కేటీఆర్ లేఖాస్త్రాల లక్ష్యం అదేనా?

Publish Date:Jan 24, 2022

Advertisement

ఆ మధ్యన హుజూరాబాద్ పరాభవం తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర ప్రభుత్వం మీద కత్తులు దాశారు. మాటల తూటాలు పేల్చారు. ఇక యుద్దమే అన్నారు. వరన్నారు.. .. ఇదన్నారు ..అదన్నారు .. చివరకు అదేదో సినిమాలో .. ఇంతన్నాడు, అంతన్నాడు .. అన్న పాటలోలాగా  చివరకు తుస్సుమన్నారు. ఢిల్లీ వెళ్లి వట్టి చేతులతో వచ్చారు. అలాగే, కత్తులు కటారులతో పార్లమెంట్ సమావేశాలకు వెళ్ళిన తెరాస ఎంపీలు కూడ మధ్యలోనే పలాయనం చిత్త గించారు. ఫ్లైట్ ఎక్కారు. అలాగే, ఆ ఎపిసోడ్’లో ఢిల్లీ వెళ్ళి మంత్రుల బృందం ... అటో ఇటో తేల్చుకుంటాం అంతవరకు ఢిల్లీలోనే కూర్చుంటామని మీడియా ముందు ప్రకటించిన గంటల్లోనే  ‘... చెప్పా పెట్టకుండా ఫ్లైట్’ ఎక్కి వచ్చేసింది. చివరకు, హుజూరాబాద్ పరాభవం లానే కేసీఆర్ సారధ్యంలో సాగిన  ‘వరి వార్’  కూడా ఒక ప్రహసనంగానే ముగిసింది. విమాన ఖర్చుల మందం ప్రయోజనం కూడా జరగలేదని పార్టీ ముఖ్యులే ఎగసెక్కాలాడుతున్నారు. 

అలాగే, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ, 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో భాగంగా బీజీపే రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంలోనూ  తెరాస ప్రభుత్వానికి శృంగభంగం తప్పలేదు. కోర్టు జోక్యంతో సంజయ్ రిలీజ్ అయ్యారు. మరో వంక బీజేపీ జాతీయ నాయకులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరసగా క్యూకట్టి రాష్ట్రానికి వచ్చి తెరాస ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి కేసీఆర్ నెత్తిన అభాండాల బండలు వేసి వెళ్ళారు. బీజేపీ క్యాడర్’లో జోష్ పెరిగింది. మరో వంక ముఖ్యమంత్రి కేసేఆర్’ అరెస్ట్ తధ్యమనే సమాచారం మంత్రులు, తెరాస రాష్ట్ర నాయకులకు ఎక్కడినుంచి వచ్చిందో ఏమో కానీ, మంత్రులు కేసీఆర్’ని అరెస్ట్ చేస్తే భూమి బద్దలై పోతుందనే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. ఇందులో నిజనిజాలు ఎలా ఉన్నా మంట లేనిదే పొగ రాదని, ఏదో జరుగుతోందనే అనుమానాలకు అమాత్యులే ఆస్కారం కల్పిస్తున్నారు. ఇలా వరస పరభావలు ఎదురవుతున్నా,  దెబ్బ మీద దెబ్బ తగిలినా, తెరాస చిన్న బాసు, మంత్రి కేసీఆర్, ఢిల్లీఫై  మరో యుద్ధానికి సన్నద్ద అమ్వుతున్నారు. కేంద్రంపై  సంధించేందుకు కొత్త అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నారు. 

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిని పార్లమెంట్‌లో 2022-23 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఇదే అదనుగా మంత్రి కేటీఆర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వరుసగా లేఖలు రాస్తున్నారు. కోర్కెల చిట్టాను చేరస్తున్నారు. వివిధ పథకాల పరిధిలో రాష్ట్రానికి దండిగా నిధులు కేటాయించాలని కోరుతున్నారు. అదే సమయంలో ఇంతవరకు గడచిన ఏడేళ్ళలో కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని పాత పాటనే వినిపిస్తున్నారు. అయితే, ఏడేళ్ళుగా రాష్ట్రంలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని ‘బిల్డప్’ ఇచ్చి చివరకు కేంద్ర కొనకపోతే రాష్ట్ర కిలో కూడా కొనలేదని చేతులేత్తేయడంతో తెరాస ప్రభుత్వ బండారం బయట పడిపోయింది అనుకోండి. అది వేరే విషయం. 

అదలా ఉంటే, మంత్రి కేటీఆర్  కేంద్ర మంత్రికి రాసిన లేఖల్లో...నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ హైదరాబాద్‌ ఫార్మా సిటీ, ఎక్సెట్రాలకు   రూ.5 వేల కోట్లు, అలాగే వివిధ పారిశ్రామిక కారిడార్లకు మౌలిక సదుపాయాలకు ఇంకొన్ని వేల కోట్లు నిధులు..వాటికీ ఇన్నివేల కోట్లు.. వీటికి  ఇన్ని వేల   కోట్లు  కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్’ కు వరస పెట్టి లేఖలు రాస్తున్నారు. అ రాసిన ప్రతి లేఖను మీడియా ముందు ఉంచుతున్నారు.  

నిజమే, రాష్ట్రం కేద్రాన్ని నిధులు కోరడం తప్పు కాదు. అయితే, ఏ ఉద్దేశంతో కోరుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి, కేంద్ర నిధులు కోరుతున్నారా, లేక మేము అడిగిన కేంద్రం ఇవ్వలేదు అనే అభాండం వేసి రాజకీయ లబ్ది పొందేందుకు లేఖాస్త్రాలు సందిస్తున్నారా, అంటే  రెండవదే నిజం అనిపిస్తుంది. నిజానికి, కేంద్రం నిధులు తెచ్చుకోవాలనుకునే వారు అనుసరించే పద్దతులు వేరుగా ఉంటాయి. అంతే కానీ , ఇలా మీడియాకు ఎక్కి విమర్శలు చేయరని అంటున్నారు. ఇలా మీడియా ఎక్స్పోజర్ ముఖ్యమని అనుకుంటున్నారు అంటేనే, అందులోని రాజకీయం అర్థమవుతుందని అనుభవజ్ఞులు విశ్లేషిస్తున్నారు.

మరో వంక  రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కేసీఆర్ కిట్లు సహా చాలా వరకు సంక్షేమ పథకాలకు కేంద్రం నిందులు ఇస్తోంది, అలాగే,కేంద్రం ఇతరత్రా నిధులు ఇస్తోందని,   కానీ, రాష్ట్ర ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు విషయంలో లాగానే, నిజాన్ని దాచేసి, క్రెడిట్ మొత్తాన్నితమ ఖాతాలో వేసుకు కుంటోందే ,  కానీ, కేద్రానికి  పైసా క్రెడిట్ ఇవ్వడం లేదని బీజేపే నాయకులు అంటున్నారు. నిజానికి, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా ఖర్చు పెట్టేది ప్రజల సొమ్మునే, వారి సొంత సొమ్ములు కాదు. అయితే, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు తమ కష్టార్జితాన్ని ధారపోస్తున్నట్లు చెప్పుకుంటారు. ఈ విద్యలో తెరాస నాయకులకు ఒక ఆకు  ఎక్కువే చదివారు అనిపిస్తుంది.అందుకే ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కేసీఆర్,కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉంటారు. అదే వారి అంతిమ లక్ష్యం. చివరకు ఈ ఆటలో.. ఎవరు .. గెలుస్తారో  ఏమో..

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.