రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ సంచలనం!

Publish Date:Jun 23, 2026

Advertisement

తెలుగు వన్ ఎక్స్ క్లూజివ్

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. సాధారణంగా ఒక జెడ్పీటీసీ  స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాకు ఎదగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక రేవంత్ రెడ్డి అసమానమైన ధైర్యం, రాజకీయంపై ఉన్న అపారమైన పట్టు దాగి ఉన్నాయి. తెలుగువన్ వాస్తవ వేదికలో జమీన్ రైతు సంపాదకుడు  డోలేంద్ర ప్రసాద్  రేవంత్ రెడ్డి కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక  రాజకీయ జ్ఞాని అని అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఢిల్లీ అధిష్ఠానం లేదా రాహుల్ గాంధీ పాత్ర కంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగత చొరవ, వ్యూహాలే అత్యంత కీలక పాత్ర పోషించాయన్నారు. 

ఎన్నికల బరిలో కేసీఆర్,  బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో..  ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్,  కేటీఆర్ ల కంటే  మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు. కేసీఆర్ శైలిలోనే ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడి, వాటిలో అసలైన పేటెంట్ రైట్ తనదే అని నిరూపించుకున్నారు. ప్రజాకర్షణలో ఆయన చూపిన వేగం, చొరవ కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఈ రాజకీయ సమరంలో కేవలం మాటలకే రేవంత్ రెడ్డి పరిమితం కాలేదు. ఆర్థిక వ్యూహాల్లోనూ, కుల సమీకరణాల్లోనూ ఆయన తనదైన శైలిని ప్రదర్శించారు. కేసీఆర్ ఎన్నికల కోసం ఎన్ని వేల కోట్లు వ్యయం చేశారనేది పక్కన పెడితే..  రేవంత్ రెడ్డి అంతకంటే ఒక రూపాయి ఎక్కువే పెట్టి దీటుగా నిలబడ్డారనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా నడిచింది. ఎన్నికల నిర్వహణలోనూ, వ్యూహాల అమలులోనూ ఎక్కడా వెనకడుగు వేయలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో తనకంటే ఎంతో సీనియర్లయిన నాయకులు ఉన్నప్పటికీ, వారందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన అద్భుతమైన విజయం సాధించారని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. సాధారణంగా కాంగ్రెస్ లాంటి పెద్ద పార్టీలో అంతర్గత విభేదాలు సహజం. కానీ సీనియర్లందరి సహకారం తీసుకుని, వారిని ఒక జట్టుగా నడిపించి విజయం సాధించడమే రేవంత్ రెడ్డి అసలైన సక్సెస్ సీక్రెట్ అని చెప్పారు. 

హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సమీకరణాలు కూడా రేవంత్ రెడ్డి విజయానికి ఎంతగానో తోడ్పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్న భూములు, రియల్ ఎస్టేట్ కంపెనీల కబ్జాలు,  ఆక్రమణలపై అక్కడి భూస్వాములు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం తీవ్ర ఆందోళన చెందింది. ఒకవేళ మళ్ళీ పాత ప్రభుత్వమే వస్తే తమ భూములు తాము కోరుకున్న ధరకు కాకుండా, వారు చెప్పిన ధరకే ఇచ్చుకోవాల్సి వస్తుందేమోననే భయం నెలకొంది. ఈ ఆందోళనతో రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖులు, రెడ్డి సామాజిక వర్గ భూస్వాములు అందరూ ఏకతాటిపైకి వచ్చారు. వీరంతా రేవంత్ రెడ్డికి అటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ బలమైన శక్తుల కలయికే రేవంత్ రెడ్డిని గెలుపు తీరాలకు చేర్చింది.

ఇక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారంటూ వస్తున్న ఊహాగానాలలో ఎలాంటి నిజం లేదని  డోలేంద్రప్రసాద్ అన్నారు.  బీజేపీ సిద్ధాంతాల ప్రకారంఆర్ఎస్ఎస్ తో బలమైన సంబంధాలు లేని వారికి ఉన్నత పదవులు దక్కడం అసాధ్యమన్న డోలేంద్ర ప్రసాద్.. అస్సాం లాంటి ఈశాన్య రాష్ట్రాల మినహాయింపులు వేరన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు బీజేపీలో చేరినా వారికి ఎలాంటి గుర్తింపు దక్కలేదనేదని ఉదహరించారు. రేవంత్ రెడ్డి   బీజేపీలోకి వెళ్తే అదే పరిస్థితి ఎదురవుతుందనీ, రేవంత్ అంతటి అమాయకుడు కాదన్నారు.   ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ, ప్రత్యేక గుర్తింపు ఉన్నాయి. రాహుల్ గాంధీ సైతం ఆయన మాటను కాదనలేని స్థాయిలో రేవంత్ రెడ్డి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందుకే తెలంగాణలో ఈ తిరుగులేని గెలుపు కేవలం రేవంత్ రెడ్డి సొంతమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.

వాస్తవ వేదిక పూర్తి చర్చ తెలుగువన్ చానెల్ లో చూడండి

By
en-us Political News

  
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.