ఇదేమిటి రామచంద్ర ప్రభు..!

Publish Date:Nov 21, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి నేటి వరకు లక్ష అరవై వేల కోట్ల రూపాయిల అవినీతి చేశారని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్.. పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పులివెందుల ఎస్సైని ఆయన కోరారు. అనంతరం పులివెందుల పోలీస్ స్టేషన్ బయట ముఖ్యమంత్రి   జగన్‌పై రామచంద్రయాదవ్ పలు ఆరోపణలు సంధించారు. అయితే సీఎం జగన్‌ అవినీతిపై రామచంద్రయాదవ్ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 

సీఎం వైయస్ జగన్‌ అవినీతిపై రామచంద్రయాదవ్ ఫిర్యాదు చేయడంపై నెటిజన్లు ఫక్కున నవ్వుతున్నారు. ఇప్పటికే  జగన్‌పై అక్రమ ఆస్తుల కేసులు చాలానే ఉన్నాయని..  అందులోభాగంగానే ఆయన 16 నెలల పాటు చంచల్ గూడ జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చి.. ముఖ్యమంత్రి అయ్యారని వారు గుర్తు చేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో ఇసుక అక్రమ తవ్వకాలు, మైనింగ్, జే బ్రాండ్ మద్యం విక్రయాలు, డ్రగ్స్ దందా, గంజాయి అక్రమ రవాణా వగైరా వగైరా ఆరోపణలు   జగన్ ప్రభుత్వంపై ఉన్నాయని.. మరి ఇన్నాళ్లూ ఊరుకొని.. జస్ట్ ఎన్నికలకు ముందు ఇలా సీఎంగారి అవినీతి బాగోతంపై.. అదీ కూడా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో వివరించాలని రామచంద్రయాదవ్‌ను నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.  

ఇప్పటికే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పంచాయతీ నిధుల దారి మళ్లింపు, లెక్కకు మించి చేస్తున్న అప్పులపై రాష్ట్ర గవర్నర్‌ను కలిసి స్వయంగా ఫిర్యాదు చేశారని..  అలాగే హద్దు అనేదే లేకుండా జగన్ ప్రభుత్వం అప్పుల చేస్తుందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆమె స్వయంగా లేఖ సైతం రాశారని.. అదే విధంగా జే బ్రాండ్ మద్యం తాగి ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు రాష్ట్రంలో అధికమవుతోందని.. ఇక మద్యం తాగి మరణిస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే ఉంటుందని.. ఆమె ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. ఢిల్లీ వెళ్లి సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి.. జగన్ పాలనలో ఈ నాలుగున్నరేళ్లలో చోటు చేసుకొన్ని ప్రతి అంశాన్ని   ప్రస్తావిస్తూ.. ఓ లేఖను కూడా అందజేశారని.. కానీ ఆ రోజు నుంచి.. ఈ రోజుకు జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకున్న దాఖలాలు  లేవని నెటిజన్లు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. 

అలాంటి వేళ... రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేస్తే.. అదీకూడా సీఎం  జగన్ సొంత ఇలాకా పులివెందులకు వెళ్లి కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయడమేమిటని నెటిజన్లు  సందేహం  వ్యక్తం చేస్తున్నారు. అయినా.. ఈ రామచంద్రయాదవ్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరుకు చెందిన వారని.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. సీఎం జగన్ రైట్ హ్యాండ్ వైసీపీ నాయకుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా వాసి అని వారు వివరిస్తున్నారు.

అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఈ రామచంద్ర యాదవ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని వారు అంటున్నారు. అవి కూడా ఎంతగా అంటే.. అపాయింట్‌మెంట్ లేకుండా.. అమిత్ షాను నేరుగా కలిసేటంత  అంటున్నారు.  అలాంటిది జగన్ అవినీతిపై రామచంద్రరావు ఏపీ పోలీసులకు అందునా పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయడమేంటని అంటున్నారు. అంత కంటే రామచంద్రయాదవ్ నేరుగా   అమిత్ షాకు ఫిర్యాదు చేస్తే ఫలితముండేదేమోనని నెటిజన్లు సూచిస్తున్నారు. అదీకాక జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై ఓ వైపు అక్రమ కేసుల నమోదు,  మరోవైపు ఆయా పార్టీ శ్రేణులపై వరుస దాడులు జరుగుతున్నాయని.. అందుకు అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు ఏ జిల్లా.. ఏ ప్రాంతం మినహాయింపు కాదని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అలాంటిది.. సీఎం  జగన్ అవినీతిపై ఫిర్యాదు చేయడం చూస్తుంటే... ఇది పక్కా ఎన్నికల స్టంట్ అని వారు అభిప్రాయపడుతున్నారు. 

అయినా.. వైయస్ జగన్ 16 నెలలు శ్రీకృష్ణుడి జన్మస్థానంలో ఉండి..  ఏడు ఊచలు పదే పదే లెక్కించాడని తెలిసి కూడా ఆయన వద్ద ఉన్న లక్ష కోట్ల రూపాయిల్లో ఎంతో కొంత తమకు ఇచ్చేస్తాడనుకొని.. ఆయన పార్టీకి 151 ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలను ఇచ్చి బంపర్ మెజార్టీతో గెలిపించిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ వాసులదని.. అలాంటి  జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్రంలోని పెద్దలకే ఫిర్యాదు చేసినా లేఖల ద్వారా వివరించానా.. వారి నుంచి కనీస స్పందన కూడా లేదని.. అలాంటిది మీరు పులివెందుల వెళ్లి.. జగన్ అవినీతిపై ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు నమోదు చేస్తారా? ఓ వేళ వారు కేసు నమోదు చేసినా? జగన్ బాబు అవినీతిపై పోలీసులు దర్యాప్తు చేస్తారా? అంటే.. ఈ విషయం అంత నమశక్యంగా లేదని.. ఎందుకంటే.. ఇది ప్రజాస్వామ్య దేశమని..  అదీకూడా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని.. అలాంటి దేశంలో చోరులు, బడా చోరులు, దొరలు, స్కామ్‌ల్లో నిండా మునిగి తేలుతున్న వారు, బాబాలు, స్వామిజీలు, సన్యాసులు వగైరా వగైరా ఎవరైనా అవినీతి చేయవచ్చు, అలాగే అందలం ఎక్కవచ్చని.. కానీ వారు తప్పు చేశారు... అవినీతి చేశారని ఫిర్యాదు చేస్తే మాత్రం.. మన దేశంలోని దాదాపుగా అన్ని వ్యవస్థలకు ఆటోమెటిక్‌గా పక్షవాతం వచ్చేస్తుందని,  అదే పేదలు, నిరుపేదలు, మద్య తరగతి జీవులు .. రూపాయో, పది రూపాయిలో దొంగతనం చేస్తే మాత్రం .. వారిని శిక్షించేందుకు దాదాపుగా అన్ని వ్యవస్థలు పానకం తాగి పూనకం వచ్చినట్లుగా.. ఇంకా చెప్పాలంటే.. ఆయా వ్యవస్థలకు ప్రతినిధులుగా, జవాబుదారీతనానికి అసలు సిసలు నిర్వచనంలాగా నిండు చలాకీతనంతో వ్యవహరిస్తారని నెటిజన్లు తమదైన శైలిలో వివరిస్తున్నారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.