అయోధ్యలో రామాలయాన్ని నిర్మించేందుకు త్వరలో ఆలయ ట్రస్టు పనులు మొదలుపెట్టబోతోంది. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రం ట్రస్ట్ ఏప్రిల్ నుంచి పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉంది. విరాళాల సేకరణ, ఆలయ నమూనా, భక్తుల సౌకర్యాల వంటి వాటిపై ట్రస్ట్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఏప్రిల్ రెండున శ్రీరామనవమి కావడంతో అదే రోజు పనులు ప్రారంభం కావచ్చు. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన కసరత్తు వేగవంతం అయ్యింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ని కూడా ఏర్పాటు చేయటంతో త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. సీనియర్ అడ్వకేట్ పరాశరన్ ఛైర్మన్ గా పదిహేనుమంది సభ్యులతో కేంద్ర హోంశాఖ ట్రస్ట్ ను నోటిఫై చేసింది. ప్రయాగ్ రాజ్ లో ట్రస్టు తొలి సమావేశం జరుగుతుంది. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలన్నది తొలి సమావేశంలో నిర్ణయిస్తారు. ఏప్రిల్ రెండున శ్రీరామ నవమి, ఏప్రిల్ ఇరవై ఆరున అక్షయ తృతీయ ఈ రెండింటిలో ఏదో ఒక రోజు ఆలయ పనులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
ఆలయ నిర్మాణం కోసం నగదు, ఆస్తుల రూపంలో ఎవరు విరాళాలిచ్చినా షరతుల్లేకుండా స్వీకరిస్తామని ట్రస్టు ప్రకటించింది. అయోధ్యలో ఆలయ నిర్మాణం, నిర్వహణ కోసం ఏదైనా సంస్థ నుంచి రుణాలు తీసుకునే అధికారాన్ని కూడా ట్రస్టుకే కట్టబెట్టింది ప్రభుత్వం. ట్రస్ట్ బాధ్యతలు ఎలా ఉండాలనే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నిబంధనలను రూపొందించింది. ట్రస్ట్ శాశ్వత కార్యాలయం ఏర్పాటు విరాళాల సేకరణ ఆలయ నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోవటం ఇలాంటి ప్రతి అంశానికీ ట్రస్టుదే బాధ్యతని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆలయ నిర్మాణాన్ని చేపట్టి రెండేళ్ళల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ram-mandir-work-in-ayodhya-to-begin-in-april-25-93939.html
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.