రామోజీని కేసీఆర్ ఎందుకు పొగిడారంటే...

Publish Date:Dec 15, 2014

Advertisement

 

అనవసరంగా ఎవర్నీ పొగడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నీమధ్య మీడియా మొఘల్, ఫిలింసిటీ రూపకర్త, ముఖ్యంగా ‘ఆంధ్రోడు’ అయిన రామోజీరావును భారీ స్థాయిలో పొగిడారు. తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా రామోజీ ఫిలింసిటీలో ఐదు గంటలపాటు గడిపి ఫిలింసిటీని, త్వరలో నిర్మించబోయే ‘ఓం’ నగరాన్ని, రామోజీని పొగడ్తల వర్షంలో ముంచేశారు. కేసీఆర్ నోటి వెంట ఆంధ్రులను తిట్టడమే విన్నవారికి ఇది ఒక పిడుగులాంటి పరిణామం. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ‘‘లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలింసిటీని దున్నుతాం’’ అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడిలా రామోజీని లక్ష పొగడ్తలతో ముంచేయడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని బిత్తరపోయేలా చేసింది. జనానికి షాకులివ్వడం కేసీఆర్‌కి కొత్త కాదు. అయితే ఇంత పెద్ద షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఆ షాక్ నుంచి జనం తేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం వుంది. ఊరికే పొగడరు మహానుభావులన్నట్టుగా రామోజీని కేసీఆర్ ఈ రకంగా పొగడ్డం వెనుక వున్న అసలు కారణాన్ని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

దొరతనం పుష్కలంగా వున్న కేసీఆర్ మొదటి నుంచీ రామోజీరావుకు చెందిన సామాజికవర్గం అంటే విపరీతమైన మంట. రాష్ట్ర విభజనను ఆ సామాజికవర్గానికి చెందినవారే విపరీతంగా వ్యతిరేకించారన్న ఆగ్రహం ఆయనకి వుంది. అందుకే తన మాటల్లో, చేతల్లో ఆ కులం మీద తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ వుండేవారు. ఆ కులానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న అక్కసు కూడా ఆయన మాటల్లో ధ్వనిస్తూ వుండేది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు రామోజీరావు ఆహ్వానించకుండానే ఫిలిం సిటీకి వెళ్ళడానికి, పొగ్గడ్డానికి వెనుక వున్నది రాజకీయ కారణాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

 

ఉద్యమం చేస్తున్న సమయంలో ఆ సామాజికవర్గానికి చెందిన వారిని కేసీఆర్ ఎంత ఘాటుగా విమర్శించినా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు బలమైన ఆ సామాజికవర్గాన్ని తిట్టి ఉపయోగం లేదని కొంతమంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు కేసీఆర్‌కి ఉపదేశం చేసినట్టు సమాచారం. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, ఇప్పటికే చెందిన అభివృద్ధి ఆగిపోకుండా వుండాలంటే ఆ సామాజికవర్గంతో అనుబంధాన్ని పెంచుకోక తప్పదని వారు సూచించినట్టు తెలుస్తోంది.

 

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రామోజీరావు మీద, ఫిలింసిటీ మీద, మార్గదర్శి మీద కక్షగట్టి వ్యవహరించారు. అది అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని రామోజీ కులస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రామోజీ మీద చేస్తున్న దాడి తమ సామాజికవర్గం మీద చేస్తున్న దాడిగానే అందరూ భావించారు. దాంతో వారంతా క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు. ఇప్పుడు వైఎస్సార్ చేసిన తప్పే మీరూ చేయడం ఎందుకని కేసీఆర్ సన్నిహితులు చెవిలో ఇల్లు కట్టుకుని బోధించినట్టు భోగట్టా.

 

తెలంగాణలో పెట్టుబడులు పెట్టినవారిలో, భారీ సంఖ్యలో పరిశ్రమలు నిర్వహిస్తున్నవారిలో ఆ కులానికి చెందిన వారే ఎక్కువమంది వున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వాళ్ళంతా మూటాముల్లె సర్దుకుని ఆంధ్రప్రదేశ్‌కి తరలి వెళ్ళిపోతే తెలంగాణకు తీరని నష్టం జరిగే ప్రమాదం వుంది. ఇప్పటికే ఆర్థిక కష్టాలు ప్రారంభమైన తెలంగాణకు అది మరొక పెద్ద కష్టం అయ్యే అవకాశం వుంది. అందుకే ఆ కులాన్ని మంచి చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. అందులో భాగమే రామోజీని పొగడ్డం, అదే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇవ్వబోవడం అని విశ్లేషకులు అంటున్నారు.

 

ఇవాళో రేపో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖతోపాటు విద్యుత్ శాఖను కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇది కూడా కేసీఆర్ రాజకీయ వ్యూహంలో ఒక భాగమే. తెలంగాణ రాష్ట్రంలో విద్యుదుత్పాదన కంపెనీలు నిర్వహిస్తున్నవారు, బిల్డర్లు ఎక్కువమంది తుమ్మల సామాజికవర్గానికి చెందినవారే. ఆ రెండు రంగాలకూ తుమ్మలను మంత్రిగా చేయడం వల్ల తన సామాజికవర్గానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా తుమ్మల చేయగలరన్న నమ్మకంతోనే కేసీఆర్ ఆ రెండు శాఖలను తుమ్మలకు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల హోంశాఖ మంత్రి కావాలన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కేసీఆర్ ఆయనను ఈ రెండు శాఖలనే కేటాయించనున్నారని తెలుస్తోంది.

 

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గం టీఆర్ఎస్‌కి దూరమైపోయింది. కాంగ్రెస్ నాయకుడు జానా ఛార్మ్ కోల్పోవడంతో ఇప్పుడు అందరూ టీడీపీ నాయకుడు రేవంత్ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అని వాళ్ళు నమ్ముతున్నారు. రేవంత్ సామాజికవర్గానికి రామోజీ సామాజివర్గం వాళ్ళు కూడా కలిశారంటే అది రాజకీయంగా టీఆర్ఎస్‌కి పెద్ద నష్టం చేసే అవకాశం వుంది. దాంతో రేవంత్ కులం ఎలాగూ తనకు దూరమైపోయింది... ఇప్పుడు రామోజీ కులాన్నయినా దగ్గర చేసుకోవాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంచేత లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలింసిటీని కేసీఆర్ దున్నితే చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఇక ఆశలు వదులుకోవడం మంచింది.

By
en-us Political News

  
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.