తీహార్ జైలు నుంచి కండిషన్ బెయిల్ మీద విడుదలైన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో మారు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో తన పర్యటనలు అట్టర్ ప్లాప్ కావడంతో తాజాగా బీసీ నినాదం ఎత్తుకున్నారు. బతుకమ్మ ఈవెంట్ టార్గెట్ గా ఏర్పాటైన జాగృతి సంస్థ ఇపుడు బిసీ నినాదాన్ని ఎత్తుకుంది. శుక్రవారం సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్బంగా బిఆర్ఎస్ పిలుపునిచ్చిన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బిసీలు గుర్తుకురాని కవిత సడెన్ గా బిసీ నినాదాన్ని ఎత్తుకున్నారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన బిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా లేదు. ఈ ఎన్నికలను వాయిదావేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనాభాలో సగభాగం ఉన్న బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఏమిటని ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని కాంగ్రెస్ పార్టీ మర్చిందని గుర్తు చేయడానికి స్థానికసంస్థల ఎన్నికల వేళ బిసీజెండాను ఎత్తుకుంది. బతుకమ్మ వేడుకలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జాగృతి సంస్థ బతుకమ్మ వేడుకలను పూర్తిగా గాలికొదిలేసింది. కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారని అందరూ ఊహించారు. కానీ ఆ ఊసే లెకుండా బతుకమ్మ సంబరాలను స్కిప్ చేశారు.
ఇపుడు తాజాగా బీసీ డెడికేషన్ కమీషన్ నివేదిక ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కవిత కొత్త రాగం అందుకున్నారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు జరగడానికి వీల్లేదని కవిత హుంకరిస్తున్నారు. అప్పట్లో లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నప్పుడు కూడా కవిత ఇదే విధంగా బిజెపితో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడిపారు. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేయడం తెలంగాణ ప్రజానీకానికి ఇంకా గుర్తుండే ఉంటుంది. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కోర్టు ట్రయల్స్ కు హాజరైన సమయంలో కూడా కవిత జై తెలంగాణా నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ వ్యాఖ్యల పట్ల న్యాయస్థానం కవితకు అక్షింతలు వేసింది . తెలంగాణ ఉద్యమానికి లిక్కర్ స్కాంకు ఉన్న సంబంధం ఏమిటో కవితనే సమాధానమిస్తే బాగుంటుంది. తెలంగాణా రాజకీయాల్లో మోస్ట్ వపర్ ఫుల్ పొలిటిషన్ అయిన కవిత కామెడీ స్టార్ గా మిగిలిపోయారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reservation-should-be-implemented-for-bcskavita-new-tune-39-190709.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.