పాత కాపుల‌తో విజ‌య‌మ్మ‌ కొత్త వ్యూహ‌మా? జ‌గ‌న్ కోస‌మా? ష‌ర్మిల కోస‌మా?

Publish Date:Aug 29, 2021

Advertisement

జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశారు. విజ‌య‌మ్మ ఫోన్ చేసి పిలుస్తున్నారు. జ‌గ‌న్ కాద‌నుకున్నారు. విజ‌య‌మ్మ కావాల‌నుకుంటున్నారు. వారంతా వైఎస్సార్ హ‌యాంలో హేమాహేమీలు. సెప్టెంబ‌ర్ 2న పావురాల గుట్ట‌లో ఆయ‌న మ‌ర‌ణంతో చాలామంది కీల‌క నేత‌లు తెర‌మ‌రుగు అయిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్నా.. లేన‌ట్టుగానే మిగిలిపోయారు. పార్టీకే క‌ట్టుబ‌డి ఉన్నారు. ప‌ద‌వుల‌కు క‌క్కుర్తిప‌డి జ‌గ‌న్ పంచ‌న చేర‌లేదు. అలాంటి వారంద‌రినీ 12 ఏళ్ల త‌ర్వాత విజ‌య‌మ్మ గుర్తుకుపెట్టుకొని మ‌రీ ఫోన్లు చేసి స్పెష‌ల్‌గా ఇన్వైట్ చేయ‌డాన్ని ఎలా చూడాలి? ఇన్నేళ్లూ లేనిది ఇప్పుడే విజ‌య‌మ్మకు వారు ఎందుకు గుర్తుకు వ‌స్తున్న‌ట్టు? దీని వెనుక ఏదైనా మ‌ర్మం ఉందా? మ‌రేదైనా రాజ‌కీయ వ్యూహం దాగుందా? అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.  

ఏపీలో కేవీపీ, ఉండ‌వ‌ల్లిలాంటి వాళ్లు ఒక‌ప్పుడు వైఎస్‌కు లెఫ్ట్‌, రైట్ అన్నట్టు ఉండేవారు. కేవీపీ మైండ్‌ను వైఎస్సార్ విచ్చ‌ల‌విడిగా వాడుకుంటే.. ఉండ‌వ‌ల్లి నోరును రామోజీరావుపై ఆయుధంగా ప్ర‌యోగించారు. ఇక తెలంగాణ‌లో డీఎస్‌, కోమ‌టిరెడ్డి, పొన్నం లాంటి వాళ్లు రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి న‌మ్మినబంట్ల‌లా ఉండేవారు. వైఎస్సార్ మ‌ర‌ణించాక వారంతా జ‌గ‌న్ వెంట పోలోమ‌ని పార్టీ ఫిరాయించ‌లేదు. వైఎస్సార్ బ‌లోపేతం చేసిన కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. వైఎస్సార్ ఆత్మ‌లాంటి కేవీపీపై జ‌గ‌న్ చేసిన రాజ‌కీయ కుట్ర‌లు అన్నీఇన్నీ కావు. కాంగ్రెస్‌ను వీడిన తొలినాళ్ల‌లోనే కొండా సురేఖ‌తో కేవీపీ మీద అవినీతి విమ‌ర్శ‌లు చేయించిన చ‌రిత్ర జ‌గ‌న్‌ది. తండ్రికి అత్యంత ఆత్మీయుడైన కేవీపీని తొక్కేయాల‌ని చూసిన ప్ర‌బుద్ధుడు జ‌గ‌న్‌. ఉండ‌వ‌ల్లిని సైతం డోంట్‌కేర్ అన్నారు. అందుకే, వారిద్ద‌రు జ‌గ‌న్ ఇగోకు త‌ట్టుకోలేక.. కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు. ఇక జ‌గ‌న్ ఏపీకే ప‌రిమిత‌మ‌య్యారు కాబ‌ట్టి తెలంగాణ కాంగ్రెస్ వాదుల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని చెప్పొచ్చు. జ‌గ‌న్ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. స‌డెన్‌గా విజ‌య‌మ్మ‌కు వాళ్లంతా ఎందుకు గుర్తొచ్చార‌నేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 

మామూలుగా నైతే ఏడాదికో, ప‌దేళ్ల‌కో, 20, 25, 50, 75, 100 ఇలా కొన్ని మైలురాయి సంవ‌త్స‌రాల‌ను ప్ర‌త్యేకంగా జ‌రుపుతుంటారు. కానీ, వైఎస్సార్ చ‌నిపోయి 12 ఏళ్లు అవుతోంది. ఇదేమంత ప్ర‌త్యేక స‌మ‌య‌మూ కాదు. కానీ, ఎందుక‌నో కానీ విజ‌య‌మ్మ వైఎస్సార్ వ‌ర్థంతిని ఈసారి ప్ర‌త్యేకంగా జ‌ర‌పాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా అప్ప‌టి వైఎస్సార్‌కు అత్యంత స‌న్నిహితులు, కేబినెట్ స‌హ‌చ‌రుల‌ను ఫోన్ చేసి మ‌రీ ఆహ్వానిస్తున్నార‌ని స‌మాచారం. కేవీపీ, ఉండ‌వ‌ల్లి నుంచి డీఎస్ వ‌ర‌కు.. ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్సార్ మ‌నుషుల‌ను ఇన్వైట్ చేయ‌డంపై రాజ‌కీయంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.  

వారంతా వ‌స్తారా? రారా? అనేది ప‌క్క‌న పెడితే.. పిలిచారా.. లేదా.. అనేదే ఇక్క‌డ కీల‌కాంశం. ఇదంతా ఎందుకు? విజ‌య‌మ్మ మునుపెన్న‌డూ లేనిది ఈసారి ఇంత హంగామా ఎందుకు చేస్తున్న‌ట్టు? జ‌గ‌న్ కోస‌మా? ష‌ర్మిల కోస‌మా? అంటే ఇద్ద‌రి కోస‌మూ అనే వారూ ఉన్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌మ్మ జ‌గ‌న్‌కు దూరంగా ష‌ర్మిల చెంత ఉంటున్నా.. ఎంత‌కాద‌న్నా వారంతా ఒకే కుటుంబం.. వారంతా ఒక్క‌టే.. పైపైకి అలా చేస్తున్నార‌నే అనుమాన‌మూ ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్ ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగాలేదు. ప్ర‌జావ్య‌తిరేక‌త‌, సీబీఐ కేసు, బెయిల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశం, జ‌గ‌న్ జైలుకెళితే పార్టీని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని కాచుకు కూర్చున్న కీల‌క నేత‌ల ద్వ‌యం.. ఇలా జ‌గ‌న్ అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నార‌నేది విజ‌య‌మ్మ భావ‌న‌. ఇప్పుడున్న వైఎస్సార్‌సీపీలో ఎవ‌రినీ గుడ్డిగా న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఎవ‌రూ అంత‌టి స‌మ‌ర్థులూ కారు. అందుకే, త‌న భ‌ర్త వైఎస్సార్ న‌మ్మిన కేవీపీ, ఉండ‌వ‌ల్లి లాంటి వారినే ఇప్పుడు విజ‌య‌మ్మ సైతం న‌మ్ముతున్నారు. వైఎస్సార్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి.. ఆనాటి న‌మ్మ‌ద‌గిన నేత‌ల‌ను ఆహ్వానించి.. వారితో కీల‌క మంత‌నాలు జ‌ర‌పాల‌నేది విజ‌య‌మ్మ ఆలోచ‌న‌లా క‌నిపిస్తోంది. జ‌గ‌న్‌ను సుర‌క్షితం చేసేందుకు వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ఉంది. జ‌గ‌న్‌కు సంబంధం లేకుండా.. కొడుకు కోసం విజ‌య‌మ్మ చేస్తున్న సొంత ప్ర‌య‌త్నం అంటున్నారు. మ‌రి, అందుకు ఆనాటి నేత‌లు ఈనాడు ఆమెకు ఏమేర‌కు స‌హ‌క‌రిస్తారో చూడాలి..

ఇక‌, తెలంగాణ‌లోని వైఎస్సార్ ప్ర‌ధాన స‌హ‌చ‌రుల‌ను ఆహ్వానించ‌డం వెనుకున్న రీజ‌న్‌ను ఈజీగానే గెస్ చేయొచ్చు అంటున్నారు. ఇంకెందుకు ష‌ర్మిల కోస‌మే. వైఎస్సార్ పేరు మీదుగా పార్టీ పెట్టినా.. పాపం ష‌ర్మిల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక్క కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆల్ ది బెస్ట్ చెప్ప‌డం మిన‌హా పాత కాపులెవ‌రూ ఆమెకు కొత్త‌గా స‌పోర్ట్ చేయ‌డం లేదు. అందుకే, వైఎస్సార్ వ‌ర్థంతి పేరుతో.. పాత వైఎస్ సెంటిమెంట్‌ను కొత్త‌గా రాజేసేందుకు విజ‌య‌మ్మ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. అందుకే, ఆనాటి వైఎస్సార్ కేబినేట్ స‌హ‌చ‌రులంద‌రినీ సెప్టెంబ‌ర్ 2న ప్ర‌త్యేకంగా ఆహ్వానిస్తున్నార‌ట విజ‌య‌మ్మ‌. పాపం.. కూతురు కోసం విజ‌య‌మ్మ ఇంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. అది ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి...
 

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన నటుడు దళపతి విజయ్… ప్రత్యేకతను చాటుతున్నారు. తమిళ సంప్రదాయానికి భిన్నంగా పంచెకట్టును పక్కనపెట్టేసిన విజయ్, సూట్ వేసుకుని మరీ ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అది పక్కన పెడితే.. రాజకీయాలలో విలువలకు పెద్ద పీట వేస్తాననడానికి సంకేతంగా సీఎం హోదాలో విజయ్ తాజా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి మరీ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
అభిషేక్ బెనర్జీ గత దశాబ్దంగా అత్యున్నత స్థాయి భద్రతా వలయంలో ఉంటూ వచ్చారు. అయితే సోమవారం సాయంత్రం జారీ చేసిన పరిపాలనా ఉత్తర్వుల ప్రకారం, ఆయనకు కేటాయించిన అదనపు సెక్యూరిటీ సిబ్బందిని, ప్రత్యేక పైలట్ వాహనాలను ఉపసంహరించారు. ఇకపై ఆయనకు ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడికి ఉండే భద్రత మాత్రమే ఉంటుంది.
మాములుగా మోడీ లోకేష్ తో క్లోజ్ గా ఉండే ఫోటోల‌కే లెక్క‌లేన‌న్ని కామెంట్లు వ‌స్తుంటాయి. అలాంటిది లోకేష్ త‌న‌యుడికి కూడా మోడీ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ముచ్చటించడం ప్రాథాన్యత సంతరించుకుంది. చంద్రబాబు, లోకేష్ తో పాటు నారా వారి ఇంట మూడో తరం పిల్లవాడు దేవాన్ష్ కు కూడా ప్రధాని మోడీ ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణాలేంటంటూ.. నెటిజనులు పలు విధాలుగా స్పందిస్తున్నారు.
డీఎంకే శాసన సభాపక్ష ఉపనేతగా పార్టీ సీనియర్ నాయకుడు కేఎన్ నెహ్రూ, పార్టీ విప్‌గా ఈవీ వేలు నియమితులయ్యారు. అంతకు ముందు డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కూటమిని వీడిన కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఈ సమావేశం తీర్మానం చేసింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. ఇందు కోసం చంద్రబాబు సోమవారం (మే 11) ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆయన అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
ప్రధాని మోడీ తమ నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయనతో కుటుంబం దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా.. దానికి ఒక భావోద్వేగ వ్యాఖ్యను జోడించారు. మా ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేశానని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం తనతో చేతులు కలపితే.. పూర్తి స్థాయిలో సాయం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రధాని రేవంత్ కు ఇచ్చిన ఆఫర్ సంచలనం రేపింది. రేవంత్ ను బీజేపీలో చేరమని ప్రధాని కోరుతున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు.
త‌న ప్ర‌భుత్వ అప్పుల‌పై విజ‌య్ విమ‌ర్శ‌లు గుప్పించి, హామీల అమ‌లు నుంచి త‌ప్పించుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ మేర‌కు విజ‌య్ ఆరోప‌ణ‌ల‌పై స్టాలిన్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టించొద్ద‌ని హిత‌వు చెబుతూనే.. ఉచిత విద్యుత్‌, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణా అడ్డుకునేందుకు మొద‌టి సంత‌కం చేసిన విజ‌య్‌ని స్టాలిన్ అభినందించారు.
విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.