కేటీఆర్ లేఖాస్త్రాల లక్ష్యం అదేనా?

Publish Date:Jan 24, 2022

Advertisement

ఆ మధ్యన హుజూరాబాద్ పరాభవం తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం మీద కత్తులు దాశారు. మాటల తూటాలు పేల్చారు. ఇక యుద్దమే అన్నారు. వరన్నారు.. .. ఇదన్నారు ..అదన్నారు .. చివరకు అదేదో సినిమాలో .. ఇంతన్నాడు, అంతన్నాడు .. అన్న పాటలోలాగా  చివరకు తుస్సుమన్నారు. ఢిల్లీ వెళ్లి వట్టి చేతులతో వచ్చారు. అలాగే, కత్తులు కటారులతో పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళిన తెరాస ఎంపీలు కూడ మధ్యలోనే పలాయనం చిత్త గించారు. ఫ్లైట్ ఎక్కారు. అలాగే, ఆ ఎపిసోడ్’లో ఢిల్లీ వెళ్ళి మంత్రుల బృందం ... అటో ఇటో తేల్చుకుంటాం అంతవరకు ఢిల్లీలోనే కూర్చుంటామని మీడియా ముందు ప్రకటించిన గంటల్లోనే  ‘... చెప్పా పెట్టకుండా ఫ్లైట్’ ఎక్కి వచ్చేసింది. చివరకు, హుజూరాబాద్ పరాభవం లానే కేసీఆర్ సారధ్యంలో సాగిన  ‘వరి వార్’  కూడా ఒక ప్రహసనంగానే ముగిసింది. విమాన ఖర్చుల మందం ప్రయోజనం కూడా జరగలేదని పార్టీ ముఖ్యులే ఎగసెక్కాలాడుతున్నారు. 

అలాగే, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ, 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో భాగంగా బీజీపే రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంలోనూ  తెరాస ప్రభుత్వానికి శృంగభంగం తప్పలేదు. కోర్టు జోక్యంతో సంజయ్ రిలీజ్ అయ్యారు. మరో వంక బీజేపీ జాతీయ నాయకులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరసగా క్యూకట్టి రాష్ట్రానికి వచ్చి తెరాస ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ నెత్తిన అభాండాల బండలు వేసి వెళ్ళారు. బీజేపీ క్యాడర్’లో జోష్ పెరిగింది. మరో వంక ముఖ్యమంత్రి కేసేఆర్’ అరెస్ట్ తధ్యమనే సమాచారం మంత్రులు, తెరాస రాష్ట్ర నాయకులకు ఎక్కడినుంచి వచ్చిందో ఏమో కానీ, మంత్రులు కేసీఆర్’ని అరెస్ట్ చేస్తే భూమి బద్దలై పోతుందనే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో నిజనిజాలు ఎలా ఉన్నా మంట లేనిదే పొగ రాదని, ఏదో జరుగుతోందనే అనుమానాలకు అమాత్యులే ఆస్కారం కల్పిస్తున్నారు. ఇలా వరస పరభావలు ఎదురవుతున్నా,  దెబ్బ మీద దెబ్బ తగిలినా, తెరాస చిన్న బాసు, మంత్రి కేసీఆర్, ఢిల్లీఫై  మరో యుద్ధానికి సన్నద్ద అమ్వుతున్నారు. కేంద్రంపై  సంధించేందుకు కొత్త అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిని పార్లమెంట్‌లో 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఇదే అదనుగా మంత్రి కేటీఆర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వరుసగా లేఖలు రాస్తున్నారు. కోర్కెల చిట్టాను చేరస్తున్నారు. వివిధ పథకాల పరిధిలో రాష్ట్రానికి దండిగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. అదే సమయంలో ఇంతవరకు గడచిన ఏడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని పాత పాటనే వినిపిస్తున్నారు. అయితే, ఏడేళ్ళుగా రాష్ట్రంలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ‘బిల్డప్’ ఇచ్చి చివరకు కేంద్ర కొనకపోతే రాష్ట్ర కిలో కూడా కొనలేదని చేతులేత్తేయడంతో తెరాస ప్రభుత్వ బండారం బయట పడిపోయింది అనుకోండి. అది వేరే విషయం. 

అదలా ఉంటే, మంత్రి కేటీఆర్  కేంద్ర మంత్రికి రాసిన లేఖల్లో...నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ హైదరాబాద్‌ ఫార్మా సిటీ, ఎక్సెట్రాలకు   రూ.5 వేల కోట్లు, అలాగే వివిధ పారిశ్రామిక కారిడార్లకు మౌలిక సదుపాయాలకు ఇంకొన్ని వేల కోట్లు నిధులు..వాటికీ ఇన్నివేల కోట్లు.. వీటికి  ఇన్ని వేల   కోట్లు  కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్’ కు వరస పెట్టి లేఖలు రాస్తున్నారు. అ రాసిన ప్రతి లేఖను మీడియా ముందు ఉంచుతున్నారు.  

నిజమే, రాష్ట్రం కేద్రాన్ని నిధులు కోరడం తప్పు కాదు. అయితే, ఏ ఉద్దేశంతో కోరుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి, కేంద్ర నిధులు కోరుతున్నారా, లేక మేము అడిగిన కేంద్రం ఇవ్వలేదు అనే అభాండం వేసి రాజకీయ లబ్ది పొందేందుకు లేఖాస్త్రాలు సందిస్తున్నారా, అంటే  రెండవదే నిజం అనిపిస్తుంది. నిజానికి, కేంద్రం నిధులు తెచ్చుకోవాలనుకునే వారు అనుసరించే పద్దతులు వేరుగా ఉంటాయి. అంతే కానీ , ఇలా మీడియాకు ఎక్కి విమర్శలు చేయరని అంటున్నారు. ఇలా మీడియా ఎక్స్పోజర్ ముఖ్యమని అనుకుంటున్నారు అంటేనే, అందులోని రాజకీయం అర్థమవుతుందని అనుభవజ్ఞులు విశ్లేషిస్తున్నారు.

మరో వంక  రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లు సహా చాలా వరకు సంక్షేమ పథకాలకు కేంద్రం నిందులు ఇస్తోంది, అలాగే,కేంద్రం ఇతరత్రా నిధులు ఇస్తోందని,   కానీ, రాష్ట్ర ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు విషయంలో లాగానే, నిజాన్ని దాచేసి, క్రెడిట్ మొత్తాన్నితమ ఖాతాలో వేసుకు కుంటోందే ,  కానీ, కేద్రానికి  పైసా క్రెడిట్ ఇవ్వడం లేదని బీజేపే నాయకులు అంటున్నారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా ఖర్చు పెట్టేది ప్రజల సొమ్మునే, వారి సొంత సొమ్ములు కాదు. అయితే, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు తమ కష్టార్జితాన్ని ధారపోస్తున్నట్లు చెప్పుకుంటారు. ఈ విద్యలో తెరాస నాయకులకు ఒక ఆకు  ఎక్కువే చదివారు అనిపిస్తుంది.అందుకే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కేసీఆర్,కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉంటారు. అదే వారి అంతిమ లక్ష్యం. చివరకు ఈ ఆటలో.. ఎవరు .. గెలుస్తారో  ఏమో..

By
en-us Political News

  
మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు పారిపోయిన సంగతి తెలిసిందే.
నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్యాంకులో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బుద్ధవనం వద్ద జరిగిన 2568వ బుద్ధ జయంతి వేడుకల్లో ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న టిబెటన్ బౌద్ధ భిక్షువులు (విజయపురి సౌత్) అనుపు వద్దగల బౌద్ధ కట్టడాలను సందర్శించారని బుద్ధవనం కన్సల్టెంట్ మరియు ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-12
చత్తీస్ గడ్ లోని  నారాయణ పూర్  భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది.
ఇవాళా రేపు పెళ్ళి వేదికల మీద పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ముద్దు పెట్టుకోవడం మామూలు విషయమే.. పాపం పెళ్ళికొడుకు కూడా అదే పని చేశాడు. దాంతో పెళ్ళికూతురు తరఫు వాళ్ళ చేతిలో చావుదెబ్బలు తిన్నాడు.
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల పోలింగ్‌ స్టేషన్‌లో ఈవీఎం యంత్రాలను  ధ్వంసం చేసిన కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , అతడి సోదరుడి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఫలితాలలో మొదటగా వచ్చే ఫలితం నగరిదే.. అంటే, వైసీపీకి ఓటమి బోణీ కొట్టేది రోజా నియోజకవర్గమేనన్నమాట.. పాపం వైసీపీ, అయ్యో పాపం రోజా
ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమ బుద్దుడు గొప్ప దార్శనికుడని , ఆయన చూపిన అష్టాంగ మార్గం ఆచరణీయమని తెలంగాణ పర్యాటకాభివృద్ది సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. రమేష్ నాయుడు అన్నారు.
ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది.
దేవుడా... కొడాలి నాని బతకాలి.. ఆయన మళ్ళీ మామూలు మనిషిలా అందరిలో తిరగాలి.. అని పార్టీ నాయకులు, కార్యకర్తలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు.
పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి ఈవీఎం ను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని అనేక రకాల హింసాయుత పద్ధతులను ఆచరించి ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వారికి ఈ దేశంలో కొదవలేదు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. స్వయంగా అభ్యర్థే పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి, అందరినీ బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.