జగన్ అయితే ఏంటి? మాజీ మంత్రి దాడి రాజీనామా.. పూతలపట్టు ఎమ్మెల్యే ఫైర్!

Publish Date:Jan 2, 2024

Advertisement

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో పార్టీ అస్థిత్వమే ప్రశ్నార్థకమయ్యే స్థాయిలో అసమ్మతి, అసంతృప్తి ప్రజ్వరిల్లుతోందా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఆర్కే రాజీనామాతో మొదలైన అసమ్మతి అలజడి రోజు రోజుకూ పెరుగుతోంది. ఆ అసంతృప్తి, అసమ్మతి వేడి సెగకు బెదిరిన  తన నైజానికి భిన్నంగా సిట్టింగుల మార్పు కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి అసమ్మతీయులను బుజ్జగించి, సముదాయించే బాధ్యతలను రీజనల్ కో ఆర్డినేటర్లకు అప్పగించేసి వారికి ముఖం చాటేస్తున్నారు.

అయితే వైసీపీలో కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల మాట విని తగ్గండి అని అసమ్మతి ఎమ్మెల్యేలకు సూచించినా, వారు అందుకు సుముఖంగా లేరు. తమపై ప్రజా వ్యతిరేకత ఉంటే.. దానికి కారణం జగనే కనుక తమను నియోజకవర్గం నుంచి తప్పించడానికి కారణమేమిటో జగనే చెప్పాలని భీష్మిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఎదుటే నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. నిన్నటి దాకా జగన్ తనను తాను ప్రజాబాంధవుడిగా చెప్పుకుంటూ, పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎమ్మెల్యేలే అంటూ వారిని మార్చేస్తూ సేఫ్ గేమ్ ఆడదామనుకున్నారు. అయితే అత్యంత సహజంగా ఆయన ఆడదామనుకున్న సేఫ్ గేమ్ రివర్స్ అయ్యింది.

నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో ఎమ్మెల్యేలుగా తాము అనామకులుగా మారిపోయామనీ, ప్రజలలో ప్రభుత్వం పట్ల, తమ పట్ల అసమ్మతి, వ్యతిరేకత ఉంటే అందుకు పూర్తి బాధ్యత జగన్ దేననీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తేల్చి చెప్పేస్తున్నారు. మీడియా సమావేశాలు పెట్టి మరీ జగన్ కు ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరైతే తమ అనుచరులతో సహా పార్టీకి రాజీనామాలు చేసేసి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు సైతం ఉంటున్నారు. తమ రాజీనామా లేఖలలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ల పేరు కూడా ప్రస్తావించడం లేదు. జగన్ నిర్ణయాలను బాహాటంగా వ్యతిరేకించడానికి, ధిక్కరించడానికీ ఇసుమంతైనా వెనుకాడటం లేదు. 

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏక వాక్య లేఖను ముఖ్యమంత్రి జగన్ కు పంపారు. అందులో తాను తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఒకే ఒక్క వాక్యం పేర్కొన్నారు. ఈ రాజీనామా ప్రతులను ఆయన ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి పంపారు. ఆ వాక్యంలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు.

అలాగే రాజీనామా ప్రతిని కూడా ఆయనకు పంపలేదు. తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయ ప్రవేశం చేసిన దాడి వీరభద్రరావు 1985 నుంచి 1999 వరకూ వరుసగా నాలుగు సార్లు అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994లో ఆయన ఎన్టీఆర్ కేబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా పని చేశారు. వృత్తి రిత్యా హిందీ టీచర్ అయిన దాడి వీరభద్రరావును ఆయన అనుచరులు, అభిమానులు ప్రేమగా మాస్టారూ అని పిలుస్తారు.  తన రాజీనామా లేఖలో అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు పేర్కొన్న దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 

ఇక జగన్ ను ప్రశ్నలతో నిలదీసిన మరో ఎమ్మెల్యే.. అసంతృప్తికి మొత్తం కారణం జగన్ అయితే తనను నియోజకవర్గం మార్చడమేమిటని సూటిగా ప్రశ్నించారు. పూతలపట్టు ఎమ్మెల్్యే ఎంఎస్ బాబు వ్యతిరేకత పేరు చెప్పి తనకు జగన్ పార్టీ టికెట్ నిరాకరిస్తే అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ అంటే జగన్ మాత్రమేననీ, ఆయన తరువాత ఎవరికైనా ఏదైనా పని చేసే అవకాశం ఉందంటే వారు వాలంటీర్లు మాత్రమేనని పేర్కొన్న బాబు ఇప్పుడు అసంతృప్తి పేరు చెప్పి ఎమ్మెల్యేలను బలిచేయడమేమిటని జగన్ ను ప్రశ్నించారు. మీడియా సమావేశంలో నిర్మొహమాటంగా, నిష్కర్షగా ప్రజలలో ఉన్న వ్యతిరేకత అంతా జగన్ పైనే తప్ప ఎమ్మెల్యేలపై కాదని చెప్పారు. అయినా ప్రజల ముందుకు రాలేని ముఖ్యమంత్రి జగన్ ప్రజా వ్యతిరేకత తనపై  లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పూతలపట్టు ఎమ్మెల్యేగా తాను జగన్ చెప్పిన ప్రతి పనీ చేశాననీ, గడపగడపకు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లాలని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు అసంతృప్తి అనేది ఉంటే అది తనపై కాదు, జగన్ పైనేనని స్పష్టంగా చెప్పేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ స్థాయిలో జగన్ పై ఫైర్ కావడం దాదాపు ఇదే తొలి సారి అని చెప్పవచ్చు. జగన్ అధికారం చేపట్టిన ఇన్నేళ్లల్లో ఒక్క సారి కూడా నియోజకవర్గ పరిస్థితి గురించి ఒక్కసారి కూడా పిలిపించి మాట్లాడలేదనీ, అసంతృప్తి పేరుె చెప్పి దళిత ఎమ్మెల్యేలను దగా చేస్తున్నారనీ విమర్శించారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ మంత్రి డొక్కా కూడా  ఒక్క సారి అప్పాయింట్ మెంట్ ఇప్పించండి అని వేడుకున్న ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పూతలపట్టు నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వనంటే అంగీకరించేది లేదనీ, వైసీపీలోనే ఉండి పోరాడతానని అన్నారు. జగన్, మంత్రి పెద్దిరెడ్డి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  ఐ ప్యాక్ సర్వేలను చూపించి వ్యతిరేకత ఉందని చెబుతున్నారని అంటూ  డబ్బులు ఇచ్చిన వాళ్లకు  ఐఫ్యాక్   సర్వే ఫలితాలు అనుకూలంగా ఉంటాయన్నారు.  ఇప్పుడు సొంత పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే సంధించిన ప్రశ్నలకు చేసిన విమర్శలకు జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 

By
en-us Political News

  
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.