట్లు స్పష్టమవుతోంది.

 

వాటిని తాము మీడియాకు విడుదల చేయలేదని ఏసీబీ డీజీపి యంఏ.ఖాన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. అంటే ఏసీబీ అధికారులు కాకుండా వేరేవరయినా కూడా రికార్డు చేసేందుకు ఏసీబీ అధికారులు అనుమతించారా? లేకపోతే వారే స్వయంగా ఎవరికో అందజేసి మీడియాకు విడుదల చేసి తమకుతెలియదని చెపుతున్నారా? అనే ప్రశ్నకు ఏసీబీ అధికారులు కోర్టులో జవాబు చెప్పవలసి రావచ్చును. ఇక వారు రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులను మీడియాకు విడుదల చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిని రాజకీయంగా దెబ్బ తీయాలనే ప్రయత్నం జరిగినట్లు స్పష్టం అవుతోంది కనుక సదరు వ్యక్తులని, ఏసీబీ అధికారులను కూడా కోర్టులు బాధ్యులను చేసే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు చెపుతున్నారు.

 

ఇక మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన ఆడియో, వీడియో సాక్ష్యాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవనే చిన్న విషయం నేరస్తులను కనిపెట్టే ఏసీబీ అధికారులకు గానీ, వారిని వెనుక నుండి ప్రోత్సహిస్తున్న వారికి గానీ తెలియకపోవడం. ఏమయినప్పటికీ రేవంత్ రెడ్డి కేసులో అతనిని నేరస్తుడిగా నిరూపించే ప్రయత్నం కంటే ఆయనను, ఆయన పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నమే ఎక్కువగా కనబడుతోంది. ఏసీబి అధికారులు నేర నిరూపణ చేయకముందే వారు రికార్డు చేసిన ఆడియో వీడియోలను మీడియాకు తక్షణమే విడుదల చేయడం, ఏసీబి అధికారులు మాట్లాడవలసిన సాక్ష్యాలు ఆధారాలు వంటి విషయాల గురించి రాజకీయ నాయకులు మాట్లాడటం, కోర్టులు తీర్పు చెప్పకముందే తామే తీర్పులు చెపుతుండటం వంటివన్నీ నిశితంగా గమనిస్తే ఇది రాజకీయ దురుదేశ్యంతో జరిగిందనే అనుమానం కలుగక మానదు.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.