Publish Date:Sep 18, 2025
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ రెబల్ మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేరుగా సొంత పార్టీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆయన దాటని హద్దు లేదు. తొలుత తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి మాట తప్పారంటూ తన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకున్నా.. ఇటీవలి కాలంలో ఏకంగా పార్టీనే టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.
మంత్రిపదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.. తొలుత సీఎం రేవంత్ పై, ఇప్పుడు మొత్తంగా కాంగ్రెస్ పై తిరుగుబావుటా ఎగురవేశారు. తాజాగా తెలంగాణ లిబరేషన్ డే సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 17) ఆయన అమరవీరుల స్ఫూపం వద్ద నివాళి అర్పించారు. ఆ సందర్భంగా ఆయన తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో పరిస్థితిని నేపాల్ లో పరిస్థితితో పోల్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ పై ప్రజలు తిరుగుబాటు చేసి తరిమికొట్టే పరిస్థితి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
అయినా కాంగ్రెస్ నుంచి చిన్నపాటి స్పందన కూడా లేదు. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్టానుసారంగా పార్టీ పరువు మంటగలిసేలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నా.. కాంగ్రెస్ చర్య తీసుకునే విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందన్నది అంతుపట్టడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఏకంగా కాంగ్రెస్ సర్కార్ పై ప్రజా తిరుగుబాటు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై తనకు ఎటువంటి ఫిర్యాదూ రాలేదని టీపీసీసీ చీఫ్ అనడం పలు సందేహాలకు తావిస్తున్నది. అసలు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ సుమోటోగా తీసుకుని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న కాంగ్రెస్ వర్గాల నుంచే వినవస్తున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reason-behind-congress-soft-stance-on-komatireddy-rajagopalreddy-39-206380.html
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.