Publish Date:Jun 24, 2025
కాదేదీ కవితకనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు కాదేదీ పోలీసు కంప్లైంట్ కు అనర్హం అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. తాజాగా కుకట్ పల్లి పోలీసు స్టేషన్ లో అరుదైన కేసు నమోదైంది. అదేంటో తెలుసా.. కొన్న ప్యాకెట్ పాలు విరిగిపోయాయంటూ దుకాణదారుడిపై కేసు పెట్టాడో పెద్దమనిషి. పాపం పోలీసులు కూడా చేసేదేం లేక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..కుకట్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ సూపర్ మార్కెట్లో పాల ప్యాకెట్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వచ్చి కాచగానే పాలు విరిగిపోయాయి. దీంతో సదరు పాలను కొనుగోలు చేసిన వ్యక్తి రత్నదీప్ కు వెళ్లి సంగతి చెప్పాడు. దానికి దుకాణదారు దానిని మేమేం చేస్తాం అంటూ బదులిచ్చాడు.
దీంతో ఆ కొనుగోలుదారుడు తిన్నగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు. దుకాణదారుపై ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవలి కాలంలో ప్యాకెట్ పాలు కాచగానే విరిగిపోతున్నాయనీ, వాసన వస్తున్నాయనీ పలువురు చెబుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కస్టమర్లు అంటున్నారు. లేకుంటే పాలు విరిగిపోయాయి, వాసన వస్తున్నాయంటే పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rare-case-filed-in-ps-packet-39-200545.html
అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై) ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లాలో ఎనుగుల గుంపు భయాందోళనలు సృష్టిస్తోంది. జిల్లాలోని గ్రామాలపై దాడులు చేస్తూ పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి.
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును గిరిజనం వ్యతిరేకిస్తున్నారు. కొత్త డిజైన్ నమూనా ఆదివాసి సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో భక్తులు పోటెత్తుతున్నారు. వారంతం కావడంతో తిరమలేశుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.
డీఎంకే, బీజేపీలతో పొత్తులుండవ్. మా పార్టీ సీఎం కేండెట్ నేనేనంటూ విజయ్ ప్రకటన. ఇదయ దళపతి, టీవీకే అధినేత విజయ్.. ఎట్టకేలకు ఒక క్లారిటీ ఇచ్చారు. తమిళ స్పీకర్ అప్పావు వంటి వారు విజయ్ మరో రజనీ కాంత్ అవుతారని భావించారు.
గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ నూతన ఆధ్యక్షుడిగా, ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్. రామచంద్ర రావు, బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడితో ఇంచుమించుగా సంవత్సరం పైగా సాగుతున్న, కౌన్ బనేగా బీజేపీ అధక్ష్ కహానీలో ఒక అధ్యాయం ముగిసింది.
ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులతోపాటు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు.
అధికారులు అంటే లెక్కలేని తనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తుంది. అధికారుల పట్ల వారి దురుసు ప్రవర్తన వారి పెత్తందారి పోకడలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతల్లో పెత్తందారి పోకడలు పోలేదు అనడానికి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం.
సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో, ఉప ఎన్నిక అనివార్యమైన జూబ్లీహిల్స్, నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది.
భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి ఘన సంప్రదాయ స్వాగతం పలికింది.
జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జర్నలిస్ట్లకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్ధ సారధి, నారాయణలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది.
ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా, చాలావరకు రాష్ట్రాల్లో, పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసుకున్న బీజేపీ, పార్టీ జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది.