టీటీడీలో త‌ర‌చూ వివాదాల‌కు కార‌ణం?

Publish Date:May 31, 2025

Advertisement

భార‌త‌మ్మ సైన్య‌మేనా?
వీరెంత మంది వ‌ర‌కూ ఉన్నారు?
టీటీడీలో రంగ ప్ర‌వేశం ఎప్పుడు జ‌రిగి ఉండొచ్చు? 

తిరుమ‌ల‌లో త‌ర‌చూ   వివాదాలు జ‌ర‌గ‌టానికి గ‌ల కార‌ణ‌మేంటి?  ఈ సంస్థ‌లో అన్నమ‌య్య మ‌త‌స్తులు కాకుండా అన్య‌మ‌త‌స్తులుండ‌ట‌మే అస‌లు కార‌ణ‌మా? ఇంత‌కీ వీరి వాద‌నేంటి?  త‌ర‌చూ మ‌ద్య మాంసాల వ్య‌వ‌హారం..  ఆ త‌ర్వాత ఇదిగో టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అనే నినాదాలు చేసేవ‌ర‌కూ ఎలా కొన‌సాగుతూ వ‌స్తోంది? తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల్లో ఇటీవ‌లి కాలంలో వ‌రుస వివాదాలు న‌డుస్తున్నాయ్. ఆల‌య ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా ఇవి ఉంటున్నాయ్. వీటి వెన‌క  రెండు వేల వ‌ర‌కూ ఉన్న‌ భార‌త‌మ్మ సైన్యం దాగి ఉందా? అన్న‌దొక డౌట్ ఫుల్ డిబేట్.  ఇంత‌కీ వీరెలా ఈ వ్య‌వ‌స్థ‌లో వేళ్లూనుకున్నారు? దీనంత‌టికీ కార‌ణం భూమ‌న వంటి  క్రిష్టియ‌న్లు చైర్మ‌న్ కావ‌డ‌మేనా? అన్న‌దొక అనుమానం కాగా..  తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడంటే కేవ‌లం భూమ‌న‌కే కాదు.. వైయ‌స్ కి కూడా ఏమంత గౌర‌వం లేదని అంటారు.  ఏడు కొండ‌లు ఎందుకు?  రెండు కొండ‌లు చాలు క‌దా అన్న సీఎం వైయస్. అలాంటి వైయ‌స్ కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు అనుకుంటే..  ఆయ‌న  కొడుకు జ‌గ‌న్ వ‌చ్చీ రావ‌డ‌మే గొడ‌వ గొడ‌వ‌.

హైంద‌వాల‌యాల్లో అన్య‌మ‌త‌స్తులు ఉండ‌కూడ‌ద‌ని ఆనాటి  సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం జీవో తేవాల‌ని భావిస్తే కొంద‌రు క్రిష్టియ‌న్ సంఘాల వారు అడ్డుకున్నారు. ఇరువురిలో ఎవ‌రికి ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని చూసిన జ‌గ‌న్   క్రిష్టియ‌న్ల వైపు మొగ్గారని అంటారు. దీంతో ఎల్వీని జీఏడీకి రిపోర్ట్ చేయ‌మ‌న్నారట‌. ఈ ఆగ్ర‌హంతో ఆయ‌న ఆనాటి ప్ర‌భుత్వం నుంచి ఎల్వీ వైదొలిగారని చెబుతారు. ఆ స‌మ‌యంలో కొన్ని క్రిష్టియ‌న్ సంఘాలు కేకులు క‌ట్ చేసిన  ఫోటోలు సైతం అప్పట్లో వెలుగులోకి వ‌చ్చాయని చెబుతారు. అంతేనా కావాల‌ని తిరుమ‌ల అట‌వీ సిబ్బందికి జీతాలు పెంచ‌క వారి ద్వారా వ‌న్య‌ప్రాణుల‌ను భ‌క్తులు న‌డిచే దారుల్లోకి ర‌ప్పించి.. ఏకంగా చిన్న పిల్ల‌ల ప్రాణాలు తీసే వ‌ర‌కూ తేవ‌డం కూడా అప్ప‌ట్లో పెను దుమారం న‌డిచింది. దీని వెన‌క కూడా ఏదైనా కుట్ర దాగి ఉందా? అన్న అనుమానాలున్నాయి. 

ఇక అప్ప‌ట్లో మంత్రిగా ఉన్న రోజ‌మ్మ అయితే ఏకంగా క్రీస్తు డాల‌ర్ క‌లిగిన కెమెరామెన్ తో స‌హా వ‌చ్చి చేసిన హ‌డావిడి హంగామా మాములుగా లేదని అంటారు.  అంతేనా కిరాక్ ఆర్పీ చెప్పేదాన్నిబ‌ట్టి చూస్తే 30 వేల‌కు పైగా ఆమె సిఫార్సు లెట‌ర్లు ఇచ్చార‌ని తెలుస్తోంది. దీని వెన‌క కూడా అతి పెద్ద స్కామ్ న‌డిచేద‌ని టాక్. ఇలాక్కూడా రొజ‌మ్మ వెన‌కేసిన‌ట్టుగానూ చెబుతారు.  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోని క్రిష్టియ‌న్ లాబీ ద్వారా భారీ ఎత్తున హిందూ దేవాల‌యాల్లోకి క్రిష్టియ‌న్లు ప్ర‌వేశించి.. అప్ప‌ట్లో ఆల‌య ప్ర‌తిష్ట మంట‌గ‌ల‌పాల‌ని చూసేవార‌ని అంటారు. ఆనాటి పాపాల కార‌ణంగానే జ‌గ‌న్ అధికారం కోల్పోయినట్టు అంచ‌నా క‌డ‌తారు..  అయినా స‌రే జ‌గ‌న్ అండ్ కోకి ఇంకా బుద్ధి రావ‌డం లేద‌ని అంటున్నారు. అప్ప‌ట్లో తాము ప్ర‌వేశ పెట్టిన ఈ బీ- సైన్యాన్ని అడ్డు పెట్టుకునే.. ఇప్పుడు వి త‌ర‌చూ వాదాల‌ు రాజుకునేలా చేస్తున్నారట‌. ఈ విష‌యం ఎక్క‌డ బ‌య‌ట ప‌డుతుందోన‌ని.. భార‌త‌మ్మ అదే ప‌నిగా త‌మ ఇంట్లోనే తిరుమ‌ల సెట్ వేయించార‌నీ చెబుతారు.   లేకుంటే ఎవ‌రో ఒక భ‌క్తుడు డౌన్ డౌన్ అంటూ అరిచాడే అనుకుందాం. అత‌డి ఆలోచ‌న ఏంటంటే త‌న‌కు త్వ‌ర‌గా దైవ ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌నే భావిద్దాం... బేసిగ్గా వెంక‌న్న‌లాంటి దేవ‌దేవుడి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన‌పుడు.. అంతా ఆయ‌న మీదే భార‌మేసి.. ఆయ‌న ఎప్పుడు క‌నిపిస్తే అప్పుడు త‌న మొక్కులు చెల్లించుకుని రావ‌ల్సి ఉంటుంది. 

గంట‌ల త‌ర‌బ‌డి క్యూలైన్ల‌లో ఉన్న‌పుడు అనాల్సింది టీటీడీ చైర్మ‌న్ డౌన్ డౌన్ అని కాదు. గోవిందా గోవిందా అని. అప్పుడే పాప ప్ర‌క్షాళ‌న జ‌రిగేది. కంపార్ట్ మెంట్ల‌లో ఉన్న‌పుడు మ‌న‌కున్న స‌మ‌స్త రేడియేష‌న్ రోగాలు పోతాయ్. కార‌ణం మొబైల్ ఫోన్లు ఎప్పుడైతే బ‌య‌ట ప‌డేస్తామో,  అప్పుడు వాటి తాలూకూ ప్ర‌కంప‌న‌లు, ప్ర‌భావాల నుంచి దూర‌మ‌వుతాం. అది మ‌న శారీర‌క మాన‌సిక స్థితిగతుల‌కు ఎంతో మేలు చేస్తుంది. కాకినాడ‌కు చెందిన అచ్చారావ్ అనే ఆ భ‌క్తుడు  చేసిందే ఒక త‌ప్ప‌యితే.. దాన్ని వీడియో తీసిన వాడికి ఎంత భ‌యం లేక పోవాలి? 

స‌రే ఇప్పుడున్న జ‌మానాలో సెల్ ఫోన్లు కామ‌నే కాద‌న‌డం లేదు. కానీ వెంక‌న్న లాంటి  మ‌హిమాన్విత దేవుడి విష‌యంలో న‌మ్మ‌కం వారిని ఇలాంటి త‌ప్పుడు ప్ర‌చారాలు చేయ‌కుండా ఆపేస్తుంది. అలా కూడా ఒకరు న‌మ్మ‌కాన్ని అతిక్ర‌మించి బ‌య‌ట‌కొచ్చేలా చేశారంటే దాన‌ర్ధ‌మేంటంటే వెంక‌న్న అంటే భ‌యం లేద‌ని. భక్తి లేదని. ఇలాంటి వారు అయితే పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్ కి చెందిన వారు, లేదంటే అన్య‌మ‌త‌స్తులే అయి ఉంటార‌ని అంచనా వేస్తున్నారు శ్రీవారి భ‌క్తులు. 

By
en-us Political News

  
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ‌చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థత గురైనట్లు తెలుస్తోంది.ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పటంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. స్వయంగా మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వివాదాస్పద వాక్యాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపుతున్నాయి.
డీఎంకే ఎంపీ ద‌యానిధి మార‌న్, భార‌తీయ కుబేరుల్లో ఒక‌డైన క‌ళానిధి మార‌న్ కి మ‌ధ్య ఆస్తి చిచ్చు మొద‌లైందా? అంటే అవున‌ని తెలుస్తోంది. 2003లో తండ్రి ముర‌సోలి మార‌న్ మ‌ర‌ణించారు. స‌రిగ్గా ఆ టైంలో బీజం వేసుకుందీ ఆస్తి త‌గాదా.
బీఆర్‌ఎస్ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వరంగల్‌కి తరలించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలను ఆయుష, ఆరోగ్యశాఖ ఆథ్వర్యంలో ఘనంగా నిర్వహించాయి.
విశాఖ ఆర్కే బీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని ప్రజలతో కలిసి యోగా చేశారు.
ప్ర‌పంచ దేశాలను ఏపీ చూడ‌డం కాదు.. ఏపీని ప్ర‌పంచ దేశాలు చూసేలా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు ప్రధాని నరేంద్రమోడీ.
కేసీఆర్ మెడకు ఫోన్ వైర్ మెల్లగా చుట్టుకుంటోంది. పోన్ ట్యాపింగ్ బాధితులలో మొత్తం 615 మందిలో.. రకరకాల రంగాల వారున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు, సినీ, వ్యాపార ప్రముఖులు, కొందరు పౌర హక్కుల నేతలు వంటి వారున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ప్రభాకరరావు. ఈయన తన నోరు మెదపక పోయినా.. ఇప్పటికే సిట్ పూర్తి ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
శనివారం జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన యోగ విద్యను ఈ రోజు ప్రపంచం మొత్తం సొంతం చేసుకుంది. 2014 లో మన దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదే సంవత్సరం డిసెంబర్ 14న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సభ, భారతీయ యోగ విద్యను గుర్తించి, ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవాన్ని నిర్వహించాలనే చారిత్రక నిర్ణయం తీసుకుంది.
ఎయిర్ ఇండియా విమానాలను ప్రమాదదాలు వెంటాడుతున్నాయా అనిపించేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఏ12479 ను ఓ పక్షి ఢీ కొంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా పూణెలో ల్యాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్ కలిగించింది. జగన్ హయాంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేస్తూ మొదలు పెట్టిన మూడు రాజధానుల విధానానికి వ్తయతికేకంగా చారిత్రాత్మక ఆందోళన చేసిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ బనాయించిన కేసులను ఉపసంహరించుకుంది.
హనుమ కొండ జిల్లా కోర్టు ఆవరణలో డిటొనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.