నందమూరివారికి పార్టీని అప్పగించితేనే బెటర్!

Publish Date:Mar 7, 2013

Advertisement

 

‘తెలుగుదేశం పార్టీకి నందమూరి కుటుంబ సభ్యులు నాయకత్వం వహిస్తేనే మేలు!’ జరుగుతుందని ఒక పెద్దాయన అభిప్రాయ పడ్డారు. కాకపొతే ఆ మాటన్నది వయా ప్రజారాజ్యం-కాంగ్రెస్ పార్టీలో చేరి దేవాదాయశాఖ తీర్ధం పుచ్చుకొన్నసి.రామచంద్రయ్య కావడమే విశేషం.

 

ఇటీవల ఆయన వైజాగ్ వచ్చినప్పుడు మీడియావారితో మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు రోజుకొక కొత్త వాగ్దానం చేస్తూ ఎలాగయినా ప్రజలను మభ్యపెట్టి తిరిగి అధికారంలోనికి రావాలని పాపం ఆయన ఆశ పడుతున్నారు. అయితే, ఆయన కల కలగానే మిగిలిపోక తప్పదు. నిజంగా ఆయన తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకొంటే, పార్టీ బాధ్యతలను నందమూరి కుటుంబ సభ్యులెవరికయినా అప్పగించి తానూ పార్టీ నుండి తప్పుకొంటే ఆ పార్టీకి గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆయన ఇప్పుడు చేస్తున్న వాగ్దానాలతో పాటు మరో ప్రకటన కూడా చేయడం మంచిది. అది ‘త్వరలో తెలుగు దేశం పార్టీ చచ్చిపోబోతోందని’ ప్రకటించడం. ఆయన నేతృత్వంలో ఆ పార్టీ అధికారంలోకి రాదని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.

 

తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, “అసలు ఆ పార్టీ నేతలు తమ పార్టీ అధికారం లోకి రాగలదని ఎలా విశ్వసిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. ఒకపక్క వారి అధినేత అక్రమాలకూ పాల్పడి జైల్లో ఉన్నపటికీ, ప్రజలు అవేమి పట్టించుకోకుండా ఆయన పార్టీకే ఓటేస్తారని ఎలా నమ్ముతున్నారు? ప్రజలకి ఆయన అక్రమార్జనల గురించి ఏమీ తెలియదని భావిస్తున్నారా లేక వాటిని పట్టించుకోరని భావిస్తున్నారా? వారే చెప్పాలి.”

 

“వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాదించడం ఖాయం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల ప్రయోజనాలను కాపాడగలదు. దేశాన్ని ముందుకు నడిపించగల శక్తి గలది,” అని తెలిపారు.

 

రామచంద్రయ్య గారు ప్రస్తుతం కాంగ్రెస్ గొడుగు క్రింద సేద తీరుతున్నారు గనుక, కాంగ్రెస్ పార్టీకి ‘టముకు’ వేసుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ప్రతిపక్ష పార్టీ ఎవరిని అధినేతగా పెట్టుకొవాలో ఆయన చెప్పడం మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన గౌరవం లేదని నిత్యం వాపోయే ఆయన, ముందు తన సంగతి గురించి ఆలోచించక ప్రతిపక్ష నేతల గురించి,వారి పార్టీల గురించి ఆలోచించి ఎందుకు శ్రమ పడుతున్నారో ఆయనకే తెలియాలి.

 

ప్రజారాజ్యం పార్టీ గత ఎన్నికల సమయంలో దాదాపు కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నపుడు ఆపార్టీకి చెందిన ప్రభాకర్, హరిరామ జోగయ్యవంటి అనేక మంది సీనియర్లు చిరంజీవికి తగిన సలహా ఇచ్చేందుకు ప్రయత్నించినప్పుడు, రామచంద్రయ్య గారు మాత్రం తన టికెట్టు, గెలుపు సంగతే చూసుకొన్నారు. తత్ఫలితంగా చిరంజీవికి మంచి చెప్పినవారు బయటకిపోవలసి వచ్చింది. రామచంద్రయ్యవంటివారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ గంగలో కలిపేందుకు మాత్రం చాలా శ్రమ పడినందుకు మంత్రి పదవులు పుచ్చుకోగలిగారు.

 

స్వంత పార్టీ అధినేతకు కనీసం మాట సహాయం కూడా చేయని ఆ పెద్దమనిషి ఇప్పుడు ప్రతిపక్షం గురించి అడగకుండా ఉచిత సలహాలు ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఆయనకు టికెట్ ఈయకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారని హామీ ఈయగలారా?అని తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లు అడగితే ఆయన ఏమి సమాధానం చెపుతారు?

By
en-us Political News

  
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.