Publish Date:Oct 26, 2024
దేశంలో జమిలి ఎన్నికల అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలన్నీ ఇప్పటి నుంచే జమిలికి రెడీ అయిపోయాయి. ఆ దిశగా తమతమ పార్టీల క్యాడర్ ను ప్రిపేర్ చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలను ముందుకు జరిపి మరీ జమిలి నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి ఇటీవల విస్పష్టంగా చెప్పేశారు. ఆ విషయంలో శషబిషలకు తావులేదని తేల్చేశారు. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు 2029లో జరగాలి. అయితే అంత కంటే రెండేళ్లు ముందుగానే అంటే 2027 జమిలికి కేంద్రం ముహూర్తం పెట్టేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జమిలికి ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న కృత నిశ్చయంతో కేంద్రం ఉండటంతో 2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృ త్వంలో ఏర్పాటైన కమిటీ ఇప్పటికే తేన నివేదికను సమర్పించింది. దీంతో జమిలి దిశగా కేంద్రం వేగం పెంచింది. వచ్చే శీతాకాల సమావేశాలలోనే జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లులను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఆ బిల్లుల ఆమోదంతో పాటే జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణలు కూడా చేసేయాలని భావిస్తోంది. కమిటీ ఓ నివేదికను సమర్పించింది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశా ల్లో జమిలికి సంబంధించిన బిల్లులను ఆమోదించేలా కేంద్రం కార్యారణ రెడీ చేస్తోంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ సహా మరికొన్ని విపక్ష పార్టీలు జమిలిని గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజస్వామ్యానికి జమిలి గొడ్డలిపెట్టు అని వాదిస్తున్నాయి. జమిలిని గట్టిగా వ్యతిరేకిస్తామని కుండబద్దలు కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జమిలితో మోడీ సర్కార్ ఎలా ముందుకు సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/redistribution-of-consttuencies-in-2026-39-187451.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.