వైసీపీ బెంగళూరు భజన.. కారణమేంటంటే?

Publish Date:Sep 18, 2025

Advertisement

అధికారంలో ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయడం అన్నది తెలుగుదేశం తీరు అయితే.. వైసీపీ విధానం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. విద్వేష, విధ్వంస, కక్ష పూరిత విధానాలే తమ బలమని వైసీపీ గట్టిగా నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.  అందుకు ఇటీవలి కాలంలో వైసీపీయులు చేస్తున్న బెంగళూరు భజనను ఉదాహరణగా చూపుతున్నారు పరిశీలకులు. ఇంతకీ వైసీపీ బెంగళూరు భజన ఎందుకు, ఎలా మొదలైందంటే..  బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈవో కర్నాటక రాజధాని నగరంలో  మౌలిక సదుపాయాలు అత్యంత దారుణమని విమర్శిస్తూ.. ఇలాంటి నగరంలో తమ సంస్థను కొనసాగించడం ఇష్టం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ విమర్శ చేశారు.   బెంగళూరులో రవాణా కష్టాలు, మౌలిక సదుపాయాల కొరతకు తోడు..  రహదా రుల అధ్వాన పరిస్థితిపై ఆ పోస్టుతో జాతీయ స్థాయిలో చర్చకు తెరలేచింది.   బెళ్లందూరు ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్టు బెంగళూరులో రహదారుల అధ్వాన స్థితికి అద్దం పట్టింది.  

తమ కంపెనీ సిబ్బంది కార్యాలయానికి వచ్చి వెళ్లడానికి పట్టే కనీస ప్రయాణ సమయం గంటన్నరకు మించి ఉంటోందనీ, దీనికి తోడు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానమనీ ఆయనా పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదనీ, ఈ పరిస్థితి సమీప భవిష్యత్ లో మెరుగుపడుతుందన్న ఆశ లేదనీ ఆ పోస్టులో పేర్కొన్న సీఈవో ఈ పరిస్థితుల్లో తమ సంస్థను బెంగళూరులో కొనసాగించడం తనకు ఇసుమంతైనా ఇష్టం లేదని పేర్కొన్నారు. 

సరిగ్గా ఇక్కడే నారా లోకేష్ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ విషయంలో తనకున్న శ్రద్ధను, చిత్త శుద్ధినీ చాటుకున్నారు.  బ్లాక్‌బక్ అరే కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజి  బెంగళూరులో రవాణా కష్టాలు ప్రస్తావిస్తూ.. కంపెనీని అక్కడ నుంచి తరలించాలని భావిస్తున్నట్లు పోస్టు పెట్టిన గంటల వ్యవధిలో లండన్ పర్యటనలో ఉన్న లోకేష్ స్పందించారు. విశాఖపట్నంను హైలైట్ చేస్తూ.. బెంగళూరు నుంచి మీ సంస్థను తరలించాలని భావిస్తే.. విశాఖకు రావాలని కోరుతూ ఆయనను కోరారు.  విశాఖ లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అద్దాల్లాంటి రహదారులు ఉన్నాయనీ, శాంతి భద్రతల విషయంలో విశాఖ నంబర్ వన్ అని పేర్కొన్నారు. 
దీంతో వైసీపీయులు ఒక్కసారిగా బెంగళూరు భజన ప్రారంభించేశారు. బెంగళూరు నుంచి పరిశ్రమను తరలించాలని లోకేష్ కోరడం ఇరు  రాష్ట్రాల మధ్యా సత్సంబంధాలను దెబ్బతీయడమేనంటూ విమర్శలు గుప్పించడం ఆరంభించారు. అయినా ఒక రాష్ట్రంలోని కంపెనీని ఏపీకి తరలించాలంటూ ఎలా ఆహ్వానిస్తారంటూ మండిపడుతున్నారు. లోకేష్ చర్యలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే చర్యగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అయితే పరిశీలకులు మాత్రం మంత్రి నారాలోకేష్ స్పందన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రగతి పట్ల ఉన్న చిత్తశుద్ధికి, శ్రద్ధకు తార్కానంగా విశ్లేషిస్తున్నారు. బెంగళూరు నుంచి తమ కంపెనీని తరలించాలని భావిస్తున్నట్లు సదరు కంపెనీ సీఈవో  పేర్కొన్న తరువాతే లోకేష్.. ఏపీ బెస్ట్ చాయిస్ అంటూ ఆహ్వానించారనీ, అందులో తప్పేమిటనీ అంటున్నారు. అయితే ఏపీ అభివృద్ధి పట్ల ఇసుమంతైనా అక్కర లేని వైసీపీ మాత్రం బెంగళూరు నుంచి పరిశ్రమను లోకేష్ ఏపీకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్రాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ గుండెలు బాదేసుకోవడం వెనుక తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్ట,  లోకేష్ ప్రతిష్ఠ పెరుగుతాయన్న దుగ్ధ తప్ప మరో కారణం లేదంటున్నారు 

By
en-us Political News

  
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.