Publish Date:Oct 16, 2019
టీఆర్ఎస్ మున్సిపల్ కమిటీలను అధికారికంగా ప్రకటించకపోవడానికి ముందున్న మున్సిపల్ ఎన్నికలే అసలు కారణమని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. అనేక మంది పార్టీ పదవులను ఆశిస్తున్నారని ఇప్పుడు ఆ పదవులను ప్రకటిస్తే అసంతృప్తులు ఇతర పార్టీలో చేరే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఒకరికి పదవి ఇస్తే మరో తొమ్మిది మంది అసంతృప్తికి లోనయ్యే పరిస్థితి నెలకొందని అంతిమంగా అది మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని పార్టీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అందుకోసమే టీఆర్ఎస్ పెద్దలు పార్టీ మున్సిపల్ కమిటీలను ప్రకటించలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది.
మరి కొన్ని చోట్ల మెజారిటీ ఎమ్మెల్యేలు మున్సిపల్ కమిటీల కూర్పుని పూర్తి చేసి కూడా వాటిని ప్రకటించేందుకు జంకుతున్నారు. మునిసిపల్ వార్డులకు ఎవరెవరు బాధ్యులు అనేది నోటిమాటగా చెప్పడమే గానీ వారి పేర్లను మాత్రం అధికారికంగా ప్రకటించే సాహసం చేయడం లేదు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా విలువైందని పదవులు రాని వారు ఆగ్రహిస్తే మొదటికే మోసం వస్తుందని అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా మున్సిపల్ ఎన్నికల్లో ఆశావహులకు కౌన్సిలర్ టికెట్లు దక్కని వారికి పార్టీ పదవులు ఇచ్చేసి అందరినీ సర్దుబాటు చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ లెక్కన మున్సిపల్ ఎన్నికలయ్యేదాకా మెజారిటీ మునిసిపాలిటీల్లో టిఆర్ఎస్ కమిటీలను ప్రకటించే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి ఇబ్బడిముబ్బడిగా చేరిన నాయకులను సర్దుబాటు చేయటం గులాబీ పార్టీ నాయకత్వానికి పెద్ద పరీక్షగా మారినట్టు కనిపిస్తోంది. మరి మున్ముందు ఈ సమస్య ఎలాంటి మలుపులు తీసుకుంటుందో దానికి ఎలాంటి పరిష్కారం తీసుకురాబోతోందో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reason-behind-trs-not-announced-municipal-committees-25-90160.html
Publish Date:Dec 10, 2025
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
Publish Date:Dec 10, 2025
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండకు దగ్గర్లో ఒక దర్గా ఉంటే.. ఆ దర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై తమిళ కార్తీక దీపం పెట్టడం అనాదిగా వస్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.