Publish Date:Sep 28, 2022
ఇప్పుడంతా ఆన్లైన్ వ్యాపారమే. తినే పదార్ధాలు, వ్యాపార వస్తువులు, లాప్టాప్లు, కంప్యూటర్లు కూడా ఫ్లిప్ కార్ట్ వంటివాటిలో బుక్ చేసి తెప్పించుకుంటున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్లి గంటల తర బడి వెతకడం, కావలసిన వస్తువుని వెతికి తెచ్చుకోవడం అనేది సమయంతో కూడిన పని. చాలామంది ఆ సమయం వెచ్చించలేకనే ఆన్లైన్లో కొనుగోలుకే ఇష్టపడుతున్నారు. ఫ్లిప్ కార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకో వడం, కావలసినవి ఆర్డర్ చేసుకుంటే పెద్దగా శ్రమపడకుండానే ఇంటికే అన్ని చేరడం ఈ రోజు ల్లో పరిపాటి అయింది. అయితే ఈ రద్దీ ఎక్కువయింది. కనుక ఎవరు ఏమి తెప్పించుకుంటున్నారన్న ది కాస్తంత గమనించుకోవాలి. డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లిన చాలాసేపటికి చూసుకుంటే మీరు ఆర్డర్ చేసినది కాకుం డా మరోటి ఉండావచ్చు! అవును అదే జరిగింది యశస్వీ శర్మకి.
అహ్మదాబాద్ ఐఐ ఎం విద్యార్ధి యశస్వీ శర్మ. తన తండ్రికి లాప్ టాప్ కొనాలనుకున్నాడు. ఈమధ్య బిగ్ బిలియన్ డేస్ సేల్ అని ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్లు ప్రకటించింది. సరే తక్కువలో వస్తుందని యశస్వీ లాప్ టాప్ బుక్ చేశాడు.
అదే రోజు యశస్వీ తండ్రి ఆ ప్యాక్ను అందుకున్నట్టు యశస్వీకి ఫ్లిప్ కార్ట్ మెసేజ్ వచ్చింది. ఓకే అనుకున్నాడు ఈ కుర్రాడు. తీరా పాకెట్ విప్పి చూస్తే ఇంటిల్లపాదీ ఆశ్చర్యపోయారు. లాప్ టాప్కి బదులు అం దులో బట్టలు ఉతికే సబ్బులు ఉన్నాయి! ఇదేందిరా నాయనా! అనుకున్నారు. ఫ్లిప్ కార్ట్ కి బుక్ చేస్తే ఎన్నడూ ఇలా జరగలేదే అనుకున్నారు. పైగా ఏదయినా వస్తువు తెచ్చినా డెలివరీ బాయ్ దాన్ని ఆ అడ్రస్లో ఉన్నవారి చేత తీయించి చూసి ఓకే అనుకునే వెళుతూంటారు. కానీ ఈసారి మాత్రం ఇలా జరిగిం దనుకున్నారు యశస్వీ కుటుంబంలో అంతా.
బహుశా, డెలివరీ బాయ్ పని ఒత్తిడిలోనో, త్వరగా పని ముగించుకోవాలనుకునో హడావుడిలో ఒకరిది మరొకరికి ఇచ్చాడేమో అనీ అనుకున్నారు. కానీ అలా జరగడానికి వీలేలేదు. ఎందుకంటే యశస్వీ తండ్రి అందుకున్న ప్యాకెట్ మీద అడ్రస్ వాళ్లదే ఉంది! మరి ఇదెలా జరిగింది. మూడు నాలుగు రోజుల తర్వాత దీన్ని గురించి ఫిర్యాదు చేశారు. జరిగిన నష్టానికి డబ్బు చెల్లించడానికి ఫ్లిప్కార్ట్ ఓకే అనేసింది. కానీ చిత్రమేమంటే, ఈ సబ్బులు బుక్ చేసినవారు ఇంకెంత కంగారుపడుతూంటారో. వారికి లాప్ టాప్ వెళ్లి ఉంటే, అక్కడ దాని అవసరంలేని బామ్మలు ఉంటే పరిస్థితి ఏమిటి?!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/received-detergent-soaps--for-laptop-39-144529.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.