Publish Date:Oct 26, 2024
దేశంలో జమిలి ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలన్నీ ఇప్పటి నుంచే జమిలికి రెడీ అయిపోయాయి. ఆ దిశగా తమతమ పార్టీల క్యాడర్ ను ప్రిపేర్ చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరిపి మరీ జమిలి నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి ఇటీవల విస్పష్టంగా చెప్పేశారు. ఆ విషయంలో శషబిషలకు తావులేదని తేల్చేశారు. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2029లో జరగాలి. అయితే అంత కంటే రెండేళ్లు ముందుగానే అంటే 2027 జమిలికి కేంద్రం ముహూర్తం పెట్టేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జమిలికి ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న కృత నిశ్చయంతో కేంద్రం ఉండటంతో 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృ త్వంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికే తేన నివేదికను సమర్పించింది. దీంతో జమిలి దిశగా కేంద్రం వేగం పెంచింది. వచ్చే శీతాకాల సమావేశాలలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఆ బిల్లుల ఆమోదంతో పాటే జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణలు కూడా చేసేయాలని భావిస్తోంది. కమిటీ ఓ నివేదికను సమర్పించింది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశా ల్లో జమిలికి సంబంధించిన బిల్లులను ఆమోదించేలా కేంద్రం కార్యారణ రెడీ చేస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ సహా మరికొన్ని విపక్ష పార్టీలు జమిలిని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజస్వామ్యానికి జమిలి గొడ్డలిపెట్టు అని వాదిస్తున్నాయి. జమిలిని గట్టిగా వ్యతిరేకిస్తామని కుండబద్దలు కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జమిలితో మోడీ సర్కార్ ఎలా ముందుకు సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/redistribution-of-consttuencies-in-2026-25-187452.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.